ఏళ్లు గడుస్తున్నా.. పరిహారం అందలేదు
పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు తమ భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్న నేటికి పరిహారం అందించలేదని తమకు న్యాయం జరిగేలా చూడాలని గిరిజనేతర రైతులు కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
నెహ్రూని కలిసిన పోలవరం భూ నిర్వాసిత రైతులు
నెహ్రూకు వినతిపత్రం అందజేస్తున్న రైతులు
గోకవరం, జగ్గంపేట, న్యూస్టుడే: పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు తమ భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్న నేటికి పరిహారం అందించలేదని తమకు న్యాయం జరిగేలా చూడాలని గిరిజనేతర రైతులు కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలానికి చెందిన పలువురు రైతులు మంగళవారం జగ్గంపేటలో తెదేపా కార్యాలయం వద్దకు వచ్చి కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూను కలిశారు. రైతులు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్వం నుంచి తమకు భూములు ఉన్నాయని పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురైన నిర్వాసితులకు కాలనీల నిర్మాణాలు, భూమికి భూమి ఇచ్చేందుకు తమ వద్ద నుంచి భూములు తీసుకున్నారన్నారు. తీసుకునే సమయంలో నష్ట పరిహారం చెల్లిస్తామని చెప్పారని తీరా తీసుకున్న తరువాత పరిహారం చెల్లించకపోగా వైకాపా పాలనలో మాపై కేసులు పెట్టారని వాపోయారు. దీనిపై నెహ్రూ స్పందిస్తూ.. త్వరలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు ఎస్.వి.ఎస్.అప్పలరాజు, కందుల చిట్టిబాబు తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నయ్యా.. బైకు అమ్మి అప్పులు తీర్చండి
[ 30-04-2024]
‘అన్నయ్యా అమ్మా, నాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నేను వెళ్తున్నా’ అంటూ చరవాణిలో తన అన్నకు ఓ యువకుడు చివరి మాటలు చెప్పి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్లజర్ల మండలం అనంతపల్లి సైఫాన్ వంతెనపై పోలవరం కుడికాలువ వద్ద సోమవారం చోటుచేసుకుంది. -
పవన్ రోడ్షో.. 6 గంటలు.. 40 కి.మీ.
[ 30-04-2024]
భగభగమండే ఎండలో పూల జల్లులు కురిశాయి.. బాణసంచా కాల్పులతో పట్టపగలే ధగధగ మెరుపులు మెరిశాయి.. -
నాడు ఊదరగొట్టారు.. నేడు ఉసురు తీస్తున్నారు
[ 30-04-2024]
సామాజిక భద్రత పింఛన్లు తీసుకునే విషయంలో ఈసారి కూడా లబ్ధిదారులు ఇబ్బందులు పడే పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. గతనెల గంటల తరబడి సచివాలయాల వద్ద వారిని పడిగాపులు పడేలా చేసిన విషయం తెలిసిందే. -
పోలీసులపైనా కపట ప్రేమే
[ 30-04-2024]
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ పోలీసు సంక్షేమాన్ని అటకెక్కించారు. నిత్యం పోలీసు బందోబస్తు మధ్య తిరిగే ఆయన వారి కష్టాన్ని పట్టించుకోలేదు. -
వైకాపా పాలనలో 20 ఏళ్లు వెనక్కు
[ 30-04-2024]
మోదీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న సీఎం జగన్.. వైఎస్ రాజశేఖర్రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలి
[ 30-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమని, ప్రతిఒక్క ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ హక్కును వినియోగించుకునే వాతావరణ కల్పించేలా చూడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని రాష్ట్ర ఎన్నికల పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా అన్నారు. -
గాలికొదిలేశారు.. అయిదేళ్లు గడిపేశారు
[ 30-04-2024]
పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు. -
ప్రజల కష్టాలు తీరేది కూటమితోనే..
[ 30-04-2024]
బటన్లు నొక్కే జగన్మోహన్రెడ్డిని ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో రెండు బటన్లు నొక్కి ఇంటికి సాగనంపాలని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. -
రూ.6 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
[ 30-04-2024]
రావులపాలెం మండలం గోపాలపురం చెక్ పోస్టు వద్ద సోమవారం ఎటువంటి పత్రాలు లేకుండా లాజిస్టిక్ వాహనంలో తరలిస్తున్న 9.530 కేజీల బంగారం, 1.871 కేజీల వెండి వస్తువులను ఎస్ఎస్టీ బృందం, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భట్నవిల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
[ 30-04-2024]
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లిలో ఆదివారం రాత్రి 11.50 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
అతివే నిర్ణేత.. నేతలరాత..!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలు 2024లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి. -
ఓడించలేమా ఒంటి చేత..!
[ 30-04-2024]
అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా దినోత్సవం ముందురోజే వైఎస్ఆర్ చేయూత ద్వారా సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. -
సర్కారు జాగా.. ప్రైవేటు పాగా..!
[ 30-04-2024]
ప్రభుత్వ భూములను సంరక్షించాల్సిన అధికారులు వాటిని విస్మరించడంతో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు అమలాపురం మండలం ఈదరపల్లిలో చోటుచేసుకుంటోంది. -
ప్రగల్భాలే.. పైసా విదల్చలే..
[ 30-04-2024]
అర్థ దశాబ్దంగా ఎదురూచూస్తు వచ్చిన ఏలేరు ఆధునికీకరణ పనులకు జగన్ ప్రభుత్వం మోకాలడ్డింది. గత ప్రభుత్వంలో ఏలేరుపై సాగునీటి నిర్మాణాలకు ఖర్చుచేసిన సుమారు రూ.97 కోట్లు నిష్ప్రయోజనంగా మారాయి. -
గుర్తుల గందరగోళం
[ 30-04-2024]
జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఇతర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులకు సైతం కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్