పథకం.. ప్రయోజన దూరం..!
అల్లవరం మండలానికి చెందిన ఎస్సీ యువకుడు మూడున్నరేళ్లుగా వ్యక్తిగత రుణం ఇస్తే వాహనం కొనుక్కుని జీవనోపాధి ఏర్పర్చుకుంటానని బ్యాంకర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఇప్పటివరకు రుణం మంజూరు కాలేదు.
కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం
* అల్లవరం మండలానికి చెందిన ఎస్సీ యువకుడు మూడున్నరేళ్లుగా వ్యక్తిగత రుణం ఇస్తే వాహనం కొనుక్కుని జీవనోపాధి ఏర్పర్చుకుంటానని బ్యాంకర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఇప్పటివరకు రుణం మంజూరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినట్లు అవగాహనలేదని వాపోయాడు.
* ఉప్పలగుప్తం మండలానికి చెందిన మరో యువకుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుందామని బ్యాంకు అధికారుల దగ్గరకు వెళితే.. ప్రస్తుతం కార్పొరేషన్ ద్వారా రుణాలిచ్చే వెసులుబాటు లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై బ్యాంకర్లకు కూడా తగిన సమాచారం లేకపోవడమేంటని అతను విస్మయం వ్యక్తం చేశాడు.
న్యూస్టుడే, అమలాపురం కలెక్టరేట్
ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకం ఏదైనా సంబంధిత శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించాలి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద రైతులు, యువకులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందించేందుకు నూతనంగా అమృత్ జలధార, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ అనే రెండు పథకాలు తీసుకువచ్చింది. వీటికి దరఖాస్తుచేసుకునే సమయం ముగుస్తున్నా ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా లబ్ధిదారుల నుంచి రాలేదు. దీనికి కారణం ఈ పథకం ఉన్నట్లు జిల్లావ్యాప్తంగా కనీస ప్రచారం లేకపోవడం, ఎవరికీ తెలియకపోవడమేనని పలువురు పేర్కొంటున్నారు.
కేంద్రం అందుబాటులోకి తెచ్చినా..
అన్నదాతల సాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జలసిరి పథకం పేరుతో బోర్లు తవ్వి, సౌర విద్యుత్తు మోటార్లు అందించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకాన్ని వైఎస్ఆర్ జలకళగా మార్చి అమలు చేస్తోంది. ఈ నాలుగేళ్లలో రైతులు పూర్తిస్థాయిలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమృత్ జలధార పథకం ద్వారా ఎస్సీ రైతులకు రూ.లక్ష రుణంతో బోరు వేసుకునే సదుపాయం కల్పించింది. దీనిలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.50 వేల రాయితీ వర్తించగా, మరో రూ.50 వేలు బ్యాంకు రుణంగా ఇప్పించనున్నారు. కనీసం 2.5 ఎకరాలున్న రైతులే ఈ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. ఈ పథకానికి అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ఇప్పటివరకు ఒక ప్రకటన కూడా జారీ చేయలేదు.
వివరాలు లేవు..
నాలుగేళ్లుగా కేవలం అలంకారప్రాయంగా కొనసాగుతున్న పలు సామాజిక వర్గాల కార్పొరేషన్ల వద్ద వ్యక్తిగతంగా స్వయం ఉపాధి పొందుతున్నవారి వివరాలు లేవు. దీంతో గ్రామాల్లో ఎవరైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రవేశపెట్టిన పథకాలకు అర్హులుంటే.. వారి వివరాలు ఇవ్వాలని బ్యాంకర్లను, ఎంపీడీవోలను ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కోరినా ఇప్పటివరకు ఒక పేరుకూడా రాకపోవడాన్ని చూస్తే.. వార్షిక రుణ ప్రణాళికలో ఎస్సీవర్గాల అభ్యున్నతికి ఎంత మేర ప్రభుత్వాలు, అధికారులు కృషి చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుత్తున్నాయి. అందివచ్చిన ఆర్థిక ఆసరా అవకాశం కళ్లెదుటే చేజారుతుందనే ఆవేదన ఎస్సీ సామాజిక వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.
నాలుగేళ్లుగా నిలిచిన రుణాలు
జిల్లావ్యాప్తంగా ఎస్సీ రైతులు, నిరుద్యోగులకు రెండేళ్లుగా రాయితీలు అందడం లేదు. ఎస్సీ కార్పొరేషన్లో నాలుగేళ్లుగా పథకాలు, రాయితీ రుణాలు లేవు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు సరైన అవగాహన కల్పించడం లేదు. దీంతో అర్హులు పథకాలకు దూరమవుతున్నారు. దళిత రైతులు, నిరుద్యోగులు జీవితంలో నిలదొక్కుకునేలా రూ.50 వేల నుంచి రూ.60 వేల రాయితీతో రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే సమస్యగా మారింది. ఈ నెల మొదటి వారంలోనే పథకాలు అందుబాటులోకి వచ్చినా ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా అధికారులు వివరాలు వెల్ల్లడించలేదు. తీరా సమయం మించిపోతుండగా.. అర్హుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అర్హులు తెలియడం లేదు..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలకు అర్హులైనవారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యాం. బ్యాంకర్ల నుంచి ఎలాంటి వివరాలు లభించలేదు. చిన్నతరహా పరిశ్రమలశాఖ వారినీ అడుగుతున్నాం. ఇప్పటివరకు వివరాలు అందలేదు. అర్హులుంటే కచ్చితంగా వారికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటాం. అర్హత ఉన్నవారు తమ వివరాలను నేరుగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి, లేదా సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాలి.
రాధాకుమారి, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారిణి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?