ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
గెణికెహళ్లో ఎద్దుల బండ్లతో ఓటర్లకు అవగాహన
బళ్లారి, న్యూస్టుడే: జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. బళ్లారి తాలూకా కుడతిని అంగన్వాడీ కేంద్రం ముఖ్య పర్యవేక్షకురాలు సుమంగళమ్మ నేతృత్వంలో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పసుపు, కుంకుమ అందజేసి మే 7న పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా స్వీప్ సమితి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మారథాన్, వాక్థాన్ కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన, చిత్రకళ, ఎద్దుల బండ్ల ఊరేగింపు వంటి కార్యక్రమాలతో ఓటర్లకు అవగాహన కల్పించారు. కుడతిని అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించడంతో అధికారులను అభినందించారు. కురుగోడు తాలూకా పంచాయతీ, స్వీప్ సమితి ఆధ్వర్యంలో పోలింగ్ శాతం పెంచడానికి వినూత్నంగా కురుగోడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. తహసీల్దార్ నిర్మల, అధికారులు రేణుకాదేవి, తిమ్మప్ప, అనిల్కుమార్ ప్రారంభించారు. తాలూకా ఓర్వాయి, గెణికెహళ్ గ్రామాల్లో ఎద్దుల బండ్లపై ఓటర్లకు అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ అధికారి జయలక్ష్మి, తదితర అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించారు.
కురుగోడులో ఓటర్లకు అవగాహన కల్పించడానికి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభిస్తున్న అధికారులు
ఎన్నికల జాగృతికి రీల్స్ పోటీలు
హొసపేటె: వచ్చే నెల 7న జరుగుతున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాగృతి కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా ప్రజలకు రీల్స్ పోటీలను ఏర్పాటు చేశామని జిల్లా పాలనాధికారి ఎం.ఎస్.దివాకర ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగర జిల్లాలో ఓటింగ్ శాతం 90 దాటాలన్న లక్ష్యంతో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వినూత్నంగా జిల్లా ప్రజల నుంచి ఓటింగ్ జాగృతి రీల్స్ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. 30 సెకన్ల నుంచి ఒక నిమిషం నిడివిలో జాతృతి రీల్స్ను చేసి వాట్సాప్ నంబరు 8660752667కు పంపాలన్నారు. ఈ నెల 26లోగా రీల్స్ను సమర్పించాలన్నారు. ప్రథమ బహుమతి రూ.5వేలు, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.3, రూ.2వేలు అందజేస్తామని డీసీ పేర్కొన్నారు.
ఎమ్మిగనూరులో ఎడ్ల బండి జాతా
జాతాలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు
కంప్లి, న్యూస్టుడే: ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా తాలూకాలోని ఎమ్మిగనూరులో స్వీప్ సమితి గురువారం ఎడ్ల బండి జాతా నిర్వహించింది. ప్రభుత్వ పాఠశాల వద్ద జాతాను తాలూకా పంచాయతీ అధికారి ఆర్.కె.శ్రీకుమార్ ప్రారంభించారు. జాతా పాఠశాల నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల్లో సాగింది. ప్రజల్లో జాగృతి కలిగించేందుకు ఓటు హక్కు నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శారద, సభ్యులు, అధికారులు, ఉపాధ్యాయులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలిమడత మహా ప్రచారం
[ 01-05-2024]
ఎన్నికల వేళ పార్టీల ప్రచార రథాలన్నీ వాయువేగంతో పరుగెడుతున్నాయి. పార్టీల దిగ్గజ నేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రానికి వచ్చి వెళుతున్నారు. -
దారుణం.. దాచేస్తే దాగని నిజం
[ 01-05-2024]
జనతాదళ్ నుంచి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మంగళవారం సస్పెండ్ చేసిన వెంటనే- ప్రత్యేక దర్యాప్తు దళం దర్యాప్తు వేగం పుంజుకుంది. -
యాప్ల వలలో విలవిల
[ 01-05-2024]
పబ్జీ, బెట్టింగ్ యాప్ల వలలో పడిన ఇద్దరు బాలురను (17) బెదిరించి నగలు, నగదు, వస్తువులను దోచుకున్న నలుగురిని రాజరాజేశ్వరినగర ఠాణా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. -
ఆమె ప్రాతినిధ్యం..అంతంత మాత్రం!
[ 01-05-2024]
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన బళ్లారి లోక్సభ నియోజకవర్గంలో ఈసారి మహిళా అభ్యర్థులు పోటీ చేయలేదు. -
మోదీ అబద్ధాలతో మభ్యపెడతారు
[ 01-05-2024]
ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పి మభ్యపెడతారు, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి యువతే దారిదీపం
[ 01-05-2024]
ప్రపంచంలో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్ పేర్కొన్నారు. -
రూ.75 లక్షల నగదు చోరీ
[ 01-05-2024]
నగర పాలికె కార్యాలయం ఆవరణలో ఉన్న కర్ణాటక వన్ కేంద్రంలో రూ.75లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు. -
శెట్టర్కు ప్రధాని లేఖ
[ 01-05-2024]
బెళగావి లోక్సభ భాజపా అభ్యర్థి జగదీశ్ శెట్టర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ లేఖ రాశారు. ప్రజా సంక్షేమాన్ని కోరుతూ నిత్యం పని చేస్తామనేది ‘మోదీ గ్యారెంటీ’ అని లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పండుటాకులే ఎండగడతాయి జగన్!
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
-
కొలిక్కి రాని కుక్కర్ కూపన్ల కథ.. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు
-
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు.. స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు!
-
వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
-
ఆది గోద్రేజ్ కుటుంబం విడిపోయింది