కేబుల్ వార్!
గుంటూరు నగరంలో గత కొంతకాలం నుంచి కేబుల్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం అది పతాక స్థాయికి చేరింది. నగరంలో పలు నెట్వర్క్లు ఉన్నాయి. వారి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో గొడవలు చోటుచేసుకుంటున్నాయి.
నగరంలో పలుచోట్ల వైర్లు కత్తిరింపు
వినియోగదారులకు నిలిచిన ప్రసారాలు
ఈనాడు, అమరావతి
గుంటూరు నగరంలో గత కొంతకాలం నుంచి కేబుల్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం అది పతాక స్థాయికి చేరింది. నగరంలో పలు నెట్వర్క్లు ఉన్నాయి. వారి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. చివరకు దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం చేస్తున్న నెట్వర్క్ను వదిలేసి తమ నెట్వర్క్ పరిధిలోకి మారాలని, లేకుంటే మీ వినియోగదారులకు ప్రసారాలు రాకుండా అసౌకర్యం కలిగిస్తామని, ఆపరేటర్గా కొనసాగడం కష్టమని ఓ నేత బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. ఒక యాజమాన్యానికి చెందిన వైర్లను మరొకరు కత్తిరించడం వంటివి చేస్తూ అంతిమంగా ప్రసారాలు రాకుండా అడ్డుకుంటున్నారు. శనివారం ఇది మరింత వివాదాస్పదమైంది.
విజయవాడ నుంచి గుంటూరు నగరంతో పాటు చుట్టు పక్కల పరిసరాల్లోని కేబుల్ నెట్వర్క్కు ఫీడ్ అందకుండా పలుచోట్ల కేబుల్ వైర్లను కత్తిరించారు. దీంతో వినియోగదారులకు కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ‘కరెంటు స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కత్తిరించారని, దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని’ కేబుల్ ఆపరేటర్ వర్గాలు పేర్కొన్నాయి. ‘2021లో కూడా కేబుల్ వైర్లను కత్తిరించగా అప్పట్లో విద్యుత్శాఖ అధికారులకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాం. దానిపై స్టే వచ్చింది. అది ఇంకా వెకేట్ కాలేదు. అది కొనసాగుతుండగానే మరోసారి విద్యుత్శాఖ అధికారులు తాజాగా తమ కేబుల్వైర్లను కత్తిరించారని’ తెలిపారు. నగరంలోని సుమారు 100 నుంచి 150కు పైగా ప్రదేశాల్లో కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను కత్తిరించారు. మిగిలిన నెట్వర్క్స్ జోలికి వెళ్లలేదని, కేవలం ఓ నాయకుడి ఆదేశాల మేరకు అధికారులు ఇలా వ్యవహరించి ఉంటారని పలువురు కేబుల్ ఆపరేటర్లు, గుంటూరులోని దాని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కేబుల్వైర్లను కత్తిరించగా తిరిగి తాము వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకోగా అప్పుడు కత్తిరించారని, దీంతో తాము శనివారం సాయంత్రం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ‘విద్యుత్ స్తంభాలపై కేబుల్ తీగలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. కేబుల్ బండిళ్లు పోల్స్పైనే వదిలేస్తున్నారు. దీని వల్ల మా లైన్మెన్లు స్తంభాలు ఎక్కినప్పుడు ఆ వైర్లలో కాళ్లు, చేతులు ఇరుక్కుని చివరకు ప్రమాదాలకు గురవుతున్నారు. అందువల్లే వాటిని తొలిగిస్తున్నామని’ విద్యుత్ శాఖ వర్గాలు అంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో రాయపాటి అరుణకు గాయాలు
[ 02-05-2024]
జిల్లాలోని జె.పంగులూరు మండలం రేణింగవరం వద్ద కారు డివైడర్ను ఢీకొంది. -
గర్జించిన గుంటూరు.. చంద్రబాబుకు అభిమాన నీరాజనం
[ 02-05-2024]
‘గుంటూరు మిరప ఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు. ర్యాలీ అదుర్స్’ అని రోడ్షోలో భారీగా స్వాగతం పలికిన, సభకు హాజరైన జనాన్ని చూసి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు. -
పాలకుల పాపాలు.. సమిధలయ్యె ప్రాణాలు
[ 02-05-2024]
రక్షితనీరు.. ప్రజల ప్రాథమిక అవసరం.. కానీ జగన్ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. తాగు నీటి సరఫరా, నిర్వహణపై అధికారులతో ఎప్పుడూ సమీక్షించింది లేదు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
[ 02-05-2024]
న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలల గృహం.. కల్లోలం
[ 02-05-2024]
అర్హులైన ప్రతి పేదకు ఇంటి స్థలంతో పాటు గృహాన్ని నిర్మించి ఇచ్చే బాధ్యత మాది. మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తాం. -
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
[ 02-05-2024]
‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతలు.. ‘మేత’లు
[ 02-05-2024]
జేపీ కంపెనీ ఇసుక తవ్వకాల నుంచి తప్పుకున్న తర్వాత ఇసుక వ్యాపారాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేజిక్కించుకున్నారు. -
కోడ్ ఉల్లంఘనపై 60 కేసులు
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
చంద్రబాబును గెలిపించండి
[ 02-05-2024]
రాజధానిని నిర్మించే నాయకుడు చంద్రబాబును గెలిపించాలని అమరావతి రాజధాని రైతులు మంగళగిరి కొత్తపేటలో బుధవారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. -
యువకుల ప్రాణాలు కాపాడిన బీచ్ పోలీసులు
[ 02-05-2024]
సూర్యలంక తీరంలో విహారానికి వచ్చి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న మంగళగిరికి చెందిన ఇద్దరు యువకుల ప్రాణాలను బీచ్ పోలీసులు బుధవారం కాపాడారు. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీ వలసలు
[ 02-05-2024]
తెనాలిలో వైకాపా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు, -
ప్రాణాలు పోతున్నా పట్టదా..!
[ 02-05-2024]
వైౖకాపా పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ‘నాకింత.. -
స్వచ్ఛమైన నీరు ఎక్కడ.. కిలారి
[ 02-05-2024]
పుర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనేక సందర్భాల్లో వేదికలపై నుంచి చెప్పారు. -
అవకాశవాదులను తెదేపాలో చేర్చుకోం
[ 02-05-2024]
-
జీఎంసీకి రూ.5 లక్షల జరిమానా
[ 02-05-2024]
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు ఆదేశించారు. -
పోస్టల్ బ్యాలట్ల దరఖాస్తులు తీసుకోవడానికి నిరాకరణ
[ 02-05-2024]
బాపట్ల జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఒప్పంద ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ తీసుకోవడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తహసీల్దార్లు నిరాకరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..