యూరియా ఏదయా?
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో యూరియా కొరత కర్షకులను వెంటాడుతోంది. డెల్టాలో జొన్న, మొక్కజొన్న, పల్నాడులో మొక్కజొన్నతోపాటు వరికి యూరియా అవసరం ఉండటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది
ఆర్బీకేల్లో నిండుకుంటున్న నిల్వలు
ఈనాడు, అమరావతి
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో యూరియా కొరత కర్షకులను వెంటాడుతోంది. డెల్టాలో జొన్న, మొక్కజొన్న, పల్నాడులో మొక్కజొన్నతోపాటు వరికి యూరియా అవసరం ఉండటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అందుకు అనుగుణంగా నిల్వలు లేకపోవడంతో కొరత ఏర్పడింది. పదిరోజుల తర్వాత అవసరమయ్యే రైతులు కూడా ముందుగానే కొని నిల్వ చేయడంతో సమస్య అధికమైంది. మూడు జిల్లాల పరిధిలో వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయశాఖ చెబుతున్నా రైతులు మాత్రం కొనుగోళ్లను తగ్గించడం లేదు. దీనికితోడు ఆర్బీకేలకు వచ్చిన లారీ వచ్చినట్లే విక్రయిస్తుండడంతో ఎప్పటికప్పుడు నిల్వలు నిండుకుంటున్నాయి. మొక్కజొన్నకు ఒక్కొక్క ఎకరాకు ఆరు బస్తాల వరకు యూరియా చల్లుతున్నారు. దీంతో డెల్టాలో పదెకరాలు సాగుచేసే రైతులు సైతం ఒక్కొక్కరు 60 బస్తాల వరకు యూరియా కొనుగోలు చేస్తుండటం గమనార్హం. లారీకి 440 బస్తాలు ఆర్బీకేకు వచ్చిన వెంటనే అప్పటికప్పుడే విక్రయమవుతున్నాయి.
రూ.350కు పైగా వసూలు
ఆర్బీకేలు, డీసీఎంఎస్లు, సొసైటీల్లో 45కిలోల యూరియా బస్తా రూ.266.50కే లభిస్తోంది. అదే ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.320 నుంచి రూ.370 వరకు చెల్లించి రైతులు కొంటున్నారు. యూరియాకు డిమాండ్ ఉండటంతో ఆయా కంపెనీలు లింకు ఎరువులు అంటగట్టడంతోపాటు రవాణా ఛార్జీలు సైతం వ్యాపారులపైనే వేస్తున్నాయి. కొన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు ఎమ్మార్పీ కంటే తక్కువ ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా సరఫరా చేస్తామని కొన్ని కంపెనీలు షరతు విధించాయి.
గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పరిధిలో వేల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయాధికారులు లెక్కలు చెబుతున్నారు. ఆయా జిల్లాలకు వచ్చే యూరియాలో 50శాతం మార్క్ఫెడ్కు, 50శాతం ప్రైవేటు వ్యాపారులకు సరఫరా అవుతోంది. మార్కెట్లో యూరియాకు డిమాండ్ ఏర్పడటంతో మార్క్ఫెడ్ గోదాములకు వెళ్లకుండానే రేక్ పాయింట్ నుంచి నేరుగా ఆయా ఆర్బీకేలకు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు మార్క్ఫెడ్ వద్ద ఉన్న బఫర్ నిల్వలు కూడా కరిగిపోయాయి. ఆర్బీకేలు, డీసీఎంఎస్లు, సొసైటీల్లో నిల్వలు కరిగిపోవడంతో ప్రైవేటు వ్యాపారులు ఆచితూచి విక్రయిస్తున్నారు. తెలిసిన రైతులకే అధికధరకు విక్రయిస్తున్నారు. బుధ, గురువారాల్లో రేక్లు వచ్చినా డిమాండ్ మేరకు సరఫరా చేయలేని పరిస్థితి. ఫిబ్రవరి 20 వరకు వరుసగా రేక్లు వస్తేనే కొంత ఉపశమనం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
రూ.350 వెచ్చించినా గడ్డ కట్టిన యూరియా
రబీలో ఆరు ఎకరాల్లో వరి సాగుచేస్తున్నా. నకరికల్లు మండలంలోని ఓ ఎరువుల దుకాణంలో రెండు యూరియా బస్తాలు కొన్నా. ఒక్కొక్క బస్తాకు రూ.350 చొప్పున చెల్లించినా బిల్లు మాత్రం ఇవ్వలేదు. కొనుగోలు చేసిన యూరియాను పొలానికి తీసుకెళితే మొత్తం గడ్డలు కట్టింది. చల్లడానికి ఇబ్బందులు పడ్డాను.
చీళ్ల శ్రీనివాసరావు, రైతు, చీమలమర్రి గ్రామం
అధికంగా వేస్తే అనర్థమే..
మొక్కజొన్న, జొన్నకు ఎకరాకు 96కిలోల నైట్రోజన్ సరిపోతుంది. ఈ లెక్కన ఎకరాకు నాలుగు బస్తాలు వేయాలి. అయితే కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయలేక ఆర్బీకేల్లో రూ.266.50లకే బస్తా వస్తుండటంతో ప్రత్యామ్నాయంగా యూరియా వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో సగటున ఎకరాకు 8 నుంచి 10 బస్తాల వరకు చల్లుతున్నారు. కొందరు రైతులు మూడో విడతకు అవసరమైన యూరియా నిల్వ చేసుకోవడం కొరతకు కారణమవుతోంది. పరిమితికి మించి నైట్రోజన్ భూమిలోకి వేయడం వల్ల భూముల్లో ఉప్పుశాతం పెరిగి చౌడుగా మారే ప్రమాదం ఉంది. దీంతోపాటు నేలలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. పంటపచ్చగా ఏపుగా పెరగడం వల్ల చీడపీడలు పెరుగుతాయి. అవసరాలకు మించి వేసినా అనర్థాలే ఎక్కువని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. -
ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!
[ 07-05-2024]
ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్నిక్ స్పాట్లా మార్చారు. -
జగన్ మార్కు ఇసుక దోపిడీ
[ 07-05-2024]
వైకాపా నేతలు బరితెగించి కృష్ణా తీరంలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జీసీకేసీ కంపెనీకి కొన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతులను సాకుగా చూసి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. -
పోస్టల్ బ్యాలట్లో..ప్రలోభాల పర్వం..
[ 07-05-2024]
ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగించుకునే కేంద్రాల వద్దకు అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చి ఉద్యోగులతో మాటలు కలిపి ప్రలోభాలకు తెరలేపారు. -
ఎస్సీ రైతులపై కపట ప్రేమ
[ 07-05-2024]
రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చిన ఎస్సీలకు మూడేళ్లుగా కౌలు ఎగ్గొట్టారు. ఇందుకు సీఐడీ విచారణ అంటూ వంక పెట్టారు. వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. -
‘వైకాపాకు వేసే ఓటు మురిగిపోయినట్లే’
[ 07-05-2024]
ఎన్నికల్లో వైకాపాకు వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లేనని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాడికొండ మండలంలో ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్తో కలసి సోమవారం ఉదయం ఆయన రోడ్షో నిర్వహించారు. -
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి
[ 07-05-2024]
గుంటూరు తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్వలి కార్యకర్తలతో కలిసి 50వ డివిజన్లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. -
‘జగన్కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’
[ 07-05-2024]
మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్డర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. -
గడప గడపకు కిలాడి మాటలు
[ 07-05-2024]
భూమి పూజకు పరిమితం.. పాత పొన్నూరు ఇందిరాకాలనీలో రెండేళ్ల కిందట ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పర్యటించగా.. మురుగుకాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. -
పోరాట బాట.. గెలుపు బాసట
[ 07-05-2024]
చీరాలలో ఓ పెద్దాయనను గెలిపిస్తే.. పార్టీ మారి నమ్మక ద్రోహం చేశారు.. జిల్లా నుంచి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ ఈ అయిదేళ్లలో ఎన్నో కష్టాలు పడ్డారు.. -
నోటికాడ ‘అన్నం’ లాగేసిన జగన్
[ 07-05-2024]
పేదలు కడుపు నిండా అన్నం తిన్నా జగన్కు రుచించదు.అందుకే వారి నోటికాడ ముద్ద తీసి పొట్టపై కొట్టాడు. అర్ధాకలితో అలమటించేలా చేశాడు. తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను మూతపడేలా చేశాడు. -
వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు
[ 07-05-2024]
నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని