Crime News: ప్రియురాలిపై మోజుతో తల్లిని హతమార్చిన దత్తపుత్రుడు..
ప్రియురాలిపై మోజుతో తల్లిని దత్తపుత్రుడు దారుణంగా హత మార్చాడు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గమనించిన కారుడ్రైవర్ దత్తపుత్రుడిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి స్నేహితుడితో
ఆపై దత్తపుత్రుడిని నమ్మించి హతమార్చిన కారు డ్రైవర్
మహిళను చంపిన కేసులో ఐదుగురి అరెస్ట్
ఈనాడు, హైదరాబాద్-సరూర్నగర్ క్రైం, న్యూస్టుడే: ప్రియురాలిపై మోజుతో తల్లిని దత్తపుత్రుడు దారుణంగా హత మార్చాడు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గమనించిన కారుడ్రైవర్ దత్తపుత్రుడిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి స్నేహితుడితో మట్టుబెట్టించాడు. సంచలనం రేకెత్తించిన భూదేవి(50) అనే మహిళ హత్య కేసులో ఐదుగురు నిందితులు రంగారెడ్డి జిల్లాకు చెందిన కరినాగుల నర్సింహ(24), వి.శివ(23), మహబూబ్నగర్ జిల్లా వాసి ఏ.హర్ష అలియాస్ చింటూ(22), నల్గొండ, వనపర్తి జిల్లాలకు చెందిన బి.సాయిగౌడ్(22), ఏ.ఆంజనేయులు(21)లను శుక్రవారం సరూర్నగర్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. పెద్దఎత్తున డబ్బు చేతికి వస్తుందనే ఉద్దేశంతో పక్కా పథకం ప్రకారం రెండు హత్యలు చేసినట్లు సరూర్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవిబాబు తెలిపారు. నిందితుల నుంచి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.37లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మహిళ హత్య కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న సాయితేజ (26) హత్యతో కేసు మిస్టరీ వీడింది.
ప్రియురాలు దూరమవుతుందని.. న్యూ గడ్డిఅన్నారం కాలనీలో జంగయ్య యాదవ్, భూదేవి దంపతులు 1995లో మూడు రోజుల పసికందును దత్తత తీసుకుని సాయితేజ అని పేరు పెట్టారు. పసితనం నుంచే అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో వైద్యులకు చూపించి మందులు వాడారు. అదే ప్రాంతంలో ఉండే ఓ యువతి (23)తో సాయితేజ ప్రేమలో పడ్డాడు. ఆమెకోసం ఖరీదైన బహుమతులు కొనిచ్చాడు. ఇంట్లో నగలు, నగదు మాయమవుతుండటంతో కొడుకు నిర్వాకం తల్లిదండ్రులకు తెలిసింది. కొడుకును మందలించడంతోపాటు ఆ అమ్మాయిను హెచ్చరించి ఇల్లు ఖాళీ చేయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సాయితేజ తమ వద్ద కారుడ్రైవర్గా పనిచేసి మానేసిన కరినాగుల నర్సింహ అలియాస్ నానితో పంచుకున్నాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పథకం వేసిన నరిం్సహ ఇంట్లో నగలు కాజేసి ప్రియురాలిని పెళ్లిచేసుకొని దూరంగా వెళ్లిపోవచ్చంటూ సలహా ఇచ్చాడు.
సీసీ కెమెరాలకు దొరక్కుండా వ్యూహం.. ఈ నెల 2న సాయితేజ ఇంట్లో డబ్బు ఉందనే విషయం తెలియగానే నర్సింహ తన స్నేహితులు వట్టికోటి శివ, అడ్డాకుల హర్ష, బోయినపల్లి సాయిగౌడ్, అర్కటం ఆంజనేయులుకు సమాచారమిచ్చాడు. డబ్బు కొట్టేసి వాటాలు పంచుకుందామని అశచూపాడు. ఈ నెల 6న అర్ధరాత్రి(7వతేదీ) దాటాక అందరూ న్యూ గడ్డి అన్నారం చేరుకున్నారు. నర్సింహ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల వైర్లను కత్తిరించాడు. ఇంట్లోకి ప్రవేశించి బీరువా పక్కనే నిద్రపోతున్న భూదేవి ముఖంపై దిండు ఉంచి సాయితేజ, శివ ఊపిరాడకుండా చేశారు. సాయిగౌడ్, హర్ష కాళ్లను పట్టుకున్నారు. భూదేవి మరణించినట్టు నిర్ధారించుకున్నాక సొత్తును వాటాలేసుకొని పంచుకున్నారు.
ఎదురు చూస్తోందంటూ నమ్మించి.. హత్య విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు సాయితేజను అడ్డుతొలగించుకోవాలని మిగిలిన నిందితులు భావించారు. దీనిలో భాగంగానే అతడి ప్రేయసి శ్రీశైలంలో ఎదురుచూస్తుందంటూ అతడ్ని నమ్మించిన శివ 7వ తేదీ మధ్యాహ్నం శ్రీశైలం తీసుకెళ్లి సత్రంలో బసచేశారు. మరుసటిరోజు శిరోముండనం చేయించి ఆలయంలో పూజలు చేయించారు. 9న రాత్రి వట్టెవారిపల్లెలో ఉన్నారు. ఏ2 నిందితుడు శివ 10వ తేదీ ఉదయం మల్లెతీర్థం ప్రాంతానికి సాయితేజను తీసుకెళ్లాడు. ఇద్దరూ కలసి మద్యం తాగారు. అనంతరం సాయితేజ తలపై శివ బండరాయితో దాడిచేసి చంపి లుంగీకి రాయి చుట్టి మృతదేహాన్ని నీటిలోకి నెట్టేశాడు. భూదేవి హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న విషయం తెలిసిన శివ ఆందోళనకు గురయ్యాడు. సరూర్నగర్ ఠాణాలో లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ ఏసీపీ పి.శ్రీధర్రెడ్డి, సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, డీఐ రవిబాబు బృందాన్ని సీపీ, డీసీపీలు అభినందించారు.
నా కుమారుడు అమాయకుడు..
హత్యకు గురైన సాయితేజ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతదేహం నగరానికి తీసుకొచ్చేందుకు అనుకూలంగా లేకపోవటంతో అచ్చంపేటలోనే స్థానిక మున్సిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు జరిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ హంతకుడు అని తెలిసినా తండ్రి జంగయ్యయాదవ్ మాత్రం తన కుమారుడు అమాయకుడు అంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
[ 03-05-2024]
శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
[ 03-05-2024]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. -
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
[ 03-05-2024]
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. -
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. -
శ్రీచైతన్య విద్యార్థులకు అభినందన సభ
[ 03-05-2024]
పదో తరగతి ఫలితాల్లో కొత్తపేట శ్రీచైతన్య విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. -
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
[ 03-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. గతేడాది తాండూరులో ఏప్రిల్ మొత్తంగా ఆరు రోజులు మాత్రమే 40 నుంచి 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఓయో హోటల్లో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
చైతన్యపురి మోహన్నగర్ వద్ద ఓయో హోటల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. -
పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు
[ 03-05-2024]
మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. -
ఫేస్బుక్లో పరిచయం చేసుకొని.. పిస్తోల్ తెప్పించుకొని!
[ 03-05-2024]
ఫేస్బుక్ పరిచయం అతన్ని పిస్తోల్ తీసుకొచ్చేలా చేసింది. అక్రమంగా ఆయుధాలను విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న అతడు బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులకు చిక్కాడు. -
ప్రతి గడప ఎక్కాలి.. గెలుపు మాటే వినిపించాలి
[ 03-05-2024]
ప్రధాన పార్టీల నేతలు, అధినేతల ఆదేశాలతో నియోజకవర్గ స్థాయి నాయకులు ఒత్తిడిలో ఉన్నారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
[ 03-05-2024]
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
కమల దళం.. అధినేతల కదనోత్సాహం
[ 03-05-2024]
నగరంలో భాజపాకు మంచి పట్టుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకుని సత్తాచాటిన భాజపా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి.. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది. -
నేటి నుంచి తపాలా ఓటింగ్
[ 03-05-2024]
ఈనెల 13న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో సరిగ్గా 10 రోజుల ముందు తపాలా ఓటు, ఇంటివద్ద ఓటు ప్రక్రియలు మొదలు కాబోతున్నాయి. -
యువత ఓటెత్తాలి
[ 03-05-2024]
నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా..?
[ 03-05-2024]
ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు కనీస ప్రభావం చూపలేక పోతున్నారు. అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కొందరికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రావడం లేదు. -
అత్యధిక ఓటింగ్ నమోదైంది అప్పుడే!
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటివరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది 1991లోనే. -
‘కాంగ్రెస్ వైపే బలహీన వర్గాలు’
[ 03-05-2024]
దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్ జి.చెన్నయ్య పేర్కొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న బడేభాయ్, చోటాభాయ్: కేటీఆర్
[ 03-05-2024]
అమలు కాని హామీలతో బడే భాయ్ మోదీ, చోటాభాయ్ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు విమర్శించారు. -
చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా
[ 03-05-2024]
చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓటర్లు భిన్నం.. ఓటింగ్ విభిన్నం
[ 03-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనది. కొన్ని సందర్భాల్లో ఒక్క ఓటు కూడా కీలకంగా మారుతుంది. -
ఉత్కంఠ పోరులో ఆధిక్యాలు స్వల్పమే
[ 03-05-2024]
రాజధాని పరిధిలో ఇప్పటి వరకు జరిగిన ఎంపీ ఎన్నికల్లో అత్యల్ప మెజార్టీ నమోదైంది హైదరాబాద్లోనే. -
పేద విద్యార్థులకు సహకారం ప్రశంసనీయం
[ 03-05-2024]
చారిత్రక నేపథ్యం కలిగిన రాజ్బహదూర్ వెంకట్రామ్రెడ్డి వసతి గృహ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి అన్నారు. -
అంధులు.. చదరంగంలో ఎత్తులు
[ 03-05-2024]
దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్ ఆధ్వర్యంలో బేగంపేట లోని దేవనార్ పాఠశాలలో ఫిడే రేటింగ్ జాతీయ ఓపెన్ చదరంగం పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. -
‘బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు భాజపా కుట్ర’
[ 03-05-2024]
బీసీ రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కుట్రజేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
కాంగ్రెస్లో చేరిన గ్రేటర్ హైదర్బాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల
[ 03-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ భారాస మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్యాదవ్ గురువారం సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. -
ఇంటినుంచే ఓటు..ఇక్కట్లకు లేదు చోటు
[ 03-05-2024]
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. గతంలో పోలింగ్ కేంద్రానికి రాలేని స్థితిలో ఉన్న వారు ఓటు వేసేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చేది. -
కాంగ్రెస్తోనే ముదిరాజ్లకు గుర్తింపు: రంజిత్రెడ్డి
[ 03-05-2024]
కాంగ్రెస్ పార్టీతోనే ముదిరాజ్లకు సరైన గుర్తింపు లభిస్తుందని చేవెళ్ల లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి తెలిపారు. -
ఎంఎన్జేలో రొమ్ము పునర్ నిర్మాణ శస్త్రచికిత్సలు విజయవంతం
[ 03-05-2024]
మారిన జీవన విధానం, అహారపు అలవాట్ల కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. -
హెచ్ఎండీఏలో మరో అవినీతి తిమింగలం!
[ 03-05-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)లో మరో కీలకాధికారి చుట్టూ అవినీతి నిరోధక శాఖ ఉచ్చు బిగుస్తోంది. -
వైద్య పరీక్షలకు గర్భవిచ్ఛిత్తి చేసుకున్న బాలిక
[ 03-05-2024]
పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీ కొని గుర్తు తెలియని 28 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో బుధవారం అర్ధరాత్రి తరువాత జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా