అకాడమీలు ప్రారంభించిన ఘనత ఏసీఏదే
ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించేందుకు దేశంలో అకాడమీలు ప్రారంభించిన ఘనత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కే దక్కుతుందని ఆ సంఘం సీఈఓ ఎం.వెంకటశివారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్....
సీఈఓ వెంకట శివారెడ్డి
న్యూస్టుడే, మంగళగిరి (తాడేపల్లి)
మంగళగిరిలో క్రికెట్ స్టేడియం
ఔత్సాహిక క్రికెటర్లను ప్రోత్సహించేందుకు దేశంలో అకాడమీలు ప్రారంభించిన ఘనత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కే దక్కుతుందని ఆ సంఘం సీఈఓ ఎం.వెంకటశివారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్ అకాడమీలు ఆంధ్రాలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘కడపలో స్కూల్ బాయ్స్ అండర్-15కు రెసిడెన్షియల్ అకాడమీ నిర్వహిస్తున్నాం. మంగళగిరిలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద ఉమెన్స్ అకాడమీ నడుపుతున్నాం. టోర్నమెంట్ సమయంలో ఉమెన్స్కి క్యాంపు నిర్వహిస్తాం. అండర్-19 డిగ్రీ కళాశాల విద్యార్థులకు విజయనగరంలో అకాడమీ నిర్వహిస్తున్నామని’ ఆయన పేర్కొన్నారు.
న్యూస్టుడే: ఏసీఏ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది?
ఏసీఏ సీఈఓ : ఇప్పుడే దేశవాళీ సీజన్ ప్రారంభమైంది. గత సీజన్లో దేశంలో బీసీసీఐ టోర్నమెంట్స్ అధికంగా చేసిన ఘనత ఏసీఏకి ఉంది. ఉమెన్స్ అండర్-19, సీనియర్స్ సెలక్షన్స్ అంతర్ జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్నాం. ఇప్పుడు పూర్తయ్యాయి. అండర్-16, 19 మెన్ అంతర్ జిల్లాల స్థాయిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. జోనల్స్ అనంతరం స్టేట్ టీమ్స్ తీసుకున్న తరువాత బీసీసీఐ షెడ్యూల్ మొన్ననే విడుదల చేశారు.
న్యూ: ఎన్ని టోర్నమెంట్లు చేశారు?
జ: బీసీఐ టోర్నమెంట్లు ఆరు, ఎన్సీఏ క్యాంపులు రెండు నిర్వహించాం. లక్ష్మణ్ ఒక ఎన్సీఏ టోర్నమెంట్ను విజయవాడలో చేయగా జాతీయ స్థాయిలో ఆరు జట్లు వచ్చాయి. ఒక ఆల్ ఇండియా హైపెర్ఫార్మెన్సీ క్యాంపును అనంతపురంలో లక్ష్మణ్ వ్యక్తిగతంగా వచ్చి ప్రారంభించారు.
న్యూ: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ పర్మిషన్ ఉందా?
జ: అనుభవం, నిర్వహించగల స్థోమత ఉందనే ఉద్దేశంతో ఇన్ని టోర్నమెంట్లు ఇచ్చారు. ఆంధ్రా క్రికెట్ సంఘం సామర్థ్యాన్ని చూసి దేశంలో నాలుగో రాష్ట్రంగా గుర్తించారు. ఏపీఎల్ (ఆంధ్రా ప్రీమియర్ లీగ్)కు అనుమతి ఇచ్చారు. కర్ణాటక, తమిళనాడు, సౌరాష్ట్ర తరువాత నాలుగో రాష్ట్రం మనది. ఏపీఎల్ మెన్స్ ఇటీవల వైజాగ్లో నిర్వహించాం. స్సందన బాగుంది.
న్యూ: ఐపీఎల్ల్లో మనవారికి స్థానం లభిస్తుందా?
జ: రానున్న రోజుల్లో ఐపీఎల్కు మన ఆంధ్రా నుంచి నలుగురైదుగురు క్రికెటర్లకు అవకాశం కచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాం. దీనితో పాటు ఒకడుగు ముందుకువేసి ఏసీఏ ఉమెన్స్ ఏపీఎల్ తరహాలో కాకపోయినా ఉమెన్స్ టి-20 టోర్నమెంటును దేశంలోనే తొలిసారిగా మనమే ప్రారంభించాం. వచ్చే ఏడాది దాదాపుగా బీసీసీఐ ఉమెన్స్ ఐపీఎల్ను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
న్యూ: మంగళగిరి క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ స్థాయి టోర్నమెంటుకు సిద్ధమేనా?
జ: నేటికి తొమ్మిది వికెట్స్ ఉన్నాయి. సెంట్రల్ వికెట్స్ అన్నీ టఫ్మోడ్ వికెట్స్, డ్రస్సింగ్ రూములు, రోడ్లు, డ్రైయిన్లు పూర్తి చేయాల్సి ఉంది. బీసీసీఐ నుంచి 50 శాతం రియంబర్స్మెంట్ ఇస్తుంది. అది రాగానే పూర్తి స్థాయిలో స్టేడియాన్ని సిద్ధం చేస్తాం. జాతీయ స్థాయి టోర్నమెంట్ నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.
న్యూ: రంజీకి అవకాశం ఉందా?
జ: ఈ ఏడాది మనకు రంజీ అవకాశం వస్తే ఇక్కడే ఆడిస్తాం. ఒక మంచి మ్యాచ్ డిసెంబర్లో నిర్వహిస్తాం.
న్యూ: ఔత్సాహిక క్రికెటర్లకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
జ: రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్లను ప్రాతిపదికగా తీసుకుని 64 సబ్ సెంటర్లు నడుపుతున్నాం. సమీప ప్రాంత ఔత్సాహిక క్రికెటర్లు దూరం వెళ్లకుండా వారికి అందుబాటులోకి సబ్ సెంటర్లను తీసుకొచ్చాం. వీటిలో నెట్స్ ఉంటాయి. కోచ్ని నియమించాం. రోజుకు రెండుసార్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశాం. జిల్లా స్థాయిలో గ్రౌండ్స్ అందుబాటులోకి తెస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!
[ 26-04-2024]
ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్దే. సకాలంలో ఫీజు రీయింబర్స్మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్ ఆరితేరిపోయారు. -
మూడో దశ.. మాటే లేదు
[ 26-04-2024]
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
స్వతంత్ర అభ్యర్థిని.. కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
[ 26-04-2024]
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేయాలనుకున్న ఏసుభక్తనగర్కు చెందిన విడదల రజని కిడ్నాప్ వ్యవహారం పోలీసుల్లో చిచ్చు రేపింది. ఉన్నతాధికారికి తెలియజేసే విషయంలోనూ పోలీసులు తీవ్ర జాప్యం చేసినట్లు తెలిసింది. -
మైనార్టీలకు అన్యాయం జరిగితే రాజీనామాకు సిద్ధం
[ 26-04-2024]
రాబోయే ఎన్నికల్లో తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మైనార్టీల రిజర్వేషన్లు, స్వేచ్ఛ, సమానత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, కావాలనే వైకాపా అసత్య ప్రచారం చేస్తోందని, ఒకవేళ అలాంటిదే జరిగితే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. -
తెదేపా పాలనలో రూ.2500 కోట్లతో అభివృద్ధి
[ 26-04-2024]
2014 నుంచి 2019 వరకు సాగిన తెదేపా పాలనలో రూ.2,540 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామని, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో రూ.2,540 కోట్ల ప్రజా సంపదను ఎమ్మెల్యే కిలారి... -
ట్యాంకర్లతో తాగునీటి సరఫరాకు అనుమతివ్వండి
[ 26-04-2024]
తెదేపా మంగళగిరిలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా కొనసాగించేందుకు అనుమతివ్వాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కూటమి అభ్యర్థి నారా లోకేశ్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి గురువారం లేఖ రాశారు. -
పల్లె కలలకు... జగన్ తూట్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అయిదేళ్లుగా విస్మరించింది. ఇక్కడి సమస్యలను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. కేంద్రం ఇచ్చే నిధులను సైతం మళ్లించి పల్లె ప్రగతికి సంకెళ్లు వేసింది. -
అధికార పార్టీ ప్రచారం.. ప్రయాణికులకు నరకం
[ 26-04-2024]
వైకాపా ఎన్నికల ప్రచారం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. మండలంలోని పేరేచర్లలో గురువారం సాయంత్రం తాడికొండ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్యేక వాహనంలో తిరుగుతూ ప్రచారం చేశారు. -
వారంలో అయిదోసారి..!
[ 26-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో పోలీసులు వివక్ష చూపుతున్నారు. అధికార పార్టీకి విషయంలో ఒకలా..ప్రతిపక్షాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారు. -
మెగా కాదు.. దగా డీఎస్సీ
[ 26-04-2024]
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉద్యోగ పండగ జరగనుందని... మెగా డీఎస్సీ పేరిట జాతర రాబోతుందని గత ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ హామీ ఇచ్చి నేడు తమని నడిరోడ్డుపై పడేశారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
జగన్ ఏలుబడిలో... అంగన్వా‘డీలా’
[ 26-04-2024]
అంగన్వాడీలకు తక్కువ వేతనాలంటూ నాడు జగన్ మొసలి కన్నీరు.. నేనొస్తే పెంచేస్తానంటూ ప్రగల్భాలు.. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచిన పాలకులు.. తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులపాటు సమ్మె చేస్తే కర్కశంగా అణగదొక్కారు. -
జిల్లాలో మొత్తం 249 నామినేషన్లు
[ 26-04-2024]
ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఉదయం 11 గంటల నుంచే ఆర్వో కార్యాలయాల వద్ద అభ్యర్థులు బారులు తీరారు. -
గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
[ 26-04-2024]
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. -
తెలంగాణతో పోల్చి.. అంగన్వాడీలను వంచించి..
[ 26-04-2024]
అంగన్వాడీలకు తెలంగాణలో కన్నా అధిక వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా సీఎం జగన్ వారిని మోసం చేశారు. -
పల్నాడు జిల్లాలో 342 నామినేషన్లు
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణలో ఆఖరి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తా
[ 26-04-2024]
వైకాపాను వీడి తెదేపాలో చేరతావా? ఎన్నికల రోజు ఏజెంటుగా కూర్చుంటే నరికేస్తానంటూ వైకాపా నాయకులు తెదేపా సానుభూతిపరుడిపై దాడికి పాల్పడిన ఘటన గురువారం పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 26-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల