రైళ్లలో చోరీలు చేసే ఆర్ఎంపీ అరెస్టు
రైళ్లలో చోరీలు చేసే ఆర్ఎంపీ వైద్యుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జీఆర్పీ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
నిందితుడి వివరాలు తెలుపుతున్న జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ సీఐ రామయ్య, ఎస్సైలు
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే : రైళ్లలో చోరీలు చేసే ఆర్ఎంపీ వైద్యుడిని గుంటూరు జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం జీఆర్పీ పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపల్లెకు చెందిన శ్రీనివాసరావు గత నెల 28వ తేదీన కాచీగూడ ఎక్స్ప్రెస్లో ఎక్కారు. గుంటూరుకు చేరుకునేప్పటికి అతని బ్యాగ్ కనిపించలేదు. బ్యాగ్లో రూ. 8 లక్షల నగదు ఉందని, ఎవరో అపహరించారని జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ గంగా వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. ఈక్రమంలో శుక్రవారం రైల్వేస్టేషన్లోని 3వ ప్లాట్ఫారంపై జీఆర్పీ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ సీఐ రామయ్య, ఎస్సైలు శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబులు ఎంఎస్కె రెడ్డి, శ్రీనివాసరెడ్డి, పీసీలు వలి, సుభాని, సాంబశివరావు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసిన ఓ వ్యక్తి బ్యాగ్ తగిలించుకొని పరుగుపెట్టడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. బాపట్ల జిల్లా, భట్టిప్రోలుకు చెందిన తన పేరు ప్రవీణ్ అని ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తుంటానని పోలీసులకు తెలిపాడు. అతని సంచిని పరిశీలించగా రూ. 4 లక్షల నగదు లభించింది. జల్సాలకు అలవాటుపడి దొంగతనం చేసినట్లు తెలిపాడని సీఐ చెప్పారు. 28వ తేదీ రేపల్లె నుంచి గుంటూరు వస్తున్న క్రమంలో రైలులో ప్రయాణికుడు శ్రీనివాసరావుకు చెందిన బ్యాగ్ అపహరించి రూ. 4 లక్షలు ఖర్చు చేసినట్లు నిందితుడి అంగీకరించాడని సీఐ తెలిపారు. మిగిలిన డబ్బులు భట్టిప్రోలులో దాచేందుకు వెళ్తున్న క్రమంలో అరెస్టు చేశామన్నారు. రూ. 4 లక్షలు జప్తు చేశామని సీఐ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.