విశ్రాంతిలోనూ.. మనశ్శాంతి లేదయ్యా!
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు.
జగన్ జమానాలో పింఛనర్ల జీవితాలు అతలాకుతలం
క్వాంటమ్ పింఛన్ మూడు శాతం తగ్గింపు
పెండింగ్లో డీఏలు.. రూ.లక్షల్లో నష్టం
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్కు గతంలో ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. బీపీ, మధుమేహం సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులకు సరిపడా ఒకేసారి ఔషధాలు తెచ్చుకునేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఆయనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పింఛన్ 10, 12 తేదీల్లో పడుతోంది. ఓ నెలలో 15 వరకు రాలేదు. సకాలంలో పింఛన్ పడక ఆందోళకు గురై బీపీ, మధుమేహం సమస్యలు మరింత పెరిగాయి. నెలవారీ చెల్లింపులు సకాలంలో చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. డీఏలు పెండింగ్లో పెట్టడటం, ఫిట్మెంట్లో కోత విధించటం వల్ల ఐదేళ్లలో రూ.లక్షన్నరకు పైగా నష్టపోయారు.
- విశ్రాంత ఉద్యోగి సుబ్బారావు పింఛన్ నుంచి ఆరోగ్య బీమా కింద ప్రభుత్వం నెలకు రూ.300 చొప్పున మినహాయించుకుంటోంది. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి హెల్త్కార్డు చూపిస్తే ఈ కార్డుతో వైద్యం చేయలేం. ముందుగా చెల్లించి తర్వాత ప్రభుత్వం నుంచి వైద్య బిల్లులు రీయింబర్స్మెంటు చేసుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారు. శస్త్రచికిత్స, వార్డులో ఉండి వైద్యం పొందినందుకు రూ.లక్షల్లో ఖర్చయింది. వైద్య బిల్లులకు నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంటు మాత్రం ఇంకా రాలేదు. బిల్లు సొమ్ము ఎప్పుడు వస్తుందా అని ఆందోళన చెందుతున్నారు.
బాపట్ల, న్యూస్టుడే: సీఎం వైఎస్ జగన్ పాలనలో విశ్రాంత ఉద్యోగుల జీవితం దినదిన గండంగా మారింది. గతంలో ఠంచనుగా ఒకటో తేదీ పింఛన్ సొమ్ము అందేది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించేవారు. జగన్ గద్దె ఎక్కిన తర్వాత పింఛనర్లకు కష్టాల సుడిగుండాలు మొదలయ్యాయి. అసలు పింఛన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. పింఛన్ నగదు పడక ఆందోళనకు గురై అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపింది. కరవు భత్యం(డీఏ) కూడా ఒక్కసారే చెల్లించారు. రెండో డీఏ కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకొకసారి డీఏ ఇవ్వలేదు. ఎనిమిది డీఏలు రాక ఒక్కో పింఛన్దారుడు రూ.లక్షల్లో నష్టపోయారు. సీఎం జగన్ తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైకాపా పాలనలో మోసపోయామని పింఛన్దారులు తీవ్ర మనోవేద]నకు గురవుతున్నారు.
2019 నుంచి 2024 మధ్యకాలంలో..
- వైకాపా వచ్చాక, 2019లో సీఎం జగన్ 27 శాతం పీఆర్సీ అని చెప్పి మొదట ఆరు నెలలు మాత్రమే ఇచ్చి తర్వాత నుంచి 20 శాతం అని చెప్పి రివర్స్ పీఆర్సీ చేసి ఇస్తున్నారు.
- ప్రతీ నెలా ఒకటో తేదీన పింఛన్ రావడం అనేది ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా జరగలేదు. పదో తేదీ నుంచి 20 తేదీ మధ్యలో ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. చివరకు పింఛను సొమ్ము పడడమే మహాభాగ్యం అనుకునేలా చేశారు.
- 2021 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబరు వరకు 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు.
- 2018 జులై నుంచి ఇప్పటి వరకూ మొత్తం 185 నెలల కరవు భత్యం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ్ర
- 70 ఏళ్లలోపు పింఛనుదారులకు అదనపు భృతి ఇదివరకు 10 శాతం ఉండేది. ఇప్పుడు ఏడు శాతానికి కుదించారు. అలాగే 75 ఏళ్ల వారికి 15 శాతం ఉండేది. దీనిని 12 శాతానికి తగ్గించారు.
- పింఛనుదారులు చనిపోతే వారికి చెల్లించాల్సిన మట్టి ఖర్చులు గరిష్ఠంగా నెల పింఛను మంజూరు విధానాన్ని మార్చి, కేవలం రూ.25 వేలే చెల్లిస్తున్నారు.
- మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఈహెచ్ఎస్ కార్డులను నిర్వీర్యం చేశారు. ఆస్పత్రుల్లో నగదురహిత చికిత్సలు చేయడం లేదు.
- డీఏలు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా పింఛన్దారుల పింఛన్ సొమ్ము పెంచినట్లు చూపించి ఆదాయ పన్ను వసూలు చేయడం గమనార్హం.
రూ. మూడు లక్షలు నష్టపోయా
వైకాపా ప్రభుత్వ పాలనలో పింఛనర్లు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. సకాలంలో పింఛన్ సొమ్ము చెల్లించడం లేదు. ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన చెందుతున్నాం. డీఏలు ఇవ్వకుండా మోసం చేశారు. కేవలం మూడు శాతం మాత్రమే ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చారు. డీఏలు, ఫిట్మెంట్ రూపంలో ఐదేళ్లలో వ్యక్తిగతంగా నేను రూ.మూడు లక్షలు నష్టపోయా. హెల్త్కార్డు ఉన్నా అన్ని వ్యాధులకు వైద్యం చేయడం లేదు. మెడికల్ రీయింబర్స్మెంటు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తున్నారు.
చెరుకూరి సుబ్బారావు, పింఛనర్ల సంఘం అధ్యక్షుడు
క్వాంటమ్ పింఛన్ తగ్గించడం అన్యాయం
70 ఏళ్లు దాటిన పింఛన్దారులకు చెల్లించే క్వాంటమ్ పింఛన్ను పది శాతం నుంచి ఏడు శాతానికి ప్రభుత్వం తగ్గించింది. అదనంగా వచ్చే పింఛన్లో మూడు శాతం చొప్పున గత నాలుగేళ్లలో రూ.వేలల్లో నేను నష్టపోయా. పింఛన్ చెల్లింపులో బాగా జాప్యం చేయడం వల్ల రుణాల తాలూకూ ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక ఇబ్బంది పడుతున్నాం.
జీవీ బ్రహ్మం, పింఛనర్ల సంఘం ఉపాధ్యక్షుడు
గత ప్రభుత్వ హయాంలో..
రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక లోటును లెక్కచేయకుండా 43 శాతం ఫిట్మెంట్తో చంద్రబాబు పదో పీఆర్సీ ఇచ్చారు. జూన్ 2014 నుంచి మార్చి 2015 వరకు 10 నెలల పీఆర్సీ బకాయిలు సుమారు రూ.2 వేల కోట్లు ఒకేసారి పింఛనుదారులు అందరికీ చెల్లించారు. విరమణ పొందే ఉద్యోగులకు రిటైర్మెంట్ తేదీకి 15 రోజుల ముందుగానే ట్రెజరీలో బిల్లుల చెల్లింపు కోసం అనుమతి ఇచ్చేందుకు ప్రత్యేక జీవో తెచ్చారు. అంతేకాకుండా ఉద్యోగ విరమణ రోజే పింఛను, గ్రాట్యూటీ, కమ్యూటేషన్, గ్రూప్ ఇన్సూరెన్స్, జీపీఎఫ్, లీవ్ ఎన్క్యాష్మెంట్ తదితరాలు ఉద్యోగులకు సకాలంలో అందించారు. ప్రతి నెలా 31వ తేదీ సాయంత్రం లేదా ఒకటో తేదీన పింఛను ఇచ్చేవారు.
వైకాపా హయాంలో పింఛను సొమ్ముకు కోత
డబ్భై ఏళ్లు దాటిన పింఛనర్లకు ఔషధాల కొనుగోలు, ఇతర అదనపు ఖర్చులు కలిపి అదనంగా పది శాతం క్వాంటమ్ పింఛన్, 75 ఏళ్లు నిండితే 15 శాతం క్వాంటమ్ పింఛన్ చెల్లించారు. క్వాంటమ్ పింఛన్ రూపంలో అదనంగా పింఛన్ సొమ్ము లభించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఖర్చుల భారం పడలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో క్వాంటమ్ పింఛన్కు కోతలు విధించారు. విశ్రాంత ఉద్యోగి రామారావుకు వయస్సు 74 ఏళ్లు. 70 ఏళ్లు దాటిన పింఛన్దారులు అనారోగ్య సమస్యలతో పెరుగుతున్న ఔషధాలు, ఇతర ఖర్చుల కింద అదనంగా పది శాతం క్వాంటమ్ పింఛన్ పొందేవారు. సీఎం జగన్ క్వాంటమ్ పింఛన్ను పది శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా విశ్రాంత ఉద్యోగులకు ఖర్చులు పెరిగాయి. కానీ క్వాంటమ్ పింఛన్లో మూడు శాతం కోత విధించడం వల్ల నాలుగేళ్లలో రామారావు రూ.65 వేలు నష్టపోయాడు.
జిల్లాలో మొత్తం పింఛన్దారులు: 9,592 మంది
ప్రతి నెలా చెల్లిస్తున్న పింఛన్ సొమ్ము: రూ.39.76 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యానిఫెస్టో మీ ముందుపెట్టాం.. ఆశీర్వదించండి: ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి
[ 30-04-2024]
‘రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే మ్యానిఫెస్టోను మీ ముందు పెట్టాం. తెదేపా, భాజపా, జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. -
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
[ 30-04-2024]
కాల్చి పడేస్తా ఎవరు వస్తారో రమ్మనురా అంటూ సస్పెండైన ఎస్సై వీరంగం సృష్టించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. భార్య భర్తల కేసు న్యాయస్థానంలో ఉండగా సస్పెన్స్లో ఉన్న ఓ ఎస్సై.. -
ఎండలో మాడ్చొద్దు.. ఉసురు తీయొద్దు
[ 30-04-2024]
సామాజిక పింఛన్ల మొత్తాన్ని బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం వారిని మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది. -
ఓట్ల వేటలో జగన్నాటకమే
[ 30-04-2024]
పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. -
మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!
[ 30-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. -
అయిదేళ్ల వేదన.. అరణ్య రోదన
[ 30-04-2024]
సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. మాట ఇవ్వడం.. మడమ తిప్పడం అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ అయిదేళ్లలో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. -
పొన్నూరు అభివృద్ధిపై నోరువిప్పని జగన్
[ 30-04-2024]
పట్టణంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. -
పోరు.. ఖరారు!
[ 30-04-2024]
గుంటూరు పార్లమెంటు స్థానానికి 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ పోటీకి ఆసక్తి చూపడం గమనార్హం. -
పోరులో నిలిచింది 122 మంది
[ 30-04-2024]
నామినేషన్ల తుది ఘట్టం ముగిసింది. ఉపసంహరణల అనంతరం ఎంపీ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 122 మంది బరిలో నిలిచారు. జిల్లాలో మూడు నియోజకవర్గాల నుంచి ఒక్కరు కూడా తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. -
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యం
[ 30-04-2024]
వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తానని పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
జిల్లాలో 12,91,716 ఓటర్లు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా సోమవారం ప్రకటించారు. జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. -
రెండ్రోజులకోసారి డ్రమ్ము నీరు సరిపోతుందా?
[ 30-04-2024]
రేపల్లె శివారు ప్రాంతమైన 28వ వార్డు ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆరోపిస్తూ వారు ప్రధాన రహదారిపై సోమవారం ఆందోళనకు దిగారు. ట్యాంకరుతో రెండ్రోజులకోసారి సరఫరా చేస్తున్న నీరు అందరికీ సరిపోవడంలేదని మండిపడ్డారు. -
లోకేశ్తో చిరువ్యాపారులకు మంచి రోజులు
[ 30-04-2024]
నారా లోకేశ్ ఎమ్మెల్యే అయితే మంగళగిరిలో చిరు వ్యాపారులకు మంచి రోజులొస్తాయని, సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. -
వసూళ్లలో ఎగుమతి, దిగుమతి సంఘాల నేతలు
[ 30-04-2024]
వ్యాపారుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన మిర్చి ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులు అధికార పార్టీ నేతల సేవలో మునిగి తేలుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్