logo

ముగ్గురి హత్య కేసులో మరో 13 మంది అరెస్టు

మంత్రాల నెపంతో జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు, అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ హత్య కేసులో గురువారం మరో 13 మందిని అరెస్ట్‌ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రత్నపురం ప్రకాశ్‌ తెలిపారు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Published : 28 Jan 2022 03:33 IST

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రాల నెపంతో జగిత్యాల పట్టణంలోని టీఆర్‌నగర్‌కు చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు, అతని కుమారులు రాంబాబు, రమేశ్‌ హత్య కేసులో గురువారం మరో 13 మందిని అరెస్ట్‌ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రత్నపురం ప్రకాశ్‌ తెలిపారు. ఇప్పటికే 16 మందిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అరెస్ట్‌ చేసిన వారితో మొత్తం 29 మందిని నిందితులుగా చేర్చారు. అరెస్టయిన వారిలో వనం గంగయ్య, దాసరి కుమార్‌, వనం అశోక్‌, బల్లాని రాజయ్య, బల్లాని గంగాధర్‌, కండెల శ్రీకాంత్‌, వనం అంజయ్య, బల్లాని రాంబాబు, వనం రాములు, వనం పెద్ద దుర్గయ్య, వనం రాజేశ్‌, వనం నాగయ్య, వనం రవి ఉన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని