బంధాలను బలి పెడుతున్నారు
జీవితాంతం తోడుంటానని, కంటికి రెప్పలా కాపాడతానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు ఆవిరైపోతున్నాయి. వివాహేతర సంబంధం.. తన మాట వినడం లేదన్న అక్కసు.. ఆర్థిక సమస్యలు.. మద్యం మత్తు.. క్షణికావేశం.. కారణమేదైనా భార్యలు బలవుతున్నారు.
క్షణికావేశంలో భార్యలను హతమార్చుతున్న భర్తలు
చిన్న గొడవలకే కూలుతున్నకాపురాలు
ఈనాడు, హైదరాబాద్: జీవితాంతం తోడుంటానని, కంటికి రెప్పలా కాపాడతానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలు ఆవిరైపోతున్నాయి. వివాహేతర సంబంధం.. తన మాట వినడం లేదన్న అక్కసు.. ఆర్థిక సమస్యలు.. మద్యం మత్తు.. క్షణికావేశం.. కారణమేదైనా భార్యలు బలవుతున్నారు. నగరంలో ఇరవై రోజుల్లో ఐదుగురు వివాహితల్ని కట్టుకున్నోళ్లే దారుణంగా మట్టుబెట్టారు. అడ్డుకోబోయిన పిల్లలనూ హతమార్చేందుకు యత్నించారు. భావోద్వేగాల్ని నియంత్రించుకోలేని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2022లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధి పాతబస్తీలో 21 హత్యలు జరిగాయి. వాటిలో 19 హత్యలకు వివాహేతర సంబంధాలే కారణమని పోలీసులు తేల్చారు.
అనుమానాలు.. సూటిపోటి మాటలు..
ఫోన్ చేసినప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చిందని, భార్య మాట వినడం లేదనే చిన్నపాటి కారణాలను చూపిస్తూ కొందరు భర్తలు మృగాల్లా మారుతున్నారు. ఇతరుల చెప్పుడు మాటలతోనో.. ఊహించుకునో లేనిపోని అనుమానాలు పెంచుకుని సూటిపోటి మాటలతో వేధిస్తూ దారుణంగా హింసిస్తున్నారు. భార్యపై అనుమానాలతో తీవ్ర ఒత్తిడికి గురవుతూ పరువు పోతుందనే ఉద్దేశంతో ఈ దారుణాలకు తెగబడుతున్నారు. కనీసం పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించలేని దుస్థితికి చేరుకుంటున్నారు. ఇటీవల అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఒక కిరాతకుడు భార్యను బీరు సీసాతో పొడిచి చంపాడు. నెలల వయసున్న కుమారుడిని నీళ్ల ట్యాంకులో విసిరేశాడు. చిన్న కుమార్తెను చంపేందుకు వెంటపడగా త్రుటిలో తప్పించుకుంది. భార్యతో జరిగిన చిన్న గొడవే కారణమని నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు.
ఇరవై రోజుల్లో 5 హత్యలు
* మే 12న వనస్థలిపురంలో కానిస్టేబుల్ రాజ్కుమార్ తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. అతని వివాహేతర సంబంధం కుటుంబంలో చిచ్చుపెట్టింది. విడాకులు ఇవ్వనందుకు భార్యను హత్య చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడ్ని హతమార్చేందుకు ప్రయత్నించాడు.
* మే 15న కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఫోరంమాల్ ఫ్లైఓవర్ కింద సాదిక్ తన భార్యను రాళ్లతో కొట్టి చంపాడు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరగటంతో ఈ హత్యకు పాల్పడ్డాడు.
* మే 16న ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో భార్యాభర్తల మృతి కలకలం రేపింది. ఎల్లారెడ్డిగూడలో మద్యం మత్తులో భార్యను ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన భర్త జనార్దన్ ఫ్యానుకు ఉరివేసుకున్నాడు.
* మే 16న రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన యాదయ్య తన భార్య కవితకు కరెంట్ షాక్ ఇచ్చి ప్రాణాలు తీశాడు. ఆమె విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు పోలీసుల్ని నమ్మించాడు. కవిత ఒంటిపై గాయాలుండడంతో అనుమానించిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా హత్య విషయం తేలింది.
* మే 20న శంకర్పల్లి మండలం జన్వాడలో ఆర్ఎంపీ డాక్టర్ నాగరాజు భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో ఇది జరిగింది.
ఇద్దరూ మాట్లాడుకుంటే పరిష్కారమే
- డాక్టర్ ఎం.రాంచందర్, సైకాలజిస్టు
భార్యపై లేనిపోని అపోహలతో అనుమానం పెంచుకోవడం.. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోకపోవడమే విపరిణామాలకు దారి తీస్తోంది. ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఏ సమస్య ఉన్నా ఇద్దరూ మనసువిప్పి మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుపోతాయి.
2022లో మూడు కమిషనరేట్లలో కేసులు
కారణం హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్
వరకట్న మరణాలు/ఆత్మహత్య 12 21 15
ఆత్మహత్యకు ప్రేరేపించడం 25 4 53
వేధింపులు/గృహహింస 1,418 1,704 1,096
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?