వచ్చే నెలలో రైతుబంధు
ప్రస్తుత యాసంగి సీజనుకుగాను రైతులకు పెట్టుబడిగా ఇచ్చే రైతుబంధు సాయాన్ని డిసెంబరులో పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎస్.నిరంజన్రెడ్డి ప్రకటించడంపట్ల జిల్లాలోని అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు
ప్రస్తుత యాసంగి సీజనుకుగాను రైతులకు పెట్టుబడిగా ఇచ్చే రైతుబంధు సాయాన్ని డిసెంబరులో పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎస్.నిరంజన్రెడ్డి ప్రకటించడంపట్ల జిల్లాలోని అన్నదాతలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో నిరుడు యాసంగిలో 2.10 లక్షల మంది రైతులకు రూ.207.19 కోట్ల నిధులు రాగా గత వానాకాలం సీజనులో 2.15 లక్షల మంది రైతులకు రూ.207.47 కోట్ల నిధులందాయి.
* జిల్లాలో మొత్తం 2.28 లక్షల మంది పట్టాదారులుండగా వీరికి రూ.221 కోట్లవరకు నిధులు చేరాల్సి ఉంటుంది. కానీ మరణించినవారి వివరాలను జాబితాలోనుంచి తొలగించటం, వ్యవసాయ భూములను పూర్తిగా విక్రయించినవారు, నూతనంగా భూముల కొనుగోలు, విరాసత్ ద్వారా పట్టామార్పిడి చేయించుకున్నవారు సకాలంలో పథకం పరిధిలోకి రాకపోవటంవల్ల లబ్ధిదారుల సంఖ్య ప్రతి సీజన్లోనూ గరిష్ఠ స్థాయికి చేరటంలేదు.
* రైతుబంధు నిధులను విడుదల చేసేకంటే ముందుగానే ప్రభుత్వం కటాఫ్ తేదీని ప్రకటించి ఈ తేదీవరకు పట్టాదారులుగా నమోదై పాసుపుస్తకాలు పొందినవారిని అర్హులుగా గుర్తిస్తారు. ఇదే సమయంలో నూతన పట్టాదారులు, గతంలో తమ వివరాలివ్వనివారు దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి భూమి పాసుపుస్తకం, బ్యాంకు పాసుపుస్తకం, ఆధార్కార్డు నకలు ప్రతులతో వారి భూములున్న పరిధి క్లస్టర్ ఏఈవోకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది అర్హులైన పట్టాదారులు తమ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు సకాలంలో ఇవ్వనందున వీరికి రైతుబంధు నిధులు అందటంలేదు.
* ప్రభుత్వం వద్ద భూములకు చెంది సరైన వివరాలు లేనివారు, ఇతరత్రా వివాదాలు, పలు కారణాలతో చాలామంది రైతులు గతకొన్ని సీజన్లుగా రైతుబంధు నిధులను అందుకోలేకపోతున్నారు. మరణించినవారు, భూములను పూర్తిగా విక్రయించినవారు సహా జిల్లాలో ఈ సీజనుకు చాలామంది రైతులు జాబితానుంచి తొలగిపోనుండగా దాదాపుగా 9 వేల మంది వరకు నూతన రైతులు రైతుబంధు పథకంలోకి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికిగాను ప్రభుత్వం కటాఫ్ తేదీని ప్రకటించి పట్టాదారు పాసుపుస్తకాలు పొందినవారి వివరాల నమోదుకు అవకాశమిస్తేనే నూతన రైతులకు నిధులను విడుదల చేసే అవకాశముంది. గత సీజన్లో ఎలాంటి భూ పరిమితి విధించకుండా రైతులందరికీ ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా ఈ సారి కూడా అందరికీ నిధులందుతాయని అన్నదాతలు ఆశిస్తున్నారు. దీనిపై వ్యవసాయశాఖ జిల్లా అధికారి పి.సురేశ్కుమార్ మాట్లాడుతూ కటాఫ్ తేదీని అనుసరించి మార్గదర్శకాలు ఉంటాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్