రూ.6 కోట్లతో కూడళ్ల సుందరీకరణ
నగరంలోని ఆరు చౌరస్తాలను రూ.6 కోట్లతో సుందరీకరించనున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో చేపట్టే పనులపై పరిశీలించారు. చౌరస్తాను సందర్శించిన ఆయన
ఖని చౌరస్తా వద్ద పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చందర్
గోదావరిఖని, న్యూస్టుడే : నగరంలోని ఆరు చౌరస్తాలను రూ.6 కోట్లతో సుందరీకరించనున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో చేపట్టే పనులపై పరిశీలించారు. చౌరస్తాను సందర్శించిన ఆయన నగరంలోని చౌరస్తాతో పాటు తిలక్నగర్, రమేశ్నగర్, ఫైవింక్లైన్చౌరస్తా, రాజేశ్ థియేటర్, ఎఫ్సీఐ అడ్డరోడ్డు ప్రధాన కూడళ్లను సందరంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. నగర మేయర్ అనిల్కుమార్తో పాటు కమిషనర్ సుమన్కుమార్లతో కలిసి కూడళ్లను పరిశీలించారు. ఇప్పటికే రూ.200 కోట్లతో నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. జూన్ 2 నాటికి నగరంలోని అన్ని చౌరస్తాలను అందంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ అభిషేక్రావు, కార్పొరేటర్లు భాస్కర్, శంకర్నాయక్, శంకర్, నాయకులు జె.వి.రాజు, జలపతి, నగరపాలక ఇంజినీర్ జమీల్, షాబాజ్, అర్కిటెక్ట్ గులామ్ ఉన్నారు.
గోదావరిఖని : ముస్లింలకు సంబంధించిన ఈద్గా, కబ్రాస్థాన్లకు సంబంధించిన స్థల పరిరక్షణకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడించారు. శనివారం స్థానిక ఫోరింక్లైన్ వద్ద ఉన్న ఈద్గా, కబ్రాస్థాన్ స్థలాన్ని జీఎం నారాయణతో కలిసి పరిశీలించారు. ఓసీపీ-5లో ఈద్గా, కబ్రాస్థాన్ స్థలం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఏ ఒక్క సమాధిని కూడా తొలగించకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ముస్లింలకు కేటాయించిన 11.25 ఎకరాల భూమికి బదులు మరోచోట కేటాయించేలా సింగరేణి ఛైర్మన్, సంచాలకులతో మాట్లాడుతానన్నారు. ముస్లిం మత పెద్దలు షర్ఫోద్దీన్, ఫసియోద్దీన్, అక్రమ్, సత్తార్ఖాన్, సిరాజ్, హమీద్, సర్వర్, సింగరేణి ఎస్టేట్ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం, కార్పొరేటర్ గట్టయ్య ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్