నిలిపేచోటు లేక.. జరిమానా చెల్లించక తప్పక..
ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ పట్టణంలో వాహనదారులు పార్కింగ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేములవాడ పట్టణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం
పార్కింగ్ కోసం వాహనదారుల పాట్లు
న్యూస్టుడే, వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ పట్టణంలో వాహనదారులు పార్కింగ్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వేములవాడ పట్టణం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో పాటు వాణిజ్య వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. దీంతో నిత్యం భక్తులు, ప్రజలతో రద్దీగా ఉంటుంది. చాలా వరకు ఇక్కడి రహదారులన్నీ ఇరుకుగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుంది. మరోవైపు పార్కింగ్ ప్రాంతాలు లేక రోడ్లపై వాహనాలు పెట్టడంతో పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్ స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ వివిధ పనులు కోసం వచ్చే ప్రజలకు, భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులు వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్రదేశాలు లేవు. ఆయా ప్రాంతాల్లో చాలా వరకు వాహనాలు రోడ్లపైనే నిలిపి భక్తులు దర్శనానికి వెళుతుండగా, ప్రజలు వివిధ వ్యాపారాలు, పనులపై వెళుతుంటారు. దీంతో రోడ్లపై నిలిపిన వాహనాలతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. రోజూ వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. ఆలయంలో జరిగే వివిధ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున వచ్చే భక్తులు, ప్రజలు, వాహనాలతో రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు. ప్రజలు నడిచి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి రహదారులపై వాహనాలు నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఏ కూడలి ప్రాంతంలోనూ పార్కింగ్ స్థలాలు లేవు. ఇక్కడికి చాలా వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే అధికంగా ఉంటారు. పార్కింగ్ ప్రాంతాలు లేక ఏదో ఒకచోట వాహనాన్ని నిలిపి వేస్తుంటారు. ఇంతలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఫొటోలు తీసి జరిమానాలు విధించడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం: శ్యామ్సుందర్రావు, మున్సిపల్ కమిషనర్, వేములవాడ
పట్టణంలోని ఆలయ పరిసరాల్లో మున్సిపల్కు సంబంధించిన స్థలాలు లేవు. ఆలయానికి సంబంధించిన స్థలాలున్నాయి. ఆలయ అధికారులతో చర్చించి పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
ఇష్టారాజ్యంగా నిలపడంతో..
పట్టణంలో వాహనాల పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా మున్సిపల్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా ఆలయ పరిసరాల్లో వాహనాలకు నిర్దేశిత స్థలాలను గుర్తించి పార్కింగ్కు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఎక్కడా వీటిని ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఆలయ పరిసర రోడ్లలోని దుకాణాల ముందు, రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. దీంతో భక్తులు, ప్రజల రాకపోకలకు సమస్యగా మారింది. ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్ స్థలం ఉన్నప్పటికీ వారు కూడ రోడ్లపైకి వచ్చి ఇష్టారాజ్యంగా నిలపడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఆలయ పరిసరాల్లోనూ స్థలాలు లేకపోవడంతో ఆలయం పడమర ప్రధాన ద్వారం వద్ద ద్విచక్ర వాహనాలను మెట్లకు అడ్డుగా పెడుతున్నారు. మరోవైపు కొబ్బరి కాయల దుకాణాలు, ఇతర తోపుడు బండ్లు రోడ్లపై పెట్టడంతో భక్తులు మెట్ల నుంచి పైకి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలయం ప్రధాన ద్వారం తూర్పు వైపు వెళ్లే రోడ్డు ముందే ఇరుకుగా ఉంటుంది. ఇందులో వాహనాలు, ఇతర తోపుడు బండ్లతో రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని భక్తులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వాహనాల పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని భక్తులు, ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?