నిఘా నీడలో నియమావళి
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది.
360 డిగ్రీల కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 360 డిగ్రీల కెమెరాలతో వాహనాలు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తోంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నగదు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్టుకట్ట వేసేందుకు పలు బృందాలను నియమించింది. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గాల్లో నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. నామినేషన్ పర్వం సమీపిస్తుండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన 360 డిగ్రీల కెమెరాల విధానం సత్ఫలితాలిచ్చింది. ఈ ఎన్నికల్లో దాన్ని వినియోగించనున్నారు.
నియోజకవర్గానికి అయిదు బృందాలు
ప్రతి శాసనసభా నియోజకవర్గానికి అయిదు రకాల నిఘా బృందాలు పని చేస్తున్నాయి. పోలీస్, రెవెన్యూ, సహకార, ఇతర శాఖలను ఇందులో భాగస్వాములను చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్లో పోలీస్ అధికారి, ఒక వీడియోగ్రాఫర్, స్టాటిక్ సర్వేలెన్స్లో డిప్యూటీ తహసీల్దార్, పోలీస్, అబ్కారీ, అటవీ శాఖ సిబ్బంది ఉంటారు. వీడియో సర్వే లెన్స్ బృందం ద్వారా వచ్చిన వీడియోలను వీడియో వ్యూయింగ్ బృందం సభ్యులు నిశితంగా పరిశీలిస్తారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ) బృందంలో గెజిటెడ్ అధికారితో పాటు పోలీస్, వీడియోగ్రాఫర్ ఉంటారు. నియమావళి ఉల్లంఘన, అభ్యర్థుల ప్రచారం, ఖర్చులపై వీరు నిఘా పెడతారు.
రాష్ట్ర కార్యాలయానికి అనుసంధానం
నిఘా బృందాల వాహనాలకు 360 డిగ్రీల కెమెరాలు బిగిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించారు. అభ్యర్థుల ప్రచారం, డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీ, అల్లర్లు, ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలు ఈ కెమెరాల్లో నిక్షిప్తం కానున్నాయి. ప్రతి నియోజకవర్గానికి మూడు చొప్పున వాహనాలను అధికారులతో తిప్పుతున్నారు. వాహనాల కెమెరాలను జియోట్యాగింగ్ ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర, జిల్లా ఎన్నికల కార్యాలయాలకు అనుసంధానించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో జరిగే ఘటనలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీక్షిస్తున్నారు.
ప్రలోభాలకు అడ్డుకట్ట
ఎన్నికలపై నిఘా బృందాలు పకడ్బందీగా పర్యవేక్షిస్తుండటంతో అల్లర్లు, హింస, మద్యం, ప్రలోభాలకు అడ్డుకట్ట పడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో నిఘా బృందాల వాహనాలు అభ్యర్థుల వెంట నిరంతరం నీడలా వెంటాడుతున్నాయి. సీవిజిల్ యాప్, 1950 టోల్ఫ్రీ నంబరు ఫిర్యాదుల ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో ఉండేదెవరు?
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీలో ఉండేదెవరో సోమవారం తేలిపోనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 3 గంటల వరకే సమయం ఉండటంతో ఎవరు బరిలో ఉంటారు..? ఎవరు నామపత్రాలు వెనక్కి తీసుకుంటారో నేడు వెల్లడి కానుంది. -
44 రోజులు.. రూ.9.71 కోట్లు
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. -
ఉపాధి పని... ఉదయపు నడక
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. -
ఓట్లు అడిగే హక్కు వినోద్కే ఉంది
[ 29-04-2024]
కరీంనగర్లో అభివృద్ధి చేసిన వినోద్కుమార్కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతర పార్టీల అభ్యర్థులకు లేదని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
ప్రజా శ్రేయస్సు పట్టని కాంగ్రెస్, భారాస
[ 29-04-2024]
కాంగ్రెస్, భారాసలు ఏనాడూ ప్రజల కోసం పని చేయలేదని ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. -
పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యం
[ 29-04-2024]
కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. -
ఆగని అక్రమ తవ్వకాలు..
[ 29-04-2024]
రాజకీయ నాయకుల అండదండలు.. అధికారుల నిర్లక్ష్యం వెరసి అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. -
ధాన్యం తూకాల్లో వేగం ఏదీ?
[ 29-04-2024]
జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రానికి గులాబీ జెండా అవసరం
[ 29-04-2024]
గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు భారాసకు ఉన్న శక్తి, క్యాడర్ ఏ జాతీయ పార్టీకి లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి గులాబీ జెండా అవసరమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. -
ఓటుహక్కు వినియోగంలో మహిళా చైతన్యం
[ 29-04-2024]
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. -
బరిలో ఇద్దరు వారసులు
[ 29-04-2024]
స్థానిక సంస్థల నుంచి లోక్సభ ఎన్నికల వరకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల వారసులు బరిలో నిలుస్తుంటారు. -
టోల్ఫ్రీ నంబరు ఎలా వచ్చిందంటే..!
[ 29-04-2024]
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!