logo

స్వర్ణరథంపై ప్రమాణాల స్వామి విహారం

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు.

Published : 29 Mar 2024 02:52 IST

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారు సిద్ధిబుద్ధి సమేతుడై స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ గురువారం రాత్రి భక్తులను అలరించారు. స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయ అలంకార మండప వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వర్ణ రథంపై అధిష్ఠించి గణేశ నామస్మరణల నడుమ ఊరేగించారు. ఈవో ఎ.వెంకటేశు, డిప్యూటీ ఈవో వాణి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెం డెంట్లు కోదండపాణి, ధనుంజయ, ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, భక్తులు పాల్గొన్నారు.

సంకటహర గణపతి వ్రతం:  వినాయకస్వామి ఆలయంలో సంకటహర చతుర్థి సందర్భంగా గురువారం ఉదయం, సాయంత్రం శాస్త్రోక్తంగా నిర్వహించిన సామూహిక సంకటహర గణపతి వ్రతంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సిద్ధిబుద్ధి సమేతుడైన వరసిద్ధి వినాయకస్వామి వారి ఉత్సవమూర్తులకు పుష్పాలంకరణ చేసి అర్చకులు, వేదపండితులు వ్రతాన్ని నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని