విద్యా ప్రగతికి పటిష్ఠ ప్రణాళిక
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్దేశించిన నాడు-నేడు పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి.
న్యూస్టుడే, పామర్రు
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. బడులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నిర్దేశించిన నాడు-నేడు పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. పాఠశాలలు తెరిచిన నాడే విద్యార్థులకు అందిస్తామన్న జగనన్న విద్యాకానుక కిట్లకు అవసరమైన సామగ్రి పూర్తి స్థాయిలో రాలేదు. ఉపాధ్యాయుల బదిలీలు ప్రహసనంగా సాగుతున్నాయి. పాఠశాలల సంసిద్థతా కార్యక్రమం అంతంత మాత్రంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యా ప్రగతికి¨ అందరినీ సమన్వయపరచుకుంటూ, జిల్లాను అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నామని డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం.కమలకుమారి ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో తెలిపారు. ఆ వివరాలు..
న్యూస్టుడే : పాఠశాల సంసిద్ధతా కార్యక్రమం ఎలా ఉంది?
డీఈవో : పాఠశాలలు తెరిచే రోజున పండగ వాతావరణం నెలకొనేలా చేస్తున్నాం. ఇప్పటికే చేరికలపై దృష్టి సారించాం. గత వారం రోజులుగా ఉపాధ్యాయులు ఇంటింటీకి వెళ్లి పాఠశాలలు తెరుస్తున్నారని విద్యార్థులను పంపించాలనికోరి వచ్చారు. తరగతి గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేసి ఉంచాం. పరిసరాలన్నిటినీ చెత్త, చెదారం లేకుండా అందంగా తీర్చిదిద్దాం. కొన్నిచోట్లయితే తమ పాఠశాల సాధించిన ప్రగతి, పథకాలను వివరిస్తూ కరపత్రాలు కూడా పంపిణీ చేశారు. మొదటి రోజున మామిడితోరణాలు కట్టి అందరికీ ఆహ్వానం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నాం.
వేసవి సెలవుల్లో నిర్వహించిన వియ్ లవ్ రీడింగ్ కార్యక్రమం లక్ష్యాలను సాధించిందా?
విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత కలగడానికి, చదువంటే ఇష్టపడడానికి, వచ్చింది మరిచిపోకుండా జ్ఞప్తిలోనే ఉంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అమలు చేశాం. చాలా వరకూ సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. ఉపాధ్యాయులంతా వాట్సాప్ బృందాలను తమ తమ తరగతి విద్యార్థులతో ఏర్పాటు చేసుకుని మంచి కథలు రోజూ పోస్టు చేసేవారు. వాటిని విద్యార్థులు చదివి తిరిగి వారి సొంత మాటల్లో, చిత్రలేఖనం రూపంలో కథను చెప్పేవారు. ఇలా నేను చాలా చోట్ల చూశాను. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకత బయటపడింది.
జగనన్న విద్యాకానుక కిట్ల పరిస్థితి ఏమిటి?
గతేడాది జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జగనన్న విద్యాకానుకల పంపిణీ సక్రమంగా, పక్కాగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. జిల్లాలోని 22 మండలాల్లోనూ ఒక్కో స్టాక్ పాయింట్ పెట్టాం. సామగ్రి అంతా అక్కడికే వస్తోంది. సుమారు 90 శాతం వచ్చేసింది. మిగిలినవి కూడా మరో రెండు రోజుల్లో చేరిపోతాయి. అక్కడి నుంచి పాఠశాల గుమ్మం వద్దకే ప్రత్యేక వాహనాల మీద అన్ని ఒకేసారి రవాణా అయ్యేలా చేస్తున్నాం. కిట్లలో సామగ్రి అంతా నాణ్యతతో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా నాణ్యతా లోపాలుంటే స్టాక్ పాయింట్ వద్దనే వాటిని పక్కన పెట్టి మంచివి పాఠశాలలకు పంపిస్తాం. బడి తెరిచిన మొదటి రోజునే విద్యార్థులకు ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో పంపిణీ చేయిస్తాం. జిల్లాకు ఏకరూప దుస్తులు-1,14,828 జతలు, బూట్లు, సాక్సులు-1,14,477, బెల్టులు-79,868, రాత పుస్తకాలు-7,25,610, స్కూల్ బ్యాగ్లు, అచ్చు పుస్తకాలు-1,14,838, డిక్షనరీలు-12,890, బొమ్మల డిక్షనరీలు-7,308 అవసరం అవుతున్నాయి.
నాడు-నేడు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. వీటి గురించి ఏమంటారు?
పాఠశాలలు తెరిచేలోగా అదనపు తరగతి గదులు తప్ప మిగిలిన సుందరీకరణ పనులన్నీ పూర్తవ్వాలని విద్యాకమిటీలు, ప్రధానోపాధ్యాయులకు లక్ష్యాలను నిర్దేశించాం. అయితే అనుకున్న రీతిలో ఇవి పూర్తి కాలేదు. కమిటీల వద్ద నిధులున్నా కూడా గుత్తేదారుల వద్ద నుంచి టైల్స్, విద్యుద్దీకరణ సామగ్రి రాలేదు. అవి వస్తాయని ఎదురు చూడడంతోనే సమయం గడిచిపోయింది. తాజాగా వీటిని నిబంధనల ప్రకారం కమిటీలు కొనుగోలు చేసుకోవచ్చని ఆదేశాలు అందాయి. ఇక నుంచి పనులు ఊపందుకుంటాయి. 15, నెల రోజుల్లో అయిపోతాయి. అయితే మరుగుదొడ్లు, వంటగదులకు సంబంధించిన టైల్స్ను మాత్రం గుత్తేదారులే పాఠశాలలకు తెస్తారు. వాటిని కొనుగోలు చేయొద్దు. చాలా చోట్ల బెంచీలు, డెస్క్లు మాత్రం బిగించేశారు. జులై ఒకటో తేదీకి సుందరీకరణ పనులన్నీ అయిపోతాయి.
ఉపాధ్యాయుల బదిలీలు పూర్తయ్యేదెన్నడు?
ఉపాధ్యాయుల బదిలీల వ్యవహారం అంతా ఆన్లైన్లోనే జరుగుతోంది. రాష్ట్ర సంచాలకుల కార్యాలయం నుంచే అమలవుతోంది. మా సిబ్బంది అక్కడే ఉండి జిల్లాకు సంబంధించిన ఖాళీలు, పదోన్నతులు, బదిలీలు అన్నీ చేస్తున్నారు. షెడ్యూలు ప్రకారం పాఠశాలలు తెరిచేనాటికి ఉపాధ్యాయుల బదిలీల పర్వం ముగుస్తుంది.
ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగి ప్రాథమిక విద్య దెబ్బతింటోందనే వాదనపై మీరేమంటారు?
వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకుండా చూస్తున్నాం. 20 మంది విద్యార్థులు దాటిన ప్రతి చోటా ఎంటీఎస్లో చేరిన వారిని రెండో ఉపాధ్యాయునిగా నియమిస్తాం. తద్వారా ప్రాథమిక విద్య బలోపేతం అవుతుంది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలి వయస్కుల బాధ విని‘పింఛనే’లేదా..!?
[ 26-04-2024]
అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకుంటూ ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవితాన్ని హాయిగా గడుపుదామని భావించారు. -
లారీలతో తొక్కిపడేశారు..
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాకా నదీ పరివాహక చట్టం పరిహాసంగా మారింది. ఇన్నాళ్లూ వైకాపా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఇసుక తవ్వకాలు, రవాణాపై అధికార యంత్రాంగం దృష్టి సారించలేదు. -
3 రోజులు.. 6 సభలు..
[ 26-04-2024]
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో రోజుకు రెండు బహిరంగ సభల్లో పాల్గొనేలా పర్యటన ఖరారు చేశారు. -
అన్ని రంగాలను అభివృద్ధి చేస్తాం: నల్లమిల్లి
[ 26-04-2024]
ఇక్కడ తాను, రాజమహేంద్రవరం ఎంపీగా పురందేశ్వరి గెలిచి అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని భాజపా అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. -
దుర్మార్గ పాలనను గద్దె దించేందుకే పొత్తు
[ 26-04-2024]
దుర్మార్గపు వైకాపా పాలనను గద్దె దించాలంటే పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, వైకాపా కుయుక్తులను తిప్పికొట్టేలా ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరంఎంపీ అభ్యర్థి దగ్డుబాటి పురందేశ్వరి అన్నారు. -
నిలిచేదెవరో.. గెలిచేదెవరో?
[ 26-04-2024]
రాజమహేంద్రవరం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ముగిసింది. -
పర్యాటకానికి పాతరేశారు
[ 26-04-2024]
పర్యాటకానికి ఉమ్మడి జిల్లా పెట్టింది పేరు. వైకాపా వచ్చాక వీటికి వన్నెతేవాల్సింది పోయి వాటి ప్రభ కోల్పోయేలా వ్యవహరిస్తోంది. -
అన్నాచెల్లెళ్ల ఎన్నికల ప్రచారం
[ 26-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ పి.గన్నవరం నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. -
వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు
[ 26-04-2024]
ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. -
జగన్ వచ్చే.. ఇసుక ధరలకు రెక్కలొచ్చే
[ 26-04-2024]
ఒకప్పుడు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇల్లు నిర్మించాలనుకుంటే ఇసుక ధరను పరిగణనలోకి తీసుకునేవారు కాదు. ఎందుకంటే ఈ ప్రాంత వాసులకు ఇసుక ధర అందుబాటులో ఉండేది. -
బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’
[ 26-04-2024]
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. -
గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
ఎన్నికల్లో జగన్ ప్రతిసారీ సానుభూతి కోసం డ్రామాలు వేస్తున్నారని, ఈసారి గులకరాయి డ్రామాకు తెరలేపారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
జిల్లాలో కాకినాడ పార్లమెంట్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ నగరం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. -
అడిగేస్తున్నారు.. కడిగేస్తున్నారు..?
[ 26-04-2024]
సమస్యలు చెబితే కేసులు.. ప్రశ్నిస్తే దాడులు.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే పోలీసు వేధింపులు... అయిదేళ్లుగా అన్నీ మౌనంగా భరించిన జనం.. ఓపిక నశించి వైకాపా అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. -
ముగ్గురు వాలంటీర్లపై కేసు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొన్న ముగ్గురు వాలంటీర్లపై ఎంపీడీవో రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై సతీష్కుమార్ గురువారం తెలిపారు. -
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం
[ 26-04-2024]
ప్రజాకంటక పాలన పోయి స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి విజనరీ గల నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే అవశ్యమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ అన్నారు. -
గులకరాయి డ్రామాపై ప్రదర్శన
[ 26-04-2024]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ ర్యాలీలో గురువారం రంగంపేట మండలానికి చెందిన తెదేపా, జనసేన యువనాయకులు వినూత్నరీతిలో నుదుటిపై స్టిక్కర్లు అతికించుకుని పాల్గొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు