పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే.
అనుమతులు సాధించలేకపోయిన అటవీ మంత్రి
ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాజెక్టులపై ఏదీ శ్రద్ధ?
వైకాపా వచ్చిన తర్వాత నిలిచిన మల్లెమడుగు జలాశయ పనులు
ఈనాడు-తిరుపతి: ‘ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే.. ఈ స్థాయిలో చక్రం తిప్పుతున్నా.. ఉమ్మడి చిత్తూరు జిల్లా సాగు, తాగునీటి జలాశయాలకు అటవీ అనుమతులు సాధించేందుకు కనీస ప్రయత్నం చేయలేదు. ఇదే శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నా వీటిని విస్మరించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.
జిల్లాకు వరప్రదాయిని గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టును సీఎం జగన్ గాలికి వదిలేశారు. ఇందులో బాలాజీ, మల్లెమడుగు, వేణుగోపాలసాగర్ ప్రధానమైనవి. ఇవి పూర్తయితే తిరుమల, తిరుపతితోపాటు పలు నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు అందించవచ్చు. తెదేపా హయాంలోనే మల్లెమడుగు జలాశయానికి అటవీ భూమి కాకుండా 546.20 ఎకరాలు, బాలాజీ జలాశయానికి 519.30 ఎకరాలు సేకరించారు. వేణుగోపాలసాగర్కు సైతం 1192.24 ఎకరాలకు దాదాపు భూసేకరణ పూర్తయింది. అటవీ భూముల విషయానికి వచ్చే సరికి సమస్య తలెత్తింది. మల్లెమడుగుకు 117.581 హెక్టార్లు, బాలాజీకి 477.75 హెక్టార్లు, వేణుగోపాలసాగర్కు 372.546 హెక్టార్ల భూమి జలాశయాల నిర్మాణానికే సేకరించాల్సి వచ్చింది. ఇందుకోసం కేంద్ర అటవీశాఖ నుంచి తెదేపా హయాంలో తొలి విడత అనుమతులు తెచ్చారు.
వర్షాధారంపైనే..
ఉమ్మడి జిల్లాలో కేవలం వర్షాధారం ద్వారానే జలాశయాల్లో నీటిని నిల్వ చేసుకునే ఆస్కారముంది. రెండేళ్ల క్రితం కురిసిన వర్షానికి తొమ్మిది టీఎంసీల నీరు మల్లెమడుగు జలాశయం నుంచి సముద్రంలో కలిసింది. బాలాజీ చుట్టూ ఉన్న శేషాచల అటవీ ప్రాంతం కారణంగా ఏడాదిలో కురిసే వర్షాలకు కనీసం టీఎంసీ నీటిని నిల్వ చేసుకునే వీలుంటుంది.
వేణుగోపాలసాగర్లోనూ వాన నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నా మంత్రి పెద్దిరెడ్డి మాత్రం దీన్ని పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసం పాత ప్రాజెక్టులను పక్కనబెట్టి జిల్లా ప్రజలకు తీరని ద్రోహం చేశారన్న ఆరోపణలున్నాయి.
స్వప్రయోజనాల కోసం కొనసాగుతున్న ప్రాజెక్టును మంత్రి పెద్దిరెడ్డి పక్కనబెట్టి కేవలం తన స్వార్థ ప్రయోజనాలు, కాంట్రాక్టుల కోసం కొత్తగా ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి జలాశయాల నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్జీటీ మొట్టికాయలు వేయడంతో వెనక్కు తగ్గారు.
పట్టించుకోని నేతలు·
రెండో దశ అనుమతులు తెచ్చే అంశంపైనా తెదేపా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ భూమి గుర్తించి అటవీశాఖకు నివేదించారు. ఆపై వచ్చిన వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రి కావడంతో అటవీ అనుమతులు వస్తాయని ప్రజలు భావించారు. అయితే మూడు జలాశయాలకు రెండో దశ అటవీ అనుమతుల కోసం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, రోజా, బియ్యపు మధుసూదన్రెడ్డిలు ఎటువంటి చొరవ చూపలేదు.
తాగునీటి సదుపాయం: 20 లక్షల మందికి
లబ్ధి పొందే మండలాలు: 11
సాగునీటి సౌకర్యం: 1.03 లక్షల ఎకరాలు
లబ్ధి పొందే మండలాలు: 12
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు సాగుదారు.. జగన్ హక్కుదారు
[ 02-05-2024]
జగనన్న జమానాలో భూ పరిపాలన.. ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం ఏమో కానీ చుక్కలు చూపించింది.. -
పప్పన్నం లేనట్లే..
[ 02-05-2024]
రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెలా బియ్యం కార్డుదారులందరికీ బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి అందజేస్తున్నామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప. -
పరిశ్రమలపై పగ.. ఔత్సాహికులకు దగా
[ 02-05-2024]
-
పొద్దంతా తిప్పారు.. పొద్దుపోయాక పంచారు
[ 02-05-2024]
పింఛనుదారుల్లో కొందరికి ఇంటి వద్ద పంపిణీ చేసేందుకు సచివాలయ సిబ్బంది ఖాతాల్లో ఏప్రిల్ 30నే రూ.22.26 కోట్లు వేశారు. వీరు అదేరోజు నగదు డ్రా చేసి.. -
ఎ‘వరి’కి చెప్పుకోవాలో
[ 02-05-2024]
కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో సాగునీటి ఎద్దడి తీవ్రత అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉద్యాన పంటలు, పశుపోషణపై ఆధారపడిన రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదు. -
ప్రాణాలు పోతున్నాయి జగన్...
[ 02-05-2024]
జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. -
కర్రలు, రాళ్లతో వెంటాడి..
[ 02-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. -
మేనిఫెస్టోలో భాజపా చిత్రాలేవి: మంత్రి పెద్దిరెడ్డి
[ 02-05-2024]
ఎన్డీయే కూటమి మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. -
మీది ప్రజలే అంగీకరించడం లేదు: మాజీ మంత్రి అమర్
[ 02-05-2024]
తేలిపోయిన వైకాపా మ్యానిఫెస్టోను ప్రజలు అంగీకరించడం లేదని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం అప్పినపల్లెలోని నాలుగురోడ్ల కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. -
వైద్యో.. జగనో.. ప్రాణాలు హరీ..!
[ 02-05-2024]
ఆర్టీసీ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలో విలీనమైతే తమ బతుకులు బాగుపడతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఆశ పడ్డారు. విలీనం కోసం ఉద్యమాలు చేశారు -
పోలీసులకు ఒక్కరోజే..!
[ 02-05-2024]
ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
మొదటి రోజు విలపింఛెన్దారులు
[ 02-05-2024]
ప్రభుత్వ తీరుతో నెల మొదటిరోజే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగమాగమైంది. అధికశాతం మందికి అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, -
హామీల వలలో మున్సి‘పల్టీలు’
[ 02-05-2024]
ఎన్నికలొస్తే చాలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలపై ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది. అప్పటికప్పుడు ప్రజల సమస్యలన్నీ తీర్చుతామని హామీల వల విసురుతారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి