మరెందుకు ఆలస్యం.. రాజీనామా చేయండి..
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు.
వాలంటీర్లకు వైకాపా ఎమ్మెల్యేల ఫోన్లు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట
రాజీనామా చేసేయండి.. హాయిగా పార్టీ ప్రచారంలో పాల్గొనండి అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మళ్లీ తీసుకుంటామని ప్రస్తుతానికి అంతా చూసుకుంటామంటూ చెప్పుకొస్తున్నారు. ఓ ఎమ్మెల్యే అయితే నేరుగా ఆయనే వాలంటీర్లకు ఫోన్లు చేస్తున్నారు. 27న నియోజకవర్గంలోని వాలంటీర్లకు ఫోన్ చేయగా, 28న అందరూ రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే వాలంటీర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. పార్టీ కార్యక్రమాలకు తమను వాడుకొని బలిపశువులను చేస్తారని కొందరు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా కేవలం ప్రభుత్వం చెప్పిన పనులే చేస్తామని, పార్టీ ప్రచారాల్లో పాల్గొనబోమని, ఎవరి కోసమో తామెందుకు సస్పెండ్ కావాలంటూ కొందరు వాలంటీర్లు వెనకడుగు వేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో మళ్లీ వైకాపానే వస్తుందని గ్యారెంటీ ఏంటని, ఒకవేళ వచ్చినా తమనే మళ్లీ తీసుకుంటారా.. లేక వేరే కొత్త వారిని తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని కూడా ఆలోచించి తటస్థంగా ఉంటున్నారు.
ఎమ్మెల్యేల నుంచి పెరిగిన ఒత్తిడి..
రాజీనామా చేసి పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిందేనని కొందరు ఎమ్మెల్యేలు వాలంటీర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. కావాలంటే ఈ రెండు నెలలు భోజనం పెట్టడంతో పాటు మంచి వేతనం ఇస్తామని, పార్టీకి సేవలందించాలని గట్టిగా చెబుతుండటంతో కొందరు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాక ముందే అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు వాలంటీర్లకు తాయిలాలు పంపిణీ చేశారు. కొందరైతే నగదు అందజేశారు. తీసుకున్నవాళ్లకు ఫోన్లు వెళ్తున్నాయి. ఈ నాలుగేళ్లలో వాలంటీర్లకు వారి పరిధిలోని ఓటర్లు పరిచయం కావడం.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించారు కాబట్టి వీరినే వాడుకోవాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వైకాపాకు కాకుండా వేరే పార్టీకి ఓటు వేస్తే పింఛన్ రాదని, మిగతా సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకు రావని పదేపదే చెప్పించేలా చూడాలని ఎమ్మెల్యేల ఎత్తుగడ. కానీ ఇలా కరపత్రాలు పంపిణీ చేస్తూ వైకాపాకు ప్రచారం చేయడం వల్ల కొందరు వాలంటీర్లు సస్పెండ్ అయ్యారు. దీంతో తాము ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సామాన్యుడిని వదిలేసి.. సారొస్తే కోట్లు తగలేసి
[ 28-04-2024]
బీటలు వారిన పిల్లర్లు.. పడిపోయిన రెయిలింగ్లు.. కూలిన పిట్టగోడలు.. తుప్పుపట్టి బయటకి కనిపిస్తున్న ఇనుప చువ్వలు.. వంతెనలపైనే గోతులు.. ఇవీ సామాన్యుడు వెళ్లే వారధులు.. జగనన్న సంక్షేమ రాజ్యంలో ప్రగతిదారులు.. అదే సీఎం సారు బయటకు అడుగేస్తే వాటి రూపురేఖలే మారిపోతాయి.. ఆయన అడుగుపెట్టేచోట ముందురోజే తళతళలాడే తారు రోడ్డు వేయాల్సిందే. -
జగనన్న పాలన.. మూడుసార్లు వడ్డన
[ 28-04-2024]
తెదేపా ప్రభుత్వ పాలనలో అన్ని ఛార్జీలు పెంచేశారు. మేం అధికారంలోకి వస్తే ఆర్టీసీ ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. పెంపు జోలికి వెళ్లం. -
నిలదీతలకు వేరసి.. పనులకు తెరదీసి..
[ 28-04-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా నగరపాలిక అధికారులు అదేం పట్టించుకోకుండా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రస్తుతం కొత్త పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే పలు పనులు చేపట్టగా వాటిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
ప్రజల కష్టాలు చూసే ‘సూపర్-6’ రూపకల్పన: లోకేశ్
[ 28-04-2024]
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూశానని, వాటి నుంచి వారిని బయట పడేసేందుకే ‘సూపర్-6’ పథకాలకు రూపొందించినట్లు యువనేత, మంగళగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి నారా లోకేశ్ తెలిపారు. -
కూటమి విజయ దుందుభి ఖాయం
[ 28-04-2024]
రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయ దుందుభి మోగించడం ఖాయమని.. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి గెలుపును ఎవరూ ఆపలేరని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చెప్పారు. -
బ్యాండేజీ తీశాక బయటపడిన జగన్నాటకం: లోకేశ్
[ 28-04-2024]
జగన్రెడ్డి తలకు తగిలిన గులకరాయి గాయంపై బ్యాండేజీ తీసేస్తే ఎలాంటి మచ్చా లేదని, దీంతో ఆయన నటన ప్రజలకు అర్థమైందని యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
మాకు ఏం చేశారని ఓటెయ్యాలి
[ 28-04-2024]
మంగళగిరి వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యకు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలోని రత్నాలచెరువులో శనివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలిని ఓటు అభ్యర్థించారు. -
ఇంటింటికీ నీరు ఇవ్వలేకపోవడం దారుణం
[ 28-04-2024]
కృష్ణా నది నుంచి పైపుల ద్వారా నీరు అందుబాటులోకి తెచ్చినా.. పట్టణంలో ఇంటింటికీ కుళాయి నీరు ఇవ్వలేక పోవడం దారుణమని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆగుతున్నాయ్.. ఊడుతున్నాయ్.. జగనాసుర రథ‘చక్రాలు’
[ 28-04-2024]
సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు ప్రయాణాలకు ఎక్కువగా ఉపయోగించే ఆర్టీసీ బస్సు ఛార్జీలు వైకాపా ఐదేళ్ల పాలనలో మూడుసార్లు పెంచింది. అన్నిరకాల బస్సుల్లో ఛార్జీలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!