అతివే నిర్ణేత.. నేతలరాత..!
సార్వత్రిక ఎన్నికలు 2024లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి.
జిల్లా ఓటర్లు 15,31,410
అమలాపురం కలెక్టరేట్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలు 2024లో నాయకుల తలరాతను అతివలే నిర్ణయించనున్నారు. ఇంతులు మెచ్చినవారికే పదవులు దక్కనున్నాయి. జిల్లావ్యాప్తంగా మే 13న జరగనున్న ఎన్నికల్లో హక్కు వినియోగించుకునే ఓటర్ల సంఖ్య తేలింది. ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 15,31,410 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల, మార్పుచేర్పులు, తొలగింపుల ప్రక్రియ పూర్తయింది. మృతులు, వలసదారులు ఇతరుల ఓట్లు తొలగించి తుది జాబితాను సోమవారం కలెక్టర్ హిమాన్షుశుక్లా విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 7,59,104, మహిళా ఓటర్లు 7,72,285 మంది, ఇతరులు 21 మంది ఉన్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు 13,181 మంది అధికంగా ఉన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో కొత్తపేట నియోజకవర్గంలో అత్యధికంగా 2,52,383 మంది జిల్లాలో అత్యల్పంగా రాజోలు నియోజకవర్గంలో 1,97,920 మంది ఓటర్లున్నారు.
రెండు నెలల్లో 42 వేల మంది:
ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లాలో 14,88,794 మంది ఓటర్లు నమోదైయ్యారు. అనంతరం రెండు నెలల పాటు కొత్త ఓట్ల నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించారు. దీనిలో భాగంగా సోమవారం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 15,31,410 మందికి పెరిగారు. ఈ లెక్కన రెండు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా 42,616 మంది ఓటర్లు పెరిగారు. వీరిలో మహిళా ఓటర్లు 24,262 మంది, పురుషుల ఓటర్లు 18,355 మంది పెరిగారు. నియోజకవర్గాల వారీగా అమలాపురంలో అత్యధికంగా 7,126 మంది, అత్యల్పంగా రామచంద్రపురంలో 5,026 మంది ఓటర్లు పెరిగారు.
- ఇతరులు రామచంద్రపురం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో ఒకరు చొప్పున, పి.గన్నవరం, కొత్తపేట, మండపేటల్లో ఆరుగురు చొప్పున ఉన్నారు. ముమ్మిడివరం పరిధిలో ఓటర్లుగా లేరు.
పలు వర్గాల వారీగా
జిల్లాలో ఎన్నారై ఓటర్లు 277, సర్వీస్ ఓటర్లు 819 మంది, 18-19 సంవత్సరాల వయసు ఉన్న వారు 38,480 మంది, 85 సంవత్సరాలు పైబడినవారు 8,344, దివ్యాంగులు 26,039, దృష్టి లోపంతో బాధపడుతున్న వారు 3,534 మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
[ 21-05-2024]
అన్నవరం రైల్వే స్టేషన్లో లిఫ్ట్లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. -
లాకులు.. లీకులు
[ 21-05-2024]
పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. -
మేల్కోకుంటే.. ముప్పే!
[ 21-05-2024]
జిల్లాలో రక్తం, ప్లేట్లెట్ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. -
ఓట్ల లెక్కింపులో నిబంధనలు పాటించాలి
[ 21-05-2024]
జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.మాధవీలత ఆదేశించారు. -
రెండవ ప్లాట్ఫామ్ మూసివేత
[ 21-05-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లోని రెండవ నంబరు ప్లాట్ఫామ్ వద్ద రైలు పట్టాల(ట్రాక్) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. -
కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 21-05-2024]
నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ఓటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత అన్నారు. -
కేంద్ర కారాగారానికి జీవవైవిధ్య పరిరక్షణ పురస్కారం
[ 21-05-2024]
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం జీవవైవిధ్య పరిరక్షణ అవార్డు-2024(బయోడైవర్సిటీ కన్జర్వేషన్)కు ఎంపికైనట్లు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కన్నవారి కనీస అవసరాలు తీర్చాల్సిందే...
[ 21-05-2024]
కన్నవారి కనీస అవసరాలు తీర్చకపోయినా, వారితో అగౌరవంగా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉందని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.ప్రకాష్బాబు అన్నారు -
వస్తోంది.. ఆహార భద్రత రథం
[ 21-05-2024]
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది -
రావణబ్రహ్మపై ఊరేగిన సత్యదేవుడు
[ 21-05-2024]
అన్నవరం సత్యదేవునికి సోమవారం రాత్రి రావణ బ్రహ్మ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. -
పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు
[ 21-05-2024]
అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. -
ఖరీఫ్ సాగుపై సందిగ్ధం!
[ 21-05-2024]
జిల్లాలో ఖరీఫ్ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
-
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
-
ప్రజ్వల్.. లొంగిపో : కుమారస్వామి హితవు
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
-
దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!