జలదిగ్బంధంలో స్మారకాలు
హంపీలోని స్మారకాలు మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి 1.30 లక్షల క్యూసెక్కులదాకా నీటిని నదికి విడుదల చేయడంతో హంపీ సమీపంలో తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రముఖ
జలదిగ్బంధంలో హంపీలోని మంటపాలు
హొసపేటె: హంపీలోని స్మారకాలు మరోసారి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తుంగభద్ర జలాశయం నుంచి 1.30 లక్షల క్యూసెక్కులదాకా నీటిని నదికి విడుదల చేయడంతో హంపీ సమీపంలో తుంగభద్ర నది ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రముఖ స్మారాలను చుట్టేసింది. ఇప్పటికీ నది తీరంలోని పిండ ప్రదాన మండపం, పురందరదాస మండపం, స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. చక్రతీర్థ కోదండ రామాలయం మెట్లదాకా వరద నీరు వచ్చి చేరింది. సాలు మంటపాలు కూడా జలావృతమయ్యాయి. ఎదురు బసవణ్ణ ఆలయం నుంచి కోదండ రామాలయం, యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్లే మార్గాలు పూర్తిగా జలావృతమయ్యాయి. భక్తులు అటువైపు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నారు. బుధవారం ఉదయానికల్లా తుంగభద్ర జలాశయం నుంచి సుమారు 2లక్షల క్యూసెక్కులదాకా విడుదల చేసే అవకాశం ఉన్నందున హంపీ పోలీస్స్టేషన్ ఎదురు బసవణ్ణ ఆలయాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. స్మారకాలు ఇలా ముంపునకు గురవడం నెలరోజుల్లో రెండో సారి.
హంపీలోని రామలక్ష్మల ఆలయం మెట్లను తాకిన తుంగభద్రమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏలికల శక్తి యుక్తులకు పరీక్ష
[ 07-05-2024]
రాష్ట్రంలో ఎన్నికల నేపథ్య జాతీయ, రాష్ట్ర నేతల హడావుడి మంగళవారంతో పరిసమాప్తం కానుంది. -
మహిళలకు సిద్ధు లేఖ
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియకు కొద్ది గంటలే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర మహిళలకు బహిరంగ లేఖ రాశారు. -
ప్రజ్వల్ కేసులో కుట్ర కోణం?
[ 07-05-2024]
కేఆర్నగర ఎమ్మెల్యే డాక్టర్ రవిశంకర్ చేసిన ఆరోపణలతోనే తమ నాయకుడు హెచ్డీ రేవణ్ణను సిట్ అరెస్టు చేసిందని జనతాదళ్ హాసన జిల్లా శాఖ అధ్యక్షుడు లింగేశ్ ఆరోపించారు. -
రాజధానిలో వాన జోరు
[ 07-05-2024]
ఈ వారాంతం వరకు బెంగళూరు, బెంగళూరు గ్రామీణం, రామనగర, కోలారు,చిక్కబళ్లాపుర, మండ్య, మైసూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. -
ఓటరన్నకు పండగొచ్చె!
[ 07-05-2024]
కర్ణాటకలో రెండో విడత 14 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాగలకోటె, చిక్కోడి, బెళగావి, విజయపుర, కలబురగి, రాయచూరు, బీదర్, కొప్పళ, బళ్లారి, హావేరి, ధార్వాడ, ఉత్తర కన్నడ, దావణగెరె, శివమొగ్గ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
[ 07-05-2024]
ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళుతున్న గోవిందప్ప (38) అనే ఉపాధ్యాయుడు గుండెపోటుతో సోమవారం మరణించారు. -
అల్లుడి విజయమే ఖర్గే ఆశయం
[ 07-05-2024]
కలబురగి లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికలపై అందరూ దృష్టి సారించారు. ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి పొందిన మల్లికార్జున ఖర్గే 2019 లోక్సభ ఎన్నికల్లో తొలిసారి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. -
గనినాడులో సర్వం సిద్ధం
[ 07-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలోని కంప్లి, బళ్లారి నగర, గ్రామీణ, సండూరు విధానసభ నియోజకవర్గాల సంబంధించిన పోలింగ్ సిబ్బందికి సోమవారం ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. -
బెంగళూరులో తెదేపా ప్రచారం
[ 07-05-2024]
అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లె మండలం నుంచి ఉపాధి, వ్యాపార నిమిత్తం బెంగళూరులో ఉంటున్న వారు ఎన్నికల సమయంలో వెనక్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెదేపా నాయకులు కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM