ప్రధానికి ఉత్తరం రాసేందుకు పది వేల కార్డులు
ప్రస్తుతం చరవాణి ప్రపంచంలో పోస్టుకార్డులు రాసే వారు కనుమరుగయ్యారు. అందుకే విద్యార్థుల్లో ఉత్తరాలు రాసే విధానాన్ని అలవర్చేందుకు తపాలాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు
ఉత్తమ ఎంట్రీలకు బహుమతులు
వేములవాడ తపాలా కార్యాలయానికి వచ్చిన పోస్టు కార్డులు
వేములవాడ గ్రామీణం, న్యూస్టుడే: ప్రస్తుతం చరవాణి ప్రపంచంలో పోస్టుకార్డులు రాసే వారు కనుమరుగయ్యారు. అందుకే విద్యార్థుల్లో ఉత్తరాలు రాసే విధానాన్ని అలవర్చేందుకు తపాలాశాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవాలను వేదికగా చేసుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని తపాలాశాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. పాఠశాలల్లో ఆసక్తి ఉన్న నాలుగు నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ముద్రించిన పోస్టు కార్డులను పంపిణీ చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు పది వేల పోస్టు కార్డులను కేటాయించారు. వీటిని పాఠశాలల్లో పంపిణీ చేయనున్నారు. ఈ కార్డులపై వ్యాసం రాసి పంపించాలని పేర్కొంది. గెలిచిన విద్యార్థులకు బహుమతులతో పాటు నేరుగా ప్రధానిని కలిసి మాట్లాడే అవకాశాన్ని కల్పించనున్నది. ఎంట్రీలకు ఈ నెల 20 చివరి తేదీ అని, రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనైనా కార్డుపై వ్యాసం రాసి పంపించవచ్చని తపాలాశాఖ పేర్కొంది. ప్రతి పాఠశాలలో 10 మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యే విధంగా చర్యలు చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధులు, 2047 నాటికి దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అనే అంశాలపై క్లుప్తంగా వ్యాసం రాయాల్సి ఉంటుంది. రాసిన ఉత్తరాలను పాఠశాల ఉపాధ్యాయులు సేకరించి పంపుతారు. వాటిలో ఉత్తమమైన ఎంట్రీలను ఎంపిక చేసి 2022 జనవరి 17న ప్రధానితో ముఖాముఖి అవకాశం కల్పించనున్నట్లు తపాశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాకు పది వేల కార్డులు వచ్చాయని, కార్డులు రాసేందుకు పాఠశాలకు పది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తే ఎక్కువ కార్డులు ఇస్తామని జిల్లా తపాలాశాఖ అధికారి దయానంద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేళ నగదు కష్టాలు
[ 27-04-2024]
ఎన్నికల కోడ్ అమలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇరకాటంలో పడేస్తోంది. చేతిలో రూ.50 వేలకు పైగా నగదును పట్టుకొని బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. -
నారీమణులే నిర్ణేతలు
[ 27-04-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో మహిళా ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారారు. మొత్తం ఓటర్లలో పురుషుల కంటే అతివల సంఖ్యే అధికంగా ఉంది. -
ఇంటి నంబర్ల గోల్మాల్!
[ 27-04-2024]
కరీంనగర్ శివారు ప్రాంతాల్లో భూఆక్రమణలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో ఒక్కొక్కటిగా అక్రమాలు బయటకు వస్తున్నాయి. -
భానుడి భగభగ...
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఎండతీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన పది గరిష్ఠ ఉష్ణోగ్రత ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలోనివే ఆరు ప్రదేశాలుండటం భానుడి ప్రతాపాన్ని వెల్లడిస్తోంది. -
ప్రాణం తీసిన ఈత సరదా
[ 27-04-2024]
ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తండ్రి కళ్లెదుటే నీటి మునిగి మృతి చెందిన సంఘటన బోయినపల్లి మండలం తడగొండలో శుక్రవారం చోటు చేసుకుంది. -
పశుపక్షాదుల దాహం తీర్చేలా..
[ 27-04-2024]
వేసవిలో ఎండల తీవ్రతకు మనుషులే దప్పికతో అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై సంచరించే పశువులు, పక్షులకు తాగునీరు అందక అల్లాడి ప్రాణాలు పోయే ప్రమాదం నెలకొనకుండా ఉండేందుకు కోరుట్ల పట్టణంలో పుర కమిషనర్ బట్టు తిరుపతి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఆదాయం ఘనం.. వసతులు శూన్యం
[ 27-04-2024]
ఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా.. మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సౌకర్యాలు లేక అన్నదాతలకు అవస్థలు తప్పడంలేదు. -
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
[ 27-04-2024]
అక్రమాలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం అమలు చేసేందుకు రామగుండం పోలీసు కమిషనరేట్లో జాబితా సిద్ధమవుతోంది. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
అడవిని మింగేస్తున్న అనకొండలు
[ 27-04-2024]
దట్టమైన అటవీ ప్రాంతం, అల్లుకున్న పచ్చదనం, ఇదంతా ఒకప్పటి ముచ్చట. పచ్చని చెట్లను యంత్రాలతో నేల కూలుస్తున్నారు. ఇప్పుడంతా మైదానంలా మారింది. ఆ ప్రాంతంలో ఎటు చూసినా నరికివేసిన చెట్ల మొదళ్లు కనిపిస్తున్నాయి. -
కబ్జాల పర్వం!
[ 27-04-2024]
అక్రమార్కుల కన్ను మున్సిపల్ లేఅవుట్ స్థలాలపై పడింది. అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగా ఉండటంతో స్థలాలు కబ్జా చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి నాంపల్లిలోని మున్సిపల్ లేఅవుట్ స్థలం నలుగురి పేర రిజిస్ట్రేషన్ కావడమే ఇందుకు నిదర్శనం. -
మద్యం, నగదు అక్రమ రవాణా నివారణకే తనిఖీలు
[ 27-04-2024]
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో అక్రమంగా మద్యం, నగదు, ప్రలోభ పరిచే వస్తువులు, మాదక ద్రవ్యాలను నిరోధించేందుకే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ సదుపాయం.. వినియోగానికి దూరం
[ 27-04-2024]
ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే నామపత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. -
హరిత లక్ష్యం.. కార్యాచరణ సిద్ధం
[ 27-04-2024]
పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు జిల్లాలో గత ఎనిమిది సంవత్సరాలుగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకు గ్రామాల్లోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?