సింగరేణి సహకారం.. యువత ఉత్సాహం
పోలీసు అభ్యర్థులకు సింగరేణి సహకారం అందిస్తుంది. గోదావరిఖని సింగరేణి క్రీడా మైదానంలో సాధన చేస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు పౌష్టికాహారం అందజేస్తోంది.
దేహ దారుఢ్య పరీక్షలకు సిద్ధమవుతున్న పోలీసు అభ్యర్థులు
న్యూస్టుడే, గోదావరిఖని
షార్టుఫుట్ సాధనలో యువకుడు
పోలీసు అభ్యర్థులకు సింగరేణి సహకారం అందిస్తుంది. గోదావరిఖని సింగరేణి క్రీడా మైదానంలో సాధన చేస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు పౌష్టికాహారం అందజేస్తోంది. 292 మంది అభ్యర్థులను శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధం చేస్తోంది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారు శారీరక సామర్థ్య పరీక్షల్లో ఎంపికైతేనే ప్రధాన పరీక్షకు అవకాశం ఉంటుంది. దీంతో తీవ్రంగా కసరత్తు చేస్తున్న యువతకు సింగరేణి ప్రోత్సహిస్తోంది. ఆర్జీ-1 సేవా సమితి ఆధ్వర్యంలో శారీరక సామర్థ్య పరీక్షలకు తగిన శిక్షణ ఇచ్చేందుకు పలువురు అభ్యర్థులను ఎంపిక చేసింది.
రోజుకు రూ.5 వేల ఖర్చు
శిక్షణకు 182 మంది యువకులు, 110 మంది యువతులు హాజరవుతున్నారు. వీరికి అందించే పౌష్టికాహారం కోసం రోజుకు రూ.5,000 వరకు వెచ్చిస్తున్నారు. ఒక్కో అభ్యర్థికి రెండు గుడ్లు, రెండు అరటి పండ్లతో పాటు పాలు ఉచితంగా అందిస్తున్నారు. సేవా సమితి ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించిన సింగరేణి.. కార్మికులు, విశ్రాంత కార్మికుల పిల్లలు, పరిసర, ప్రభావిత గ్రామాల యువతీ యువకులను శిక్షణకు ప్రాథమిక పరీక్ష ద్వారా ఎంపిక చేసి సాధన చేయిస్తోంది. ఉదయం మూడు గంటల పాటు పరుగు, వ్యాయామం, యోగాతో పాటు షార్టుఫుట్, లాంగ్జంప్ ఈవెంట్లలో శిక్షణ ఇస్తోంది. అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లో ఎంపికయ్యేందుకు ప్రత్యేకంగా నలుగురు శిక్షకులు యువతీ యువకులతో నిత్యం సాధన చేయిస్తున్నారు.
పరుగు తీస్తున్న యువతులు
పట్టుదలతో సాధన చేస్తున్నా
- రాహుల్, గోదావరిఖని
పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో సాధన చేస్తున్నా. రోజు మూడు గంటలు శ్రమిస్తున్నాను. సింగరేణి పూర్తిస్థాయిలో సహకరిస్తోంది. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అర్హత సాధించాను. శారీరక సామర్థ్య పరీక్షలకు అవసరమైన అన్ని విభాగాల్లో సాధన చేస్తున్నాం. పూర్తిస్థాయి కసరత్తులో భాగంగా శిక్షకులు ప్రతీ అంశంపై అవగాహన కలిగిస్తున్నారు. ఉద్యోగ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉత్తేజం నింపుతుండగా తప్పకుండా పోలీసు కొలువు సాధిస్తానన్న నమ్మకం ఏర్పడింది.
ఖర్చుకు వెనుకాడకుండా శిక్షణ
- కల్వల నారాయణ, సింగరేణి జీఎం
ఖర్చుకు వెనుకాడకుండా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. ప్రత్యేకంగా సింగరేణి నుంచి అనుభవజ్ఞులైన ఇద్దరు శిక్షకులను ఏర్పాటు చేశాం. గతంలోనూ వీరు పోలీసు ఉద్యోగ నియామకాల సమయంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ సమయంలో అభ్యర్థులు కోల్పోయిన శక్తిని తిరిగి పొందేలా పాలు, గుడ్లు, అరటిపండ్లను ఉచితంగా అందజేస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు