కర్షకుల కష్టాలు కనిపించవా..?
పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు.
పూర్తికాని పెదవడ్లపూడి ఎత్తిపోతల పథకం
రూ.కోటి కేటాయించలేకపోయిన వైకాపా ప్రభుత్వం
ఎత్తిపోతల వద్ద నిర్మించిన పంపుహౌస్
దుగ్గిరాల, న్యూస్టుడే: పెదవడ్లపూడి ఉన్నత వాహినిపై ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చారు. కానీ అమలు చేయడం మర్చిపోయారు. వ్యవసాయాన్ని పండగ చేస్తామని గొప్పలు చెప్పడం తప్పా వైకాపా ప్రభుత్వం తమకు చేసింది ఏమీ లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకానికి రూ. కోటి కేటాయిస్తే నిర్మాణం పూర్తయి రైతులకు ఇబ్బందులు తప్పేవి. తెదేపా హయాంలో మొదలు పెట్టారు కాబట్టి ఇస్తే చంద్రబాబునాయుడికి పేరు వస్తుందని అనుకున్నారేమో కానీ బడ్జెట్ కేటాయించలేదు. దీంతో రైతుల కష్టాలు రెట్టింపవుతూ వస్తున్నాయి.
కాల్వ పరిస్థితి: పశ్చిమడెల్టాకు 4 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల నీరు అందదు. పంటలు పండక, ఇంజిన్లతో నీళ్లు పెట్టుకోవడం వల్ల పెట్టుబడి రెండింతలు అవుతోంది. కొన్నిసార్లు పంటలు పూర్తిగా నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి.
నీరు కాల్వలోకి వచ్చే అవుట్లెట్
పూర్తయ్యేనా..? తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ కాల్వ వెంట వరుసగా నడిచి రైతుల అవస్థలు గమనించారు. పెదవడ్లపూడి వద్ద ఎత్తిపోతల నిర్మించాలని తీర్మానించి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఎత్తిపోతలకు సుమారు రూ.14.3 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.13 కోట్లు వరకు బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి.
బిల్లుల పరిస్థితి: రూ.1.10 కోట్లు వరకూ బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. వాటికి బడ్జెÆట్ ఈ ప్రభుత్వం కేటాయించకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. అవి వచ్చేస్తే 27 వేల ఎకరాల ఆయకట్టు రైతుల కష్టాలు తీరేవి.
ఛానల్ పేరు: పెదవడ్లపూడి ఉన్నత వాహిని (హై లెవల్ఛానల్)
ఆయకట్టు: 27000 ఎకరాలు
పరిధి: దుగ్గిరాల, తెనాలి గ్రామీణ, చేబ్రోలు, కాకాని, మంగళగిరి మండలాలు
ఏటా నష్టపోతూనే ఉన్నాం
-దేశబోయిన శ్రీనివాసరావు, రాజు, రైతులు, కంఠంరాజుకొండూరు
సకాలంలో నీరు అందక ఏటా రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా 100 ఎకరాల్లో రెండో పంట వేయలేకపోయారు. ఎత్తిపోతల పూర్తి చేస్తే హాలికులకు ఇక ఇబ్బందులు ఉండవు.
చందాలు వేసుకుని బాగు చేసుకుంటున్నాం..
- కొరిటాల శివరామకృష్ణప్రసాద్, రైతు, కొండూరు
ఎత్తిపోతల పూర్తి అయితే ఇక కష్టాలు ఉండవు. నేను 32 ఎకరాలు సాగు చేస్తున్నాను. ఇటీవల కాల్వలో గేట్లు ఇబ్బంది అయితే రైతులమే చందాలు వేసుకుని గేటు వేయించుకున్నాం. రైతులకు రెండో పంటే ఆధారం. పెదవడ్లపూడి వద్ద లిఫ్ట్ పనులు పూర్తి అయితే మా రైతులంతా ఆనందంగా ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో రాయపాటి అరుణకు గాయాలు
[ 02-05-2024]
జిల్లాలోని జె.పంగులూరు మండలం రేణింగవరం వద్ద కారు డివైడర్ను ఢీకొంది. -
గర్జించిన గుంటూరు.. చంద్రబాబుకు అభిమాన నీరాజనం
[ 02-05-2024]
‘గుంటూరు మిరప ఘాటు ఎలా ఉంటుందో సత్తా చూపారు. ర్యాలీ అదుర్స్’ అని రోడ్షోలో భారీగా స్వాగతం పలికిన, సభకు హాజరైన జనాన్ని చూసి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఇలా స్పందించారు. -
పాలకుల పాపాలు.. సమిధలయ్యె ప్రాణాలు
[ 02-05-2024]
రక్షితనీరు.. ప్రజల ప్రాథమిక అవసరం.. కానీ జగన్ పాలనలో దీన్ని పూర్తిగా విస్మరించారు. తాగు నీటి సరఫరా, నిర్వహణపై అధికారులతో ఎప్పుడూ సమీక్షించింది లేదు. -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
[ 02-05-2024]
న్యాయం చేయాలని అయిదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే వైకాపా రాక్షస ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీ లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కలల గృహం.. కల్లోలం
[ 02-05-2024]
అర్హులైన ప్రతి పేదకు ఇంటి స్థలంతో పాటు గృహాన్ని నిర్మించి ఇచ్చే బాధ్యత మాది. మీరు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటామంటే పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లిస్తాం. -
అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం
[ 02-05-2024]
‘అమరావతి అంటే ఏంటి..అది ఎక్కడ ఉంది’ అని ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలు సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతలు.. ‘మేత’లు
[ 02-05-2024]
జేపీ కంపెనీ ఇసుక తవ్వకాల నుంచి తప్పుకున్న తర్వాత ఇసుక వ్యాపారాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేజిక్కించుకున్నారు. -
కోడ్ ఉల్లంఘనపై 60 కేసులు
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 60 కేసులు నమోదు చేశారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. -
చంద్రబాబును గెలిపించండి
[ 02-05-2024]
రాజధానిని నిర్మించే నాయకుడు చంద్రబాబును గెలిపించాలని అమరావతి రాజధాని రైతులు మంగళగిరి కొత్తపేటలో బుధవారం సాయంత్రం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. -
యువకుల ప్రాణాలు కాపాడిన బీచ్ పోలీసులు
[ 02-05-2024]
సూర్యలంక తీరంలో విహారానికి వచ్చి సముద్ర స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న మంగళగిరికి చెందిన ఇద్దరు యువకుల ప్రాణాలను బీచ్ పోలీసులు బుధవారం కాపాడారు. -
వైకాపా నుంచి తెదేపాలోకి భారీ వలసలు
[ 02-05-2024]
తెనాలిలో వైకాపా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, వాసు దంపతులు, -
ప్రాణాలు పోతున్నా పట్టదా..!
[ 02-05-2024]
వైౖకాపా పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ‘నాకింత.. -
స్వచ్ఛమైన నీరు ఎక్కడ.. కిలారి
[ 02-05-2024]
పుర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అనేక సందర్భాల్లో వేదికలపై నుంచి చెప్పారు. -
అవకాశవాదులను తెదేపాలో చేర్చుకోం
[ 02-05-2024]
-
జీఎంసీకి రూ.5 లక్షల జరిమానా
[ 02-05-2024]
గుంటూరు వైద్య కళాశాల(జీఎంసీ)లో ప్రస్తుతం ఉన్న 250 ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా తగినంత మంది బోధనానిపుణులు, ఇతర సదుపాయాలు లేనందున రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) అధికారులు ఆదేశించారు. -
పోస్టల్ బ్యాలట్ల దరఖాస్తులు తీసుకోవడానికి నిరాకరణ
[ 02-05-2024]
బాపట్ల జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఒప్పంద ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ తీసుకోవడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తహసీల్దార్లు నిరాకరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?