భూసార పరీక్షలెక్కడ జగనన్నా..!
భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి.
పంట నాణ్యత, దిగుబడులపై ప్రభావం
చిత్తూరు (వ్యవసాయం): భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని తెలుసుకుని తదనుగుణంగా చర్యలు చేపడితే అన్నదాతలు అధిక దిగుబడులు సాధించి అప్పుల ఊబి నుంచి బయటపడతారన్నది ఉద్దేశం.. అందుకు భూసార పరీక్షలు తప్పనిసరి. కానీ.. ఇంతటి కీలకమైన అంశంపై ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.. ఐదేళ్లలో జిల్లాలో భూసార పరీక్షల అటకెక్కాయి.. గతేడాది నామమాత్రంగా మట్టి నమూనాలు సేకరించినా ఫలితం అన్నదాతకు అందలేదు. ఆర్బీకేల ద్వారా మట్టి నమూనాలకు శ్రీకారం చుట్టినా లక్ష్యం నిస్సారమవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6.2 లక్షల మంది రైతులు ఉండగా.. ఏటా ఖరీఫ్ సాధారణ సాగు 1.98 లక్షల హెక్టార్లు. రబీలో 98 లక్షల హెక్టార్లు. జిల్లాల విభజనతో చిత్తూరు జిల్లాలో వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఖరీఫ్లో 1.12లక్షల హెక్టార్లు, రబీలో 55-60వేల హెక్టార్లకు పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో తిరుపతి, చిత్తూరు, కుప్పం, శ్రీకాళహస్తి, మదనపల్లెలో ప్రయోగశాలలు ఉన్నాయి.
గతంలో ఇలా..
భూసార పరీక్షలు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు నిధులిచ్చింది. ఈవ్యవధిలో ప్రతి గ్రామంలో అక్కడి అన్ని కమతాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. ఒక్కో మట్టి నమూనాకు రూ.300-400 చొప్పున విడుదల చేసింది. ఆ తర్వాత పథకం రద్దవడంతో నిధులు ఆగిపోయాయి. గతంలో ఏటా ఖరీఫ్కు ముందు ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో 90 వేల నుంచి 1.2 లక్షల వరకు మట్టి నమూనాలులక్ష్యంగా సేకరించి ఆపై వాటిని ప్రయోగశాలల్లో పరీక్షించారు. ఫలితాలతో కూడిన సాయిల్ హెల్త్కార్డు రైతులకు అందజేసేవారు.
రైతు ‘భరోసా’ అంటున్నా..
జిల్లాలో 502 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపాలని నిర్ణయించినా అమలు కాలేదు. గత ప్రభుత్వం మండలానికి రెండు చొప్పున భూసార పరీక్ష కిట్లు(యంత్రాలను) కేటాయించింది. ఒక్కో యంత్రానికి రూ.లక్ష ఖర్చు చేసి.. వీటిని సమకూర్చారు. ఇలా జిల్లాలోని 66 మండలాలకు సుమారు 102 భూసార పరీక్ష యంత్రాలు అందాయి. వీటిని రైతు భరోసా కేంద్రాల్లో ఉంచి.. రైతులు మట్టి నమూనాలు పరీక్ష చేయించుకోవచ్చని నిర్ణయించారు. ఆర్బీకేల్లో భూసార యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్న విషయం రైతులకు పూర్తి స్థాయిలో తెలియదు.
గతేడాది సేకరించారంతే..
గతేడాది ఖరీఫ్ సీజన్కు ముందు ఆర్బీకేకి రెండు చొప్పున 502 ఆర్బీకేలకు సంబంధించి 1,004 మట్టి నమూనాలు సేకరించారు. ఆ తర్వాత రబీకి ముందు ఆర్బీకే 30-32 చొప్పున జిల్లా వ్యాప్తంగా 15 వేల నమూనాలు సేకరించారు. భూసార పరీక్ష ఫలితాల కార్డులు రైతులకు చేరలేదు. పరీక్షలు పూర్తి చేశాం.. ఆన్లైన్లో పొందుపరిచామంటూ అధికారులు చెబుతున్నారే తప్ప.. ఫలితం అన్నదాతకు అందలేదు. ఇవేం పరీక్షలంటూ ప్రభుత్వ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్మశానాలకు సమాధి.. ఆక్రమణలకు పునాది
[ 28-04-2024]
వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. -
ప్రాజెక్టుల పుణ్యం ఎన్టీఆర్దే..!
[ 28-04-2024]
రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. -
కుప్పంలో వైకాపా హైడ్రామా..?
[ 28-04-2024]
వైకాపా అడుగడుగునా కోడ్ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా. -
భృతిలేక.. పీఆర్సీ అమలుకాక
[ 28-04-2024]
‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు.. -
భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు
[ 28-04-2024]
వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
‘జగన్కు ఆ నలుగురే మిగిలారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు. -
‘అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలి’
[ 28-04-2024]
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
ఇదేంది జగన్.. ఇలా ముంచేశావ్
[ 28-04-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. -
‘హమీ’తుమీ తేల్చవేం జగన్
[ 28-04-2024]
మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. -
సీఎం వస్తున్నారని హడావుడి పనులు
[ 28-04-2024]
త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు