logo

కేరింతలతో హోరెత్తె..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు క్రికెట్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి.

Published : 26 Apr 2024 02:33 IST

న్యూస్‌టుడే, ఉప్పల్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌కు క్రికెట్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. కోహ్లి బ్యాటింగ్‌ చేసే సమయంలో స్టేడియమంతా అరుపులతో మారుమోగింది. సుమారు 35 వేల మంది తరలివచ్చారు. రూ.2500 టికెట్‌ను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు బ్లాక్‌లో విక్రయించారు. వీరిని అడ్డుకోవడంతో యంత్రాంగం విఫలమైంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉప్పల్‌-హబ్సిగూడ, ఉప్పల్‌-రామంతాపూర్‌ మార్గాలలో ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు