నిధులు విదిలించరుపనులు పట్టాలెక్కవు
రైల్వే బడ్జెట్ వస్తోందంటే.. కొత్త రైళ్లు, కొత్త లైన్ల కోసం ఆశగా ఎదురు చూసే రోజులు పోయాయి. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులకు ఈ సారైనా సరిపడా నిధులు అందజేస్తారా, పునాదులు పడతాయా.. నిధులు మంజూరవుతాయా
ముందుకు కదలని రైల్వే ప్రాజెక్టులు
ఈ బడ్జెట్పైనా గంపెడు ఆశలు
ఈనాడు, హైదరాబాద్
రైల్వే బడ్జెట్ వస్తోందంటే.. కొత్త రైళ్లు, కొత్త లైన్ల కోసం ఆశగా ఎదురు చూసే రోజులు పోయాయి. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులకు ఈ సారైనా సరిపడా నిధులు అందజేస్తారా, పునాదులు పడతాయా.. నిధులు మంజూరవుతాయా అని ఎదురు చూడాల్సి వస్తోంది. ఎంఎంటీఎస్ రెండో దశ, యాదాద్రి వరకూ కొనసాగింపు, నగర శివార్లలో కొత్తగా నిర్మించ తలపెట్టిన రైల్వేస్టేషన్లు ఈ కోవలోకే వస్తాయి. దశాబ్దాలు దాటినా ప్రాజెక్టులు పట్టాలెక్కని తీరు చూస్తుంటే నగరంపై ద.మ. రైల్వే నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
చర్లపల్లి తప్పితే...
దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే రైళ్లు శివారులకు సమయానికి చేరుకుంటున్నా.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్లాట్ఫారాలు ఖాళీలేక అక్కడే గంటల తరబడి ఆగిపోతున్నాయి. దీనికి విరుగుడుగా నగరం నలువైపులా ఓఆర్ఆర్ను ఆనుకుని నాగులపల్లి, మేడ్చల్, ఉందానగర్, చర్లపల్లి రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చర్లపల్లిలో అంతర్జాతీయ ప్రమాణాలతో శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధి చేయాలనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించాలని కోరారు. కోరి ఆరేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో రైల్వే ఆధీనంలోని 50 ఎకరాల్లో రూ.221 కోట్లతో అభివృద్ధి చర్యలు చేపట్టారు. రెండు దఫాలుగా రూ.120 కోట్లతో స్టేషన్ విస్తరణ పనులు ప్రారంభించి, 6 ప్లాట్ఫామ్లలో నాలుగింటిని పూర్తి చేశారు.
చారిత్రక స్టేషన్ల అభివృద్ధి పట్టక..
* సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను రూ.350 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని 18 ఏళ్ల క్రితం బడ్జెట్లో ఆమోదించారు. మాస్టర్ ప్లాన్కు టెండర్లు పిలిచి కాలయాపన చేశారు. తర్వాత పీపీపీ పద్ధతిలో నిర్మించాలని నోటిఫికేషన్ ఇచ్చినా, రైల్వే షరతులకు ఎవరూ ముందుకు రాలేదు.
* దేశంలోని అన్ని రాష్ట్రాల పర్యాటక కార్యాలయాలు కొలువుదీరేలా హైదరాబాద్ స్టేషన్ను రూ.120 కోట్లతో పర్యాటక హబ్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆ ప్రతిపాదనలు అటకెక్కాయి. కాచిగూడ రైల్వే స్ట్టేషన్ కనీస ప్రతిపాదనలకు నోచుకోలేదు.
ముడిపడని ఆ మూడింటి అభివృద్ధి
నాగులపల్లి, ఉందానగర్, మేడ్చల్ రైల్వేస్టేషన్లలను రూ.300 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. నాగులపల్లిలో రైల్వేకి ఒక్క ఎకరం భూమి కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం భూమిస్తే అభివృద్ధి అన్నట్లు మారిపోయింది. మిగతా రెండు చోట్ల రైల్వేకి స్థలం ఉన్నా, అభివృద్ధి చేయాలనే ఆలోచన కరవైంది.
ఎంఎంటీఎస్ రెండో దశ తిరిగేదెన్నడు?
ఎంఎంటీఎస్ రెండో దశ 95 కి.మీ. వ్యయం రూ.817 కోట్లు. ఈ ప్రాజెక్టును 2018 చివరి నాటికి కొంత.. 2019 నాటికి మొత్తం పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2014లో పనులు చేపట్టారు. 2022 వచ్చినా పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రెండు వాటాల నిధులు రూ.544 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.130 కోట్లు మాత్రమే ఇచ్చింది. తన వాటా కింద రైల్వే రూ.272 కోట్లు ఖర్చు చేసి 80 శాతం పనులు పూర్తి చేసింది. మొత్తం పూర్తి చేస్తే రాష్ట్రం నుంచి మిగతా నిధులు రావన్న ఉద్దేశంతో పనులు అంతటితో ఆపేసింది. రెండో దశ రాష్ట్ర ప్రభుత్వం స్పందనపై ఆధారపడి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.