సొంత మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కుమార్తె చూసిందని..
సొంత మామ(భర్త తండ్రి)తో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ మహిళ కన్న కూతురినే హతమార్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.
మామతో కలిసి కన్న కూతుర్నే చంపిన తల్లి
నిందితులు సునీత, నరసింహారావు
బోనకల్లు, న్యూస్టుడే: సొంత మామ(భర్త తండ్రి)తో వివాహేతర సంబంధం పెట్టుకొన్న ఓ మహిళ కన్న కూతురినే హతమార్చింది. సహజ మరణంగా చిత్రీకరించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లులో చోటుచేసుకుంది. వైరా ఏసీపీ స్నేహామెహ్రా తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు కుమారుడికి సునీతతో వివాహమైంది. సునీతకు 12 ఏళ్ల పాప ఉంది. కొంతకాలంగా ఈమె మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వీరు ఏకాంతంగా ఉన్నప్పుడు బాలిక చూడటంతో మామతో కలిసి కన్న కూతురినే హతమార్చింది. ఈనెల 9న బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతు బిగించి చంపారు. దీన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ముందుగా బాలిక ఫిట్స్ వచ్చి కింద పడటంతో దెబ్బ తగిలిందని మృతదేహాన్ని స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయిందని నిర్ధారించుకొన్నారు. పీహెచ్సీలో చనిపోయినట్లు నిర్ధారించకూడదని.. ‘వెంటనే ఖమ్మం తీసుకెళ్లమని’ పంపించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులు పాప చనిపోయిందని నిర్ధారించారు. తల్లి, తాత బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా ఇవ్వాలని కోరారు. చిన్నారి మెడపై రాపిడి గుర్తులు ఉండటంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై కవిత సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
శతవిధాలా ప్రయత్నించినా...: పోస్టుమార్టం జరిగితే అసలు విషయం బయట పడుతుందని నిందితుడు నరసింహారావు ఆపేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. చిన్న పిల్లను కోయడం మంచిది కాదని, చూసి తట్టుకోలేమని ప్రాధేయపడ్డాడు. పోలీసులు, వైద్యులు అంగీకరించకుండా పోస్టుమార్టం చేశారు. అసలు విషయం బయట పడుతుండటంతో తప్పించుకునేందుకు గ్రామంలో మరో యువకుణ్ని ఇరికించాడు. ఆ యువకుడికి తన కోడలికి వివాహేతర సంబంధం ఉందని అతనే చంపాడని కోడలితో పోలీసులకు చెప్పించారు. అతణ్ని విచారించగా వివాహేతర సంబంధం నిజమేనని కాని హత్యతో తనకు సంబంధం లేదని చెప్పాడు. పోలీసులు ఆధారాలు సేకరించి తల్లిని గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటపడింది. అప్పటికే పోస్టుమార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ అయింది. నిందితులు నేరం అంగీకరించడంతో హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఏసీపీ చెప్పారు. చిన్న ఆధారంతో పోలీసులు కేసుని ఛేదించినట్లు ఏసీపీ సేహామెహ్రా వివరించారు. ఇంట్లో చున్ని 75 శాతం ఉంది. 25 శాతం కట్ చేసి ఉంది. 25 శాతం చున్ని ఏమైందని పరిశీలించగా దాంతోనే చిన్నారి కాళ్లు, చేతులు కట్టి గొంతుకు వైరుతో బిగించి చంపారని తేలిందన్నారు. వారంలో మిస్టరీ ఛేదించినందుకు సీఐ మురళి, ఎస్సై కవిత, సిబ్బందిని అభినందించారు. వారికి రివార్డులు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పకడ్బందీ శిక్షణ.. ప్రజాస్వామ్యానికి రక్షణ
[ 07-05-2024]
సార్వత్రిక సమరంలో అత్యంత కీలక ఘట్టమైన పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. దేశ భవిష్యత్తు, అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో ప్రతి ఓటూ కీలకమవటంతో పోలింగ్ క్రతువులో అవకతవకలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకుంటోంది. -
గృహమే కదా పోలింగ్ కేంద్రం!
[ 07-05-2024]
పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలకు రాలేనివారు సైతం ఓటుహక్కు వినియోగించుకునేలా ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. -
రైతు వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
[ 07-05-2024]
రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ముదిగొండలో సోమవారం ప్రచారం నిర్వహించారు. -
కేంద్రం తాటాకు చప్పుళ్లకు భయపడం: భట్టి
[ 07-05-2024]
కేంద్రం తాటాకు చప్పుళ్లకు రాష్ట్రంలోని ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త భయపడబోరని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. చింతకానిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. -
ప్రత్యేక బోధనతోనే అనుత్తీర్ణులు గట్టేక్కేది!
[ 07-05-2024]
ఇటీవల వెల్లడైన పదోతరగతి వార్షిక ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని కొన్ని యాజమాన్యాల పాఠశాలలు తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. -
కేంద్ర హోంమంత్రిపై ఆరోపణలు చేశారని.. సీఎం రేవంత్రెడ్డిపై భాజపా ఫిర్యాదు
[ 07-05-2024]
కొత్తగూడెంలో ఈ నెల 4న నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్రెడ్డి భాజపాపై అసత్య ఆరోపణలు చేశారని, దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్ కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహ్మాన్, ఒకటో పట్టణ సీఐ కరుణాకర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. -
అంతా.. పోలింగ్ కేంద్రాలకు కదలాలంటే...!
[ 07-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మధ్యాహ్నం బయట తిరగలేని పరిస్థితి. ఏ రోడ్డు చూసినా నిర్మానుష్యమే. 2019లో పోలింగ్ ఏప్రిల్ 11వ తేదీనే జరిగింది. -
శాసనసభ ఎన్నికల ఫలితాలే పునరావృతం
[ 07-05-2024]
కాంగ్రెస్ పార్టీ మాత్రమే తమకు భరోసా ఇస్తుందనే నమ్మకం ప్రజల్లో నాటుకుందని ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. -
నమూనా కేంద్రం.. ఆకర్షణీయం
[ 07-05-2024]
ఓటు వేసేందుకు వచ్చేవారిని ఆకట్టుకునే నమూనా పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు. ఈ మేరకు 15 నమూనా కేంద్రాలను ఖమ్మం కలెక్టర్ గౌతమ్ ఎంపిక చేశారు.