భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది.
కాంగ్రెస్ ప్రణాళిక ప్రతులను విడుదల చేస్తున్న మంత్రులు జమీర్ అహ్మద్ఖాన్, బి.నాగేంద్ర, అభ్యర్థి తుకారాం
హొసపేటె, న్యూస్టుడే: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. రాహుల్గాంధీ ప్రధానిగా అధికారం స్వీకరిస్తారని జోస్యం పలికారు. హొసపేటెలో బుధవారం ఏర్పాటు చేసిన లోక్సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. భాజపావారు ఉత్తరప్రదేశ్లో రామమందిరాన్ని మాత్రమే నిర్మించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్య కల నిజం చేస్తామని అన్నారు. లోక్సభ కురుక్షేత్రంలో పాండువులు, కౌరవుల నడుమ యుద్ధం జరుగుతోంది. చివరికి గెలుపు పాండువులదే. భాజపాలోని కౌరవులంతా మట్టి కరుస్తారని జోస్యం పలికారు. బళ్లారి, విజయనగర జిల్లాల్లో విస్తరించిన బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేటికీ పటిష్ఠంగా ఉంది. రెండు జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తుకారాంను ఆధిక్యంతో గెలిపిస్తామని తాను, మంత్రి జమీర్ ప్రతినబూనామని స్పష్టం చేశారు. ఇద్దరు మంత్రులకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయని తెలిపారు. విజయనగర జిల్లా బాధ్యమంత్రి జమీర్ అహ్మద్ఖాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు, నాయకులు రేయింబవళ్లు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల తరువాత రాష్ట్రంలో అభివృద్ధి మరింత పుంజుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన విధంగా దేశ ప్రజలకు ఇంకా మంచి ఎప్పుడొస్తాయో అని వ్యంగమాడారు. అభ్యర్థి ఇ. తుకారాం, మాజీ ఎంపీ వి.ఎస్.ఉగ్రప్ప, ఎమ్మెల్యేలు గవియప్ప, డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. హడగలి, హొసపేటెలోని పలువురు భాజపా నాయకులు, హగరిబొమ్మన హళ్లిలోని కొందరు జేడీఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు. కేపీసీసీ ప్రధాన కార్యదర్శి రాణిసంయుక్త, డీసీసీ అధ్యక్షుడు సిరాజ్ షేక్, శివయోగి స్వామి, మాజీ అధ్యక్షుడు మహ్మద్ రఫీక్ పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సామాజిక సమర భూమిక
[ 30-04-2024]
మలివిడత ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలంతా మాటల తూటాలు పేలుస్తున్నారు. -
భాజపాను గెలిపిస్తే పెనుముప్పు
[ 30-04-2024]
‘భాజపా ఈసారి 400సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ పార్టీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోల్పోయినట్లే’నని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను హెచ్చరించారు. -
ప్రజ్వల్ రాజకీయ భవితపై నీలినీడలు
[ 30-04-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్, మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సొంతపార్టీ జనతాదళ్ నేతల నుంచే డిమాండ్లు వెల్లువెత్తడం అనూహ్య పరిణామంగా మారింది. -
సీనియర్ నేత శ్రీనివాసప్రసాద్ కన్నుమూత
[ 30-04-2024]
కేంద్ర మాజీ మంత్రి, ఆరుసార్లు లోక్సభకు, రెండుసార్లు కర్ణాటక విధానసభకు ఎన్నికైన సీనియరు నాయకుడు వి.శ్రీనివాస ప్రసాద్ (76) ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు కన్నుమూశారు. -
ఆసుపత్రిలో చేరిన కృష్ణ
[ 30-04-2024]
మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (91)కు ఆరోగ్య సమస్యలు తిరగబెట్టాయి. -
కల్నల్ జంగ్వీర్కు అభినందనల వెల్లువ
[ 30-04-2024]
ఐరన్ మ్యాన్గా గుర్తింపు దక్కించుకున్న కల్నల్ జంగ్వీర్ లాంబా (53) మొరాకో సహారాలో నిర్వహించిన 38వ వార్షిక మారథాన్లో పతకాన్ని సాధించారు. -
కాంగ్రెస్లో నాయకత్వం ద్విగుణీకృతం
[ 30-04-2024]
కాంగ్రెస్లో నాయకులు, నాయకత్వం లేదంటూ ప్రధాని మోదీ ప్రచారం పచ్చి అబద్ధమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
పదేళ్లలో ఏం చేశారని ఓటేయాలి?
[ 30-04-2024]
గడిచిన పదేళ్లలో మహాప్రభు (నరేంద్ర మోదీ) ప్రజలకు ఏమి చేశారని ఓటు వేయాలి. దేశంలో నిరుద్యోగ సమస్య పెంచినందుకా?.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఆ 60వేల ఓట్లు ఎవరివి?.. పాతబస్తీలో ఆచూకీ దొరకని ఓటర్లు
-
అన్నా క్షమించు... ఈ లోకంలో బతకలేకున్నా
-
ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకొస్తాం: కర్ణాటక హోంమంత్రి
-
‘కాల్చి పడేస్తా.. ఎవడొస్తాడో రమ్మను’.. సస్పెండైన ఓ ఎస్సై వీరంగం
-
మనవడిని కొట్టిందని.. కోడలిని హతమార్చిన మామ