రవాణాకు రైలు మార్గం.. బొగ్గు ఉత్పత్తిలో వేగం
సింగరేణి విస్తరించి ఉన్న మిగిలిన ఏరియాల్లోని గనులకన్నా ఖమ్మం జిల్లాలోని ఓసీల నుంచే అధిక మొత్తంలో బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఈ ఏరియాలోని పలు ఓసీల్లో ఇటీవల వరకు ఉత్పత్తి రవాణాకు రోడ్డు మార్గంపైనే
కొత్తగూడెం సింగరేణి, న్యూస్టుడే: సింగరేణి విస్తరించి ఉన్న మిగిలిన ఏరియాల్లోని గనులకన్నా ఖమ్మం జిల్లాలోని ఓసీల నుంచే అధిక మొత్తంలో బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఈ ఏరియాలోని పలు ఓసీల్లో ఇటీవల వరకు ఉత్పత్తి రవాణాకు రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చింది. దీంతో తవ్వకాలు పూర్తిస్థాయిలో జరపలేదు. ప్రస్తుతం ఓ రైలుమార్గం ఏర్పాటు కావడంతో భారీగా బొగ్గు వెలికితీత చేపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వార్షిక సంవత్సరం ఖమ్మం జిల్లాలోని గనులకు భారీ లక్ష్యాన్ని నిర్ణయించారు.
ఉభయ జిల్లాల్లో విస్తరించి ఉన్న కొత్తగూడెం ఏరియాకు ఈ ఉత్పత్తి సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని 151 లక్షల టన్నులుగా నిర్ణయించగా.. అందులో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ-2, కిష్టారం ఓసీలకు సింహభాగం కేటాయించారు. ఈ రెండు గనుల నుంచి గత సంవత్సరం 93.50 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది దీన్ని ఏకంగా 120 లక్షల టన్నులకు యాజమాన్యం పెంచింది. సత్తుపల్లికి రైలుమార్గం ఏర్పడినందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కిష్టారంలో ఉత్పత్తి నామమాత్రం కాగా జేవీఆర్ నుంచే ఏకంగా 100 లక్షల టన్నుల బొగ్గు వెలికితీయనున్నారు. కొత్తగూడెం ఏరియా జీఎం సీ.హెచ్.నర్సింహారావు మాట్లాడుతూ... ‘సత్తుపల్లి రైలుమార్గం ప్రారంభం అయింది. దీంతో రవాణాకు మరింత వెసులుబాటు కలిగింది. భారీ మొత్తంలో ఉత్పత్తి దిశగా చర్యలు ముమ్మరం చేశాం. జేబీఆర్ ఓసీ నుంచి 100 టన్నుల లక్ష్యం చేరుకుంటా’మని అన్నారు.
* గని: జలగం వెంగళరావు ఓసీ-2
* మొత్తం నిక్షేపాలు: 293 మిలియన్ టన్నులు
* కాలపరిమితి: 29 సంవత్సరాలు
* ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యం: 100 లక్షల టన్నులు
* గతేడాది సాధించిన లక్ష్యం: 93.50 లక్షల టన్నులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరికలు
[ 26-04-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్లో చేరారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?