గోడు వినేవారేరి..!
ఏడాదికోసారి జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో తమ గోడును ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేసేందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్కరూ కూడా
ఆదివాసీ దినోత్సవంలో గిరిజన నాయకుల ఆవేదన
సేవాలాల్ మహారాజ్, ఏకలవ్యుడు, అంబేడ్కర్, వెన్నలగంటి రాఘవయ్య, చెంచులక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి తెలుపుతున్న జడ్పీ ఛైర్పర్సన్ క్రిస్టినా, కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి, జేసీ రాజకుమారి, గిరిజన సంఘాల నాయకులు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ఏడాదికోసారి జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో తమ గోడును ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేసేందుకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడంపై గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పటికీ ఒక్కరూ కూడా కార్యక్రమంలో పాల్గొనలేదు. ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు వచ్చినా.. వారు ప్రసంగించిన వెంటనే వెళ్లిపోయారని, ఇక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను ఎవరికి చెప్పాలంటూ వేదికపైనే వాపోయారు నంగార బేరి సేవాలాల్ సేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు రామకోటేశ్వరరావు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా మంగళవారం రెవెన్యూ కల్యాణ మండపంలో సభ జరిగింది. ఈ సభలో గిరిజన సంఘాల నాయకులు సభ నిర్వహణ పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏటా సభలో గిరిజనులకు ప్రభుత్వం వైపు నుంచే అందించే రాయితీ రుణాలు, పథకాలు వంటివి పంపిణీ చేసేవారని, లేక ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసేవారని, ఈసారి అటువంటివి ఏమీ లేకుండా తూతూమంత్రంగా సభ నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్(యునైటెడ్ ట్రైబల్ ఫెడరేషన్) నాయకులు కె.సంజయ్ మాట్లాడుతూ సభకు హాజరైన వారికి భోజనాలు నిర్వహించే వారని, ఈసారి ఆ ఏర్పాట్లు కూడా చేయకపోవడం బాధాకరమన్నారు.
* ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించిన సభలో తొలుత విద్యార్థులు వివిధ గిరిజనుల సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. అనంతరం జరిగిన సభలో జిల్లాపరిషత్తు చైర్పర్సన్ క్రిస్టినా, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగిచారు. గిరిజనుల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అన్నారు. అటవీ భూములను సాగు చేసుకునే గిరిజనులకు 2006 అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా భూమిపై హక్కును కల్పించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసిందన్నారు. మైదాన ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. సంక్షేమ పథకాలను వాలంటీర్ల ద్వారా అందిస్తున్నామని, ఏదైనా సమస్యలుంటే సచివాలయాల్లోని స్పందనలో తెలియజేయవచ్చన్నారు. జేసీ జి.రాజకుమారి మాట్లాడుతూ ఆదివాసి మహిళలు మంచి నైపుణ్యం కలవారని, వారికి స్వయం ఉపాధి కల్పించి చేయూత అందించాలన్నారు. గిరిజన సంఘాల నాయకులు ఎన్.విష్ణునాయక్, కె.వెంకటేశ్వర్లు, చంద్రానాయక్, బాపట్ల ఏసుబాబు, డి.శంకరరావు, డాక్టర్ లక్ష్మీనాయక్, టి.నరసింహారావు, బి.శంకర్నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసూదనరావు, గిరిజన సంక్షేమ అధికారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్