రూ.10 క్యారీ బ్యాగ్కు 9వేల జరిమానా
వినియోగదారుడికి కనీస సౌకర్యం అందించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్యారీ బ్యాగులకు నగదు వసూలు చేసిన నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణ తీరును గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది.
నగరంపాలెం, న్యూస్టుడే: వినియోగదారుడికి కనీస సౌకర్యం అందించకుండా, నిబంధనలకు విరుద్ధంగా క్యారీ బ్యాగులకు నగదు వసూలు చేసిన నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణ తీరును గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం తప్పు పట్టింది. గుంటూరులోని శ్రీనగర్ వాసి న్యాయవాది పోతుగుంట్ల సాయిసూర్య గత ఏడాది మే 5వ తేదీన లక్ష్మీపురంలోని వెస్ట్ సైడ్ షోరూంలో రూ.5,689 విలువ గల వస్త్రాలను కొనుగోలు చేశారు. అనంతరం వస్త్రాలకు తమ కంపెనీ లోగోతో ముద్రించిన క్యారీ బాగును అందించి దాని కోసం రూ.పది నగదు కూడా వసూలు చేశారు. క్యారీ బాగ్కు నగదు వసూలుపై స్టోరు మేనేజర్ను న్యాయవాది తేజ ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదు. క్యారీబాగు షోరూం ఇవ్వదని ఎక్కడా బోర్డు పెట్టకపోవడంతో తీవ్ర అసౌకార్యనికి గురయ్యానని, అదే ఏడాది జులై 9న షోరూం స్టోరు మేనేజర్తో పాటు ముంబై బాంద్రాలోని ప్రధాన కార్యాలయ సీఈవోలపై జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన ఫోరం అధ్యక్షురాలు తాడికొండ సునీత, సభ్యులు కె.విజయలక్ష్మి, పున్నారెడ్డి స్టోర్ వ్యవహార శైలిని తప్పు పట్టారు. షోరూం లోగోతో వినియోగదారులకు ఉచితంగా క్యారీబాగులు అందజేయాలని, ఫిర్యాదుదారుడు తేజ నుంచి క్యారీ బాగు కోసం వసూలు చేసిన రూ.10తో పాటు మానసిక క్షోభకు రూ.6 వేలు, మరో రూ.3 వేలు ఖర్చులతో కలిపి ఆరు వారాల్లో చెల్లించాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాధ్యత మరిచారు.. భ్రష్టు పట్టించారు!
[ 05-05-2024]
పౌరులంతా క్షేమంగా సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత పాలకులదే. జగనన్న రాజ్యంలో తాడేపల్లి ప్యాలెస్ ఒక్కటే భద్రంగా ఉంది. ప్యాలెస్ పక్కనే గంజాయి బ్యాచ్లు చెలరేగుతున్నా జగన్ ఉలుకూ పలుకూ లేకుండా శిలలా ఉన్నారు. -
చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి
[ 05-05-2024]
‘ఇకపై మంగళగిరే నా సొంత ఊరు. మా కుటుంబంపై ప్రజల అభిమానం అపురూపం. ఇక్కడి వాతావరణం కుమారుడు దేవాన్ష్కు కూడా బాగా నచ్చింది. మంగళగిరిలో లోకేశ్ విజయం తథ్యం. ఎంత మెజార్టీ సాధిస్తారన్నదే మిగిలింది.’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. -
ఎగసిన ‘జన’ కెరటం
[ 05-05-2024]
రేపల్లె తీర ప్రాంతానికి జనసేనాని రాకతో అభిమాన జన కెరటం ఉవ్వెత్తున ఎగసింది. చిన్నాపెద్దా తేడా లేకుండా తరలివచ్చిన జనాలతో రేపల్లె పట్టణం కిక్కిరిసింది. తెదేపా-జనసేన-భాజపా కూటమి ఆధ్వర్యంలో శనివారం రేపల్లెలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు పవన్కల్యాణ్ హాజరయ్యారు. -
గుండెలదిరేలా గ్రామాల రోడ్లు
[ 05-05-2024]
-
ఏళ్లుగా సడలని సంకల్పం
[ 05-05-2024]
మొక్కవోని దీక్ష, పట్టుదలతో అమరావతిని కాపాడుకోవడం కోసం అన్నదాతలు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 1600 రోజులు పూర్తి చేసుకుంది. ఎన్ని అవమానాలు, అవరోధాలు ఎదురైనా పంటిబిగువున ఎత్తిన చెయ్యి దించకుండా ప్రతి దశలోనూ మహిళలు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. -
‘జలకళ’లో జగన్ దగా
[ 05-05-2024]
రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం చేపట్టాం. బోరుతో పాటు కేసింగ్పైపును కూడా ఇవ్వబోతున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెబుతున్నాం. -
‘మోసానికి’ బ్రాండ్ అంబాసిడర్
[ 05-05-2024]
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. లబ్ధిదారులకిచ్చిన ప్లాట్లలో ఐదేళ్లకాలంలో ఎలాంటి మౌలిక వసతులనూ కల్పించలేదు. -
సీలు వేశాం.. కానీ ఊడిపోయింది..!
[ 05-05-2024]
-
ఆంధ్రుల కలల రాజధాని తరలిస్తామంటే మిన్నకుండిపోయారు
[ 05-05-2024]
-
వైకాపా నేతలపై చర్యలకు డిమాండ్
[ 05-05-2024]
పొన్నూరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నేతలు హెలీప్యాడ్ను ధ్వంసం చేశారని, దీనిపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, ఎ.ఎస్.రామకృష్ణ తదితరులు. -
సూపర్-6తో అపూర్వ ప్రగతి
[ 05-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో అన్నిరంగాలు, వర్గాల ప్రజలు దగా పడ్డారు. దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, హత్యలు, అరాచకాలు అడ్డులేకుండా పోయాయి. ప్రగతి కనుచూపు మేరలో కానరాలేదు. ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. -
కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తాం : నాదెండ్ల
[ 05-05-2024]
పట్టణంలోని యడ్లలింగయ్య, ఫులె కాలనీల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాగునీటి, డ్రైనేజీ సమస్య ఆయనకు తెలియజేయగా పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
వైకాపా నాయకుల కవ్వింపు చర్యలు
[ 05-05-2024]
తాడికొండ మండలం మోతడక గ్రామంలో శనివారం వైకాపా అభ్యర్థి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద ఉన్న తెదేపా కార్యాలయం వద్ద ఖాళీ ప్రచార రథంతో పాటు వైకాపా అల్లరి మూక వచ్చారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు
[ 05-05-2024]
రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 9న తిరుపతిలో 20.20 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(07510) తెనాలి 01.58, గుంటూరు 02.20, నడికుడి 04.00, సికింద్రాబాద్ 09.10 గంటలకు చేరుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్