కార్మికుడి మృతితో ఉద్రిక్తం
ప్రభుత్వపరంగా జరుగుతున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణ కరవై కార్మికుడు మృత్యువాత పడ్డాడు. యంత్రాలతో చేయాల్సిన పనులను మనుషులతో చేయించి వ్యక్తి మృతికి కారణమైన గుత్తేదారు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామస్థులు, జనసేన నాయకులు, దళిత సంఘాలు శనివారం రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
బాధిత కుటుంబ సభ్యులు, దళిత నాయకుల నిరసన
రాజమహేంద్రవరం వైద్యం, కోరుకొండ, న్యూస్టుడే: ప్రభుత్వపరంగా జరుగుతున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణ కరవై కార్మికుడు మృత్యువాత పడ్డాడు. యంత్రాలతో చేయాల్సిన పనులను మనుషులతో చేయించి వ్యక్తి మృతికి కారణమైన గుత్తేదారు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామస్థులు, జనసేన నాయకులు, దళిత సంఘాలు శనివారం రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటలపాటు కంబాలచెరువు-లాలాచెరువు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కోటికేశవరానికి చెందిన బూలా రాంబాబు మేకల కాపరి. కూలి పనులకూ వెళ్తుంటాడు. శుక్రవారం కోటికేశవరం-నాగంపల్లి రహదారిలో కల్వర్టు పునర్నిర్మాణం పనులకు వెళ్లాడు. సుమారు 12 అడుగుల లోతులో పనిచేయాలని గుత్తేదారు చెప్పడంతో అది యంత్రాలతో చేయాల్సిందని, తనవల్ల కాదని రాంబాబు చెప్పాడు. కచ్చితంగా పని చేయాల్సిందేదని బలవంతంగా అందులోకి దింపడంతో మట్టి పెళ్లలు విరిగిపడి రాంబాబుకు తీవ్రంగా గాయపడ్డాడు. రాజమహేంద్ర వరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని గుత్తేదారు వద్ద ప్రస్తావించడానికి వెళ్తే పరారయ్యాడని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆసుపత్రి ఎదుట బైఠాయించి గుత్తేదారుడిని రప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో డీఎస్పీలు జేవీ సంతోష్, కడలి వెంకటేశ్వరరావు, ఎం.శ్రీలత ఆందోళనకారులకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. వైకాపా నాయకుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు గణేష్ నిరసనకారులతో మాట్లాడే ప్రయత్నం చేయగా... గుత్తేదారును రప్పించిన తర్వాతే మాట్లాడతామంటూ తేల్చిచెప్పారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నిరసనకారులను పోలీసులు స్టేషన్కు తరలించారు. జనసేన రాజానగరం నియోజకవర్గ నాయకుడు బత్తుల బలరామకృష్ణ ఆందోళనకు సంఘీభావం తెలిపారు.
భార్య కువైట్లో..
రాంబాబుకు భార్య మేరీ, కుమారుడు కిషోర్, కుమార్తె కుసుమ ప్రియ ఉన్నారు. సొంత ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సమస్య తలెత్తడంతో భార్య మేరీ ఆరు నెలల క్రితం కువైట్ వెళ్లారు. రాంబాబుది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు కోరుకొండ ఏఎస్ఐ సత్యనారాయణ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల