ప్రభుత్వ నిర్ణయం.. పేద విద్యార్థులకు వరం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా బోధన చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడంలేదు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంలేకనో? మెరుగైన విద్య అందడంలేదనే కారణమో తెలియదుకాని పేద వర్గాల
సుల్తానాబాద్ మండలం అరెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధన
పెద్దపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటుకు ధీటుగా బోధన చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడంలేదు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంలేకనో? మెరుగైన విద్య అందడంలేదనే కారణమో తెలియదుకాని పేద వర్గాల ప్రజలకు సైతం తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపిస్తున్నారు. మౌలిక వసతులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నా..పట్టణాల్లోని ప్రైవేటులో చదివించేందుకు మొగ్గుచూపుతున్నారు. కాగా సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఇకనుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది.
ఆంగ్ల మాధ్యమంలోనే అత్యధికం
జిల్లాలో 724 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 288 తెలుగు మాధ్యమంలో బోధన చేస్తుండగా 436 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది. 288 తెలుగు మాధ్యమం పాఠశాలల్లో 5449 మంది, 436 ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్లో 35,133 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రాథమికంలో ఆంగ్ల మాధ్యమం లేక చిన్నారులను పంపించడంలేదు. దీంతో ఉపాధ్యాయులు చొరవ తీసుకొని ఆంగ్లంలోనే బోధన చేస్తున్నారు. విద్యాశాఖ అనుమతి లేకుండానే ఆంగ్లంలో అనధికార తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు సొంత ఖర్చులతో పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఉన్నత పాఠశాలల్లో మాత్రం ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది.
అభివృద్ధి ప్రణాళిక ఇలా
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచేందుకు మన ఊరు-మన బడి ప్రణాళిక రూపొందిస్తున్నారు. మూడు దశల్లో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. తొలి విడతలో విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలకు అవకాశం లభించనుంది.
* గత ఏడాది జిల్లాలోని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై నివేదిక రూపొందించారు. శిథిలావస్థలో 456 గదులు, 646 గదులకు మరమ్మతులు, 709 మూత్రశాలలు(బాలికలు), 718(బాలుర) ప్రతిపాదించారు. 3050 ఫ్యాన్లు, 15,035 డ్యూయల్ బెంచీలు, 55,753 మీటర్ల ప్రహరీ అవసరం ఉందని గుర్తించారు.
* పాఠశాలల్లోని శౌచాలయాలకు నీటివసతి, విద్యుదీకరణ, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నీచర్, గదుల మరమ్మతు, భవనాలకు రంగులు వేయనున్నారు. శిథిలమైన గదుల స్థానంలో కొత్తగా నిర్మించనున్నారు.
* ప్రహరీ, వంట గదుల నిర్మాణానికి ప్రతిపాదిస్తారు. మండలం యూనిట్గా తీసుకొని అభివృద్ధి చేస్తారు. క్షేత్ర స్థాయిలో గుర్తించిన పనులకు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతి ఇవ్వనున్నారు.
అమలైతేనే మెరుగైన విద్య
సర్కారు బడులను అభివద్ధి చేసే ప్రణాళిక అమలుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రైవేటులో ఫీజుల మోత భరించడం కష్టంగా ఉందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో విద్య అందించాలని సంకల్పించారు. గతంలో సక్సెస్ పాఠశాలల పేరిట ఆంగ్ల మాధ్యమంలో విద్య ప్రారంభించారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రి అందించారు. నిర్వహణ భారంతో కంప్యూటర్లు కనుమరుగయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేస్తేనే విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
నిబంధనలు అమలు చేస్తాం
- మాధవి, జిల్లా విద్యాధికారి
జిల్లాలో చాలా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నాం. మన ఊరు-మన బడి ప్రణాళికతో మౌలిక వసతుల కొరత తీరనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య