ఊసరవెళ్లే నయమనిపింఛెను
అవ్వతాతలకు మనవడిగా.. ఒంటరి మహిళలకు, వితంతవులు, దివ్యాంగులకు అన్నగా.. తమ్ముడిగా చేనేత కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు పింఛన్ మూడు వేలకు పెంచుతామంటూ మాటిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు.
ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు సుమారు 5 లక్షలు
ఐదేళ్లలో 32 వేల మంది తొలగింపు
గూడూరు, న్యూస్టుడే
అవ్వతాతలకు మనవడిగా.. ఒంటరి మహిళలకు, వితంతవులు, దివ్యాంగులకు అన్నగా.. తమ్ముడిగా చేనేత కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు పింఛన్ మూడు వేలకు పెంచుతామంటూ మాటిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు. రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామంటూ మాట మార్చారు.
- ధికారంలోకి రాగానే రూ.3 వేలిస్తానని మాట తప్పిన జగన్
- యిదా పద్ధతుల్లో పెంపు
- దేళ్లలో రూ.1,652.70 కోట్లు ఎగవేత
ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నారు. వీరికి ఎన్నికల ముందే పెంచి ఇస్తామన్న జగన్ వాయిదాల పద్ధతిలో పెంచారు. పేదల ఆశలకు గండి కొట్టిన సీఎం కొత్త లబ్ధిదారులు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తోంది. 45 ఏళ్లకే పింఛన్ అన్న మాటకు వక్ర భాష్యం చెప్పారు. అర్హత ఉండీ దరఖాస్తు చేసుకున్న వారికి చుక్కలు చూపించారు. ఆరంచెల పేరిట కోత పెట్టి ముప్పుతిప్పలు పెట్టారు. అటు ఆధార్, ఇటు ఆస్తి పన్నులు, ఆదాయ పన్నులు, భూములు, రవాణా శాఖ వెబ్సైట్లు లింకు చేసి అర్హత లేకుండా చేశారు. ఇలా ఐదేళ్లలో వేల మందిని తొలగించిన జగన్ మళ్లీ ఏడాది ఆరంభంలో కొత్తగా ఇస్తున్నట్లు చెప్పి అడ్డదారులు తొక్కారు.
ఒక్క మాటకు అనేక అర్థాలు.. పెంచి పింఛన్లు ఇస్తామన్న జగన్ పెంచుతూ పోతామన్నట్లు ఎన్నికల తర్వాత కూని రాగం తీశారు. ఇలా నాలుగేళ్లు పెంచుకుంటే ఐదో ఏట మూడు వేలకు పెంచారు. ఒక్కో లబ్ధిదారుడు సుమారుగా తొలి రెండేళ్లు రూ.21 వెయ్యి నష్టపోయారు. ఇలా నెలకు రూ.750 లెక్కన 28 నెలలు పెంచలేదు. ఆ తర్వాత 2022లో 2500 చేయగా ఆ ఏడాది 12 నెలల నష్టం రూ.6 వేలు, 2023లో రూ.2750 చేయగా ఏడాది నష్టం రూ.3 వేలు కాగా ఇలా ఒక్కో లబ్ధిదారుడు రూ.30 వేలు నష్టపోయారు. ఇలా ఐదేళ్లలో 5 లక్షల మందికి సుమారు రూ.1600 కోట్లు ఎగనామం పెట్టారు.
ఆరంచెల పరిశీలన పేరుతో కోత..
ప్రభుత్వానికి ఉన్న అనేక మార్గాల ద్వారా లబ్ధిదారుల వివరాలు సరిచూసి ఏరివేశారు. పెంపుపై దృష్టి పెట్టని జగన్ సర్కార్ రెండన్నరేళ్లు ఏరివేతలు చేపట్టారు. భూములు ఎక్కువున్నట్లు, ఆధార్లో పుట్టినతేదీ పొరపాట్లు, 300 యూనిట్ల కరెంట్, రేషన్కార్డుల్లో తప్పులు, ఆస్తి ఎక్కువగా ఉండటం.. కార్లు, ఇతర వాహనాలు, ఆదాయపు పన్నులు చెల్లిస్తున్నట్లు వెరసి అనేక కుంటి సాకులు చూపించారు. ఈ ఐదేళ్లలో లక్షకు పైగా ఇలా ఏరివేతలు చేసిన జగన్ కొత్త పింఛన్కు ఏడాది ఆగాలని పరోక్షంగా వెల్లడించారు.
ఐదేళ్లుగా తిరుగుతున్నా
- నావూరు కృష్ణయ్య, నాయుడుపేట
మూర్చవ్యాధిగ్రస్థుడిగా.. బేల్దారి పనిచేస్తుంటా. గతంలో పింఛన్ వచ్చేది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు పోగొట్టుకుపోయింది. ఒంటరి కావడంతో సొంతూరు నుంచి నాయుడుపేట వచ్చేశా. ఇక్కడ ఆధార్ కార్డు తిరిగి తీసుకుని రేషన్కార్డుకి దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. పింఛన్కు వెళితే కార్డు లేదన్నారు. ఇలా అనేక పర్యాయాలు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా దిక్కు లేకుండా పోయింది.
300 యూనిట్లు వచ్చిందని ఆపేశారు
- కమలమ్మ, కాలేపల్లి, రామచంద్రాపురం మండలం
కరెంట్ బిల్లు 300 యూనిట్లు వచ్చిందని నాకు వస్తున్న పింఛన్ ఆపేశారు. వృద్ధుల విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదు. ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు వస్తున్న వారికీ రాష్ట్రవ్యాప్తంగా ఒకటి ఆపేశారు. నా పింఛన్ డబ్బుతో కుటుంబ పోషణకు ఉపయోగించుకునేవారం. ఇప్పుడు అప్పుచేసే పరిస్థితి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిత్తూరు వైకాపా అభ్యర్థి కార్యాలయంలో నగదు స్వాధీనం
[ 29-04-2024]
చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లిలో చిత్తూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్ధి విజయానంద రెడ్డి కార్యాలయంలో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సోదాలు చేపట్టింది. -
పులివర్తి నానికి భద్రత కల్పించండి.. హైకోర్టు ఆదేశం
[ 29-04-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి 1+1 సెక్యూరిటీ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛను ఎందుకివ్వరు?: చంద్రబాబు
[ 29-04-2024]
వైకాపా కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. -
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
[ 29-04-2024]
ఏపీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని శ్రీవారిని ప్రార్థించానని సినీనటి, భాజపా నాయకురాలు జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆమె దర్శించుకున్నారు. -
అంతా సొంత డబ్బా.. హామీలపై మాట్లాడరేమబ్బా!
[ 29-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో నిర్వహించిన సభ ఆత్మస్తుతి, పరనిందలా సాగింది. తన హయాంలో పథకాలు తెచ్చి సామాన్యుల జీవితాలను మార్చానంటూ గొప్పలు చెప్పుకొన్న సీఎం.. చంద్రబాబు హయాంలో ఒక్క పథకం పేరు గుర్తుకురాదని చెప్పడం ప్రజలను తీవ్ర విస్మయానికి గురిచేసింది. -
మాటలే తీపి.. లబ్ధిదారులకు టోపీ
[ 29-04-2024]
పేదలకు చేదు మిగిల్చిన ఘనత జగనన్న పాలనకే దక్కుతుంది.. బియ్యం కార్డుదారులకు ఇంటికే అన్ని రకాల నిత్యావసరాలు అందజేస్తున్నామంటూ ఆర్భాటపు ప్రకటనలు తప్ప క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. -
దాడులు, అరాచకమే ఎజెండా
[ 29-04-2024]
అరాచకమే ఎజెండాగా ఎన్నికల్లో నెగ్గాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుయుక్తులు పన్నుతున్నారు. ఈ క్రమంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయా అంటే తాజా పరిస్థితులను పరిశీలిస్తే సందేహమనే సమాధానం వస్తోంది. -
మాటల జ‘గన్’.. చేతల చూ‘ఫన్’
[ 29-04-2024]
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘వైనాట్ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు. -
అయ్యోర్లపై అధికార బెత్తం
[ 29-04-2024]
చిత్తూరు గ్రామీణ మండలం మాపాక్షి జడ్పీ ఉన్నత పాఠశాలను ఇటీవల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్ తనిఖీ చేశారు. ఆ సమయంలో ఏడో తరగతిలో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. -
ఇదేం పని మురుగేషా!
[ 29-04-2024]
బోధనారంగంలో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఆ ఉపాధ్యాయుడికి 2007-08 విద్యాసంవత్సరంలో జిల్లాస్థాయి అవార్డు దక్కింది. దీనిపై స్పందించిన మండల ప్రజాప్రతినిధులు.. కుటుంబ సభ్యుల పేరుతో మూడు ఇంటి పట్టాలు అందించారు. -
అయ్యా.. ఐదేళ్లూ చాలలేదా..?
[ 29-04-2024]
ఒక ప్రాంత అభివృద్ధికి రహదారులు, అద్భుతమైన కట్టడాలే కొలమానం. అలాంటిది చిత్తూరు నగరంలో రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు నానా కష్టాలు పడుతున్నారు. -
‘అరాచక పాలనకు అంతం పలకండి’
[ 29-04-2024]
వైకాపా అరాచక పాలనకు అంతం పలికేందుకు ఎన్నికల రూపంలో అవకాశమొచ్చిందని, ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తెదేపా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు, గురజాల జగన్మోహన్ కోరారు. -
ఏం జరుగుతోంది భగవం‘తుడా’!
[ 29-04-2024]
తుడా.. ఈ పేరెత్తితే చాలు జిల్లా ప్రజల మెదళ్లు గిర్రున తిరుగుతాయి.. వందల అనుమానాలు తలెత్తుతాయి. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను ఒకే ఒక వ్యక్తి తన అమ్ములపొదిగా.. రహస్య స్థావరంగా మార్చేశారంటే అతిశయోక్తి కాదు.. ఆయనే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి. -
దోపిడీలు చేయడంలో డిగ్రీలు
[ 29-04-2024]
ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే డిగ్రీలు చేశారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ మాఫియా రాజ్యమేలుతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం