నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది.
ఊపందుకున్న నాయకుల పర్యటనలు
బహిరంగ సభలతో జనంలోకి పార్టీలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. నాయకులంతా జనంలోకి వెళ్లడానికి రోడ్డెక్కుతున్నారు. దీంతో ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు భారాస, భాజపా పోటాపోటీగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. రాజధాని పరిధిలో సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్ లోక్సభ స్థానాలున్నాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొన్నటివరకు ఎక్కడా ఎన్నికల హంగామా కనిపించలేదు. కిందిస్థాయి నాయకుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. గురువారంతో నామినేషన్ల ఘట్టం పూర్తికావడం.. ప్రచారానికి 16 రోజులే ఉండటంతో అన్ని పార్టీలు ఒక్కసారిగా రంగంలోకి దూకాయి. ఒకవైపు అగ్రనేతలతో ప్రచారం చేయడంతో పాటు మరోవైపు స్థానిక నేతలతో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవడానికి సిద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ దూకుడు
మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే రాజధాని పరిధిలో కాంగ్రెస్ ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తోంది. ఈ నెల 6న తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మ్యానిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేశారు. సీఎం రేవంత్రెడ్డి సభలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మల్కాజిగిరి స్థానానికి సంబంధించి శామీర్పేటలో భారీ సభ నిర్వహించారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. గురువారం చేవెళ్లకు సంబంధించి అత్తాపూర్లోనూ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి అన్నానగర్ చౌరాస్తా వద్ద జరిగిన సభల్లో సీఎం భాజపా, భారాసలపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ పరిధిలో భారీ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 10లోగా మరో ఆరేడు సభలు నిర్వహించాలని నిర్ణయించారు. రాహుల్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనబోతున్నారు.
ఎమ్మెల్యేలే కీలకంగా..
ఇప్పటికే చేవెళ్లలో భారాస కొద్దిరోజుల కిందట భారీ బహిరంగ సభను నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో కీలక ప్రసంగం చేశారు. ఇప్పుడు ఆయన వచ్చే నెల పదో తేదీ వరకు జిల్లాల్లో జరుగుతున్న బస్సు యాత్రలో పాల్గొంటున్నారు. 11వ తేదీ తరువాత ఇక్కడ మరో భారీ సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ అన్ని లోక్సభ నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేశారు. రాజధానిలో నాలుగు స్థానాల ప్రచార బాధ్యతను ఆయన తలకెత్తుకున్నారు. నియోజకవర్గాల వారీగా కార్నర్ మీటింట్లు నిర్వహించడానికి కేటీఆర్ సిద్ధమవుతున్నారు. ఈలోపులో పార్టీపరంగా ప్రచార బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. వారం రోజుల కిందటి వరకు ఎమ్మెల్యేల్లో కదలిక కనిపించలేదు. పార్టీ ఆదేశాలతో రంగంలోకి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలందరితో కేటీఆర్ రోజువారీగా మాట్లాడుతున్నారు.
ఇంటింటి ప్రచారంపై దృష్టి
అన్ని పార్టీలకంటే ముందే భాజపా అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులు ఇప్పటికే మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. ఇంటింటి ప్రచారంపైనే ప్రధానంగా దృష్టిసారించారు. వివిధ సంఘాలతో సమావేశమై మరోసారి మోదీ ప్రధాని కావాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. గత నెలలో మల్కాజిగిరిలో మోదీ రోడ్డుషో నిర్వహించారు. ప్రచారం ముగిసేలోగా ఆయన రాజధాని పరిధిలో రెండు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ నెల 30న మోదీ హైదరాబాద్కు చేరుకుని శేరిలింగంపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం ప్రచారంలో పాల్గొంటారని భాజపా నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎంఐఎం హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి అసదుద్దీన్ ఇప్పటికే తన పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
[ 05-05-2024]
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
పజ్జన్న అంటే ప్రజల మనిషని తెలుసు
[ 05-05-2024]
జనంలో ఉండే నేతకే సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారని, అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడే తన గెలుపు ఖరారైందని భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
అన్నీ ఒకేచోట.. ఇబ్బంది లేదిక
[ 05-05-2024]
ఇంధనాలన్నీ ఒకే చోట ఉండేలా కొత్త బంకులు అందుబాటులోకి వస్తున్నాయి. నగరంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) వినియోగం పెరుగుతుండటంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను నెలకొల్పారు. -
ఒకటిన్నర ఎకరా మించితే.. టీడీఆర్ కష్టం
[ 05-05-2024]
అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేపట్టి టీడీఆర్ (అభివృద్ధి బదలాయింపు హక్కు) ఇచ్చే ప్రక్రియపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. -
అదనంగా 60శాతం ఈవీఎంలు
[ 05-05-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల సంఖ్య పెరగడంతో..ఎన్నికల అధికారులు 60శాతం ఈవీఎంలను అదనంగా తెప్పించారు. -
రాళ్లే బద్దలవుతుంటే.. రికార్డులెంత
[ 05-05-2024]
నగరంలో రోజురోజుకు భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
ఆంధ్రాలో ఓటుంది.. తపాలా ఓటును పంపండి
[ 05-05-2024]
నగరంలో ఎన్నికల విధులకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగంపై అయోమయంలో పడ్డారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్కు వరుస కట్టిన వినతులే అందుకు నిదర్శనం. -
ఆనాటి బరిలో ఇద్దరే
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు జరుగుతున్నపుడు పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 40మంది కంటే ఎక్కువగా బరిలో ఉంటున్నారు. కానీ 1957 ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కేవలం ఇద్దరు అభ్యర్థులే బరిలో నిలిచారు. -
మండుటెండల్లో.. ఠండా పానీ
[ 05-05-2024]
చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది. -
ముమ్మరంగా నేతల ప్రచారాలు
[ 05-05-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాల్లో విజయం సాధించి కేంద్రంలో కూడా అధికారం చేపడుతుందని టీపీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీగౌడ్, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. -
టక్కరి దొంగ
[ 05-05-2024]
అతను దొంగ.. సుమారు వందకుపైగా కేసుల్లో శిక్ష అనుభవించాడు.. మార్పు వచ్చినట్టు నటించాడు.. పోలీసులతోనే స్వయం ఉపాధి పొందాడు..నిజంగా మార్పు రాలేదు. -
ప్రజాశ్రేయస్సే అధికారులకు పరమావధి కావాలి
[ 05-05-2024]
సివిల్ సర్వీసెస్ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజాశ్రేయస్సు, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. -
దేశవ్యాప్తంగా మోదీ నామస్మరణే
[ 05-05-2024]
దేశంలోని అన్నివర్గాల ప్రజల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి విజయవంతంగా అమలుచేస్తోందని కేంద్ర మంత్రి, భాజపా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్రెడ్డి పేర్కొన్నారు. -
‘అల్లాహ్ మీద ఒట్టు.. జీవితంలో ఎవరిపై జులుం చేయలేదు’
[ 05-05-2024]
మతాల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ సర్కారును ఓడించేందుకు అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని మజ్లిస్ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. -
గెలుపు, ఓటమికి మధ్య నోటా దోబూచులాట!
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఓటర్లు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశం నోటా (నన్ ఆఫ్ ది ఎబౌవ్). -
పోటీ త్రిముఖం.. ప్రచారం బహుముఖం
[ 05-05-2024]
చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ఈసారి పేరుకే 43 మంది బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్, భాజపా, భారాసల మధ్యే ‘త్రిముఖ’ పోటీ నెలకొంది. -
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్
[ 05-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. -
కలిసికట్టుగా ‘కొండా’ను గెలిపిద్దాం: భాజపా
[ 05-05-2024]
ప్రతి ఒక్కరు ఐక్యతగా పనిచేసి ఎంపీ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి విజయానికి కృషిచేద్దామని ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు, భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్ అన్నారు. -
పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?
[ 05-05-2024]
పాలమూరుకు నరేంద్ర మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రాణం తీసిన.. ఫొటో సరదా..
[ 05-05-2024]
క్వారీ గుంతలో సరదాగా ఈత కొడుతూ ఫొటో దిగాలనే ప్రయత్నంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పో యాడు. ఈ ఘటన కీసర మండలం అంకిరెడ్డిపల్లి మహాలక్ష్మీ క్రషర్ క్వారీ గుంత వద్ద జరిగింది. -
ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు
[ 05-05-2024]
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులే కాదు.. అప్పుడప్పుడు పేర్లు కంగారు పెడుతుంటాయి. ఒకే పేరుతో ఇద్దరు పోటీ చేసేటప్పుడు మరింత ఎక్కువ ఆందోళన ఉంటుంది. -
శంషాబాద్లో చిక్కిన చిరుత అమ్రాబాద్కు తరలింపు
[ 05-05-2024]
శంషాబాద్ విమానాశ్రయంలో ట్రాప్ బోనులో చిక్కిన మగ చిరుతను శనివారం హైదరాబాద్ నెహ్రూ జూపార్కు అధికారులు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోకి వదలి పెట్టారు. -
క్రిశాంక్ కస్టడీకి కోర్టు అనుమతి
[ 05-05-2024]
భారాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్నె క్రిశాంక్ను ఒకరోజు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ శనివారం నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.