‘పురపాలకాల్లో అభివృద్ధి పనులు వేగిరం’
మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, డీఈలు, ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే: మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, డీఈలు, ప్రజారోగ్య శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఫిబ్రవరి 1 నాటికి ఇంటింటి చెత్త సేకరణ వందశాతం జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం కొత్తగూడెంలో 67, ఇల్లెందులో 95, పాల్వంచలో 76, మణుగూరులో 40 శాతం ఇళ్ల నుంచి మాత్రమే నేరుగా చేత్త సేకరణ చేపడుతున్నారన్నారు. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారు చేయాలని, టెట్రా వర్మీ బెడ్ల ఏర్పాటులో వేగం పెరగాలని అన్నారు. కొత్తగూడెం రాజీవ్ పార్క్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమీకృత మార్కెట్ సముదాయాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. వైకుంఠధామాల్లో నీరు, విద్యుత్తు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో క్రీడా ప్రోత్సాహంలో భాగంగా ఇండోర్ షటిల్ కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. పాల్వంచ సెంట్రల్ లైటింగ్ పనుల్లో జాప్యానికి కారణమైన గుత్తేదారుతో కాంట్రాక్టు రద్దు చేయాలని కమిషనర్ని ఆదేశించారు. గ్రంథాలయ నిర్మాణ డిజైన్ పూర్తిచేసి నివేదిక అందించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని సూచించారు. ‘ఈ-శ్రమ’ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఇల్లెందు పురపాలక ఛైర్మన్ డి.వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు కమిషనర్లు సంపత్కుమార్, శ్రీకాంత్, అంజన్కుమార్, నాగప్రసాద్, డీఈలు నవీన్, మురళి, ప్రజారోగ్య శాఖ డీఈ నవీన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరూ రావాల్సిందే.. నిబంధనలు పాటించాల్సిందే
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు. -
ఈ శోకం తీర్చలేనిది
[ 10-05-2024]
ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది. -
ఐటీడీఏలకు రావాలి పూర్వవైభవం
[ 10-05-2024]
గిరిజనుల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే.. షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఐటీడీఏలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా గిరిజనులకే కలెక్టరేట్గా పిలుచుకునే ఈ సంస్థలు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో కొలువుదీరగా.. -
రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: భట్టి
[ 10-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. -
1,395 పాఠశాలలు, రూ.41.48 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం. -
ఆదరిస్తే అండగా నిలుస్తా: తాండ్ర
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కారేపల్లిలో గురువారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోవద్దు: పువ్వాడ
[ 10-05-2024]
కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని, తాము అందించిన సంక్షేమాన్ని గుర్తించి లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
రామాలయ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమాలోచనలు
[ 10-05-2024]
భద్రాచలం రామాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
భారాస పాలనలోనే ఇల్లెందు అభివృద్ధి: సత్యవతి రాథోడ్
[ 10-05-2024]
పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం -
బంగారు పర్వదినం
[ 10-05-2024]
అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు. -
పాలేరు మళ్లీ పోటెత్తాలి..
[ 10-05-2024]
సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
భాజపాకు మాదిగలు ఓటేయొద్దు
[ 10-05-2024]
అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. -
దేవుడి తోడు.. మేం ఓటెయ్యం!
[ 10-05-2024]
‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ హామీలివ్వటం.. ఆపై ప్రతిజాప్రతినిధులు మోసగించటం షరామామూలైంది. మా గ్రామాన్ని అధికారులు, నేతలెవరూ పట్టించుకోవడం లేదు. అందుకే.. దేవుడిపై ఒట్టు.. -
ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పెద్దవెంకటాపురం గ్రామస్థులు గురువారం తీర్మానించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు తర్వాత తమవైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. -
ఎన్నికల వేళ మందుపాతరల దడ..!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల మందుపాతరల ఏర్పాటుతో ఏజెన్సీలో దడ పుడుతోంది. భద్రాచలం ఏజెన్సీలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు