టీకాలతో వ్యాధుల నుంచి రక్షణ
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిత్యం ఎంతో మంది పిల్లలు జన్మిస్తున్నారు. నవజాత శిశువు రోగాల బారిన పడకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి.
పుట్టిన చిన్నారులందరికీ తప్పనిసరి
జిల్లా ఆస్పత్రిలో చిన్నారికి టీకా వేస్తున్న సిబ్బంది
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిత్యం ఎంతో మంది పిల్లలు జన్మిస్తున్నారు. నవజాత శిశువు రోగాల బారిన పడకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి. పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల వయసు వచ్చే వరకు పలు విడతలుగా ప్రభుత్వం ఉచితంగానే టీకాలు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. బీసీజీ నుంచి టీడీ వరకు అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో వంద శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతూ నిర్దేశించిన కాలమానిని ప్రకారం టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. ఒకసారి జిల్లాలో గత ఏడాది పంపిణీ ప్రక్రియ సాగిన తీరును పరిశీలిస్తే...
పంపిణీ కేంద్రాలు ఇక్కడే..
ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ప్రతిరోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సీహెచ్సీ, ప్రాథమిక, ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలో బుధ, శనివారాల్లో నిర్దేశిత శిబిరాల్లో టీకాలు అందిస్తారు.
పుట్టినప్పటి నుంచి 16 ఏళ్లు వచ్చే వరకు..
పిల్లలు జన్మించిన వెంటనే బీసీజీ(బాసిల్లె క్లామెట్టీ గ్యూరిన్), ఓపీవీ(ఓరల్ పోలియో వ్యాక్సిన్), హెపటైటిస్-బీ టీకాలు వేయించాలి. ఆరు, పది, 14 వారాలకు పెంటావాలెంట్ వ్యాక్సిన్(పెంటా1, 2, 3), ఓపీవీ(1,2,3), ఐపీవీ(ఇన్ ఆక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ 1, 2, 3), ఆర్వీవీ(రోటా వైరస్ వ్యాక్సిన్ 1, 2, 3), పీసీవీ(నిమోకోకల్ కంజుగేట్ వ్యాక్సిన్ 1, 2), తొమ్మిది నెలలకు ఎంఆర్ (మీజిల్స్, తట్టు-1), జేఈ(జపనీస్ ఎన్సీఫాలిటిక్స్ వ్యాక్సిన్-1), విటమిన్ ఏ, పీసీవీ బూస్టర్, 16 నుంచి 24 నెలల మధ్య డీపీటీ(డిప్తీరియా, పెర్టుసిస్, టెటనస్) బూస్టర్, ఓపీవీ బూస్టర్, ఎంఆర్-2, జీఈ-1, విటమిన్ ఏ, 5 నుంచి 6 ఏళ్ల పిల్లలకు డీపీటీ బూస్టర్-2, 10 నుంచి 16 సంత్సరాల పిల్లలకు టీడీ(టెటనస్, డిప్తీరియా) టీకాలు కచ్చితంగా వేయించాలి. సకాలంలో అన్ని రకాల టీకాలను చిన్నారులకు ఇప్పించడం వల్ల 12 ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎలా వెళ్తారో.. అలా రావాల్సిందే..
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రెండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో వినియోగించే ఈవీఎంలను ఆయా శాసనసభ నియోజకవర్గాలకు తరలించిన అధికారులు.. పోలింగ్ సిబ్బందిని సైతం సిద్ధం చేశారు. -
జిల్లాలో వర్షం
[ 08-05-2024]
నెల రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతున్న జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చల్లని గాలులతో ప్రజలు సేదదీరారు. అక్కడక్కడ జల్లులు కురిశాయి. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్..
[ 08-05-2024]
ఉభయ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్య పుస్తకాల సరఫరా మొదలైంది. విద్యా సంవత్సరం ఆరంభం కాగానే విద్యార్థులకు అందజేసే లక్ష్యంతో విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు చర్యలను సెలవులు మొదలైన తర్వాత ఏప్రిల్ నెల నుంచే ఉన్నతాధికారులు ప్రారంభించారు. -
రక్తహీనత.. బాధితులకు చేయూత
[ 08-05-2024]
థలసీమియా.. చిన్నారులకు ఒక శాపం. వంశపారంపర్యంగా, మేనరికం వివాహాల వల్ల ఇది సంక్రమిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బయటపడిన చిన్నారులు నెలకోసారి రక్తం ఎక్కించుకుంటూ జీవితకాలాన్ని పొడిగించుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. -
ఖమ్మంలో కమల వికాసం ఖాయం
[ 08-05-2024]
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కాంగ్రెస్, భారాస హయాంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆశించిన స్థాయి అభివృద్ధి జరగలేదని, ప్రజలు ఈసారి భాజపా వైపు చూస్తున్నారని చెప్పారు. -
సత్వర న్యాయమే ప్రథమ ప్రాధాన్యం: జిల్లా జడ్జి
[ 08-05-2024]
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రథమ ప్రాధాన్యమని, న్యాయవాదులు బెంచ్కు సహకరించాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి చింతనిప్పు వెంకట్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ హాల్లో నూతన న్యాయాధికారుల పరిచయ కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. -
ఘనంగా సీతారామ కల్యాణోత్సవం
[ 08-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు సాగాయి. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన నిర్వహించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. -
రఘురాంరెడ్డిని గెలిపిస్తే.. ‘ఖమ్మం’ను అగ్రస్థానంలో నిలబెడతారు
[ 08-05-2024]
కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతారని సినీనటుడు విక్టరీ వెంకటేశ్ అన్నారు. పట్టణ ప్రముఖులు, వైద్యులతో కొత్తగూడెం క్లబ్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. -
భారాస విజయమే లక్ష్యంగా పనిచేయండి: నామా
[ 08-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భారాస విజయమే లక్ష్యంగా బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని ఆపార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన బూత్స్థాయి కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కేసీఆర్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: కవిత
[ 08-05-2024]
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి మాజీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. దాస్తండాలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. -
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి: భంజ్దేవ్
[ 08-05-2024]
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యమని కాకతీయవంశ వారసుడు, బస్తర్ మహారాజు కమల్చంద్ర భంజ్దేవ్ అన్నారు. భాజపా లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావుకు మద్దతుగా దమ్మపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి దుర్మరణం
[ 08-05-2024]
విద్యుదాఘాతంతో తాపీ మేస్త్రి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీరాముల శ్రీను కథనం ప్రకారం.. అశ్వారావుపేటలో ఓ భవన నిర్మాణ పనుల కోసం గుత్తేదారు, ఏపీలోని కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం బాలరామపురానికి చెందిన దాసరి సూరిబాబు(40), మరి కొందరిని తీసుకొచ్చాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..