logo

ఖమ్మం నగర ఏసీపీ బదిలీ

ఖమ్మం నగర ఏసీపీగా పీవీ గణేశ్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ ఏసీపీగా పనిచేసిన బొల్లినేని ఆంజనేయులు బదిలీ అయ్యారు.

Published : 29 Jan 2023 03:08 IST

పీవీ గణేశ్‌

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే:  ఖమ్మం నగర ఏసీపీగా పీవీ గణేశ్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇక్కడ ఏసీపీగా పనిచేసిన బొల్లినేని ఆంజనేయులు బదిలీ అయ్యారు. ఆయన చీఫ్‌ ఆఫీస్‌కు రిపోర్ట్‌ చేయాలని డీజీపీ ఉత్తర్వులు వెలువరించారు. గణేశ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఖమ్మం ఏసీపీగా పనిచేశారు. సత్తుపల్లి ఏసీపీగా పనిచేస్తున్న ఎన్‌.వెంకటేశ్‌ పాల్వంచ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ పోస్టుకు ఇంకా ఎవరినీ నియమించలేదు. పాల్వంచలో పనిచేస్తున్న డీఎస్పీ సత్యనారాయణను చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ పేర్కొన్నారు. వరంగల్‌ ఎస్‌బీ ఏసీపీ షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ను కొత్తగూడెం ఎస్‌డీపీవోగా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న వెంకటేశ్వరబాబును చీఫ్‌ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు ఖమ్మం టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీగా రానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని