అరాచకాన్ని వీడి.. ప్రగతి బాట
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు.
తెదేపాలో చేరుతున్న వైకాపా నేతలు
ఈనాడు-తిరుపతి: రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు సమీపిస్తోందని వైకాపా నేతలు గ్రహిస్తున్నారు. పార్టీని వీడితే ఇబ్బందులకు గురి చేస్తారని, ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తారని ఇన్నాళ్లూ భయపడుతూ వచ్చిన వైకాపా నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారు. పార్టీలో జరుగుతున్న అరాచకాలను ఎండగడుతున్నారు. ఇప్పటికే జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికార పార్టీని వీడి బయటకు రాగా తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన వైకాపా నేతలు గురువారం రాజీనామాలు చేశారు. రానున్న రోజుల్లో మరింత మంది వైకాపాను వీడేందుకు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిందని, అందరూ స్వేచ్ఛగా బయటకు వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునకు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముగ్గురు జడ్పీటీసీలు, ఓ జడ్పీటీసీ మాజీ సభ్యుడు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. గురువారం తిరుపతి కార్పొరేటర్లు అనితయాదవ్, సంధ్యయాదవ్లు వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేశారు. కార్పొరేటర్లుగా తమకు సముచిత న్యాయం లేదంటూ వారు వెల్లడించారు. వెంకటగిరిలో కౌన్సిలర్ పొట్టేళ్ల ప్రభావతి తెదేపాలో చేరారు. బుధవారం చంద్రబాబు సమక్షంలో పుత్తూరు కౌన్సిలర్లు భువనేశ్వరి, కెన్నడీలు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన రాష్ట్ర సాహితి అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరి, వైకాపా యువత విభాగం ప్రధాన కార్యదర్శి కరుణాకర్రెడ్డి తదితరులు తెదేపాలో చేరారు.
దౌర్జన్యాలు సహించలేక.. .
గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా నేతల దౌర్జన్యాన్ని, అరాచకాలను సహించలేక ఆ పార్టీ కార్యకర్తలే భీతిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమనూ ఇబ్బందులకు గురి చేస్తారని వైకాపా కార్యకర్తలు గుర్తించారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తిలోని ముస్లింలు, యువత, వైకాపా సీనియర్ నేత లక్కమనేని మధు తన అనుచరులతో ఇటీవలే తెదేపాలో చేరారు. ఏర్పేడు మండలం అంజిమేడుకు చెందిన వైకాపా రాష్ట్ర యూత్ కార్యదర్శి మోహన్రెడ్డితోపాటు సీతారాంపేట, గోవిందవరం, పాపానాయుడుపేట, పల్లం ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు, గుంటకిందపల్లి, తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు చిట్టత్తూరు, బసవయ్యపాలెం, సాంబయ్యపాలెం, కాసరం తదితర గ్రామాల ప్రజలు వైకాపాను వీడుతున్నారు. గూడూరు పరిధిలో చెన్నూరుకు చెందిన వైకాపా నేతలు కరుణాకర్రెడ్డి, ఎలసిరి శ్రీనివాసరెడ్డి, శ్రీకిరిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జనార్దన్రెడ్డి తదితరులు తెదేపాలో చేరారు. గూడూరు నియోజకవర్గంలోని తిక్కవరం, ముత్యాలపాడు, తొండుమాకుల గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు తెదేపాలోకి వచ్చారు. వెంకటగిరి, సూళ్లూరుపేట, సత్యవేడు పరిధిలోనూ పలువురు తెదేపాలో చేరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
[ 28-04-2024]
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
[ 28-04-2024]
సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
తిరుమల శ్రీవారి సన్నిధిలో విశేష ఉత్సవాలు
[ 28-04-2024]
తిరుమల శ్రీవారి సన్నిధిలో తితిదే ఆధ్వర్యంలో మే నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. -
శ్మశానాలకు సమాధి.. ఆక్రమణలకు పునాది
[ 28-04-2024]
వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. -
ప్రాజెక్టుల పుణ్యం ఎన్టీఆర్దే..!
[ 28-04-2024]
రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. -
కుప్పంలో వైకాపా హైడ్రామా..?
[ 28-04-2024]
వైకాపా అడుగడుగునా కోడ్ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా. -
భృతిలేక.. పీఆర్సీ అమలుకాక
[ 28-04-2024]
‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు.. -
భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు
[ 28-04-2024]
వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
‘జగన్కు ఆ నలుగురే మిగిలారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు. -
‘అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలి’
[ 28-04-2024]
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
ఇదేంది జగన్.. ఇలా ముంచేశావ్
[ 28-04-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. -
‘హమీ’తుమీ తేల్చవేం జగన్
[ 28-04-2024]
మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. -
సీఎం వస్తున్నారని హడావుడి పనులు
[ 28-04-2024]
త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా