logo

నేత కార్మికుడి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం సిరిసిల్లలో చోటు చేసుకుంది. సిరిసిల్ల సీఐ అనిల్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌కు చెందిన

Published : 09 Dec 2021 05:24 IST

సిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో నేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం సిరిసిల్లలో చోటు చేసుకుంది. సిరిసిల్ల సీఐ అనిల్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... సిరిసిల్లలోని సుందరయ్యనగర్‌కు చెందిన నేత కార్మికుడు జక్కని రవి(48) మధ్యాహ్నం తన లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పుల బాధతోపాటు ఇద్దరు కుమార్తెలకు ఎలా వివాహం చేయాలనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భార్య మల్లీశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని