అవగాహనతోనే ఎయిడ్స్ నియంత్రణ
ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్పై నియంత్రణ సాధించవచ్చని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హర్షల్ బోయర్ పేర్కొన్నారు.
జెండా ఊపి ఎయిడ్స్ జాగృతి ర్యాలీని ప్రారంభిస్తున్న నగరసభ అధ్యక్షురాలు సుంకమ్మ, డీహెచ్వో డాక్టర్ సలీం
హొసపేటె, న్యూస్టుడే: ప్రజల్లో అవగాహనతోనే ఎయిడ్స్పై నియంత్రణ సాధించవచ్చని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి హర్షల్ బోయర్ పేర్కొన్నారు. జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ జాగృతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏ వ్యాధి అయినప్పటికీ దానిపై అవగాహన ఉన్నవారు చాలా జాగ్రత్తలు పాటిస్తారని స్పష్టం చేశారు. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తరువాత చికిత్స ఇవ్వడం ఎంత ముఖ్యమో రాకుండా ప్రజల్లో వ్యాధిపట్ల అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. ఇప్పటికే అవగాహనతో జిల్లాలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య విపరీతంగా తగ్గింది. పూర్తిగా నిర్మూలన చేసేవరకు వైద్యశాఖ విశ్రమించకూడదన్నారు. తరచూ ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక ఉపన్యాసాలు, వీధినాటకాల ద్వారా ప్రజల్లో అవగాహన, జాగృతి తీసుకురావాలని ఆయన సూచించారు.నగరసభ అధ్యక్షురాలు సుంకమ్మ ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ సలీం, వైద్యాధికారులు భాస్కర్, షణ్ముఖ నాయక్, జంబయ్య, శంకర్ నాయక్, కమలమ్మ, ఎం.పి.దొడ్డమని, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధినాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..