జిల్లా తొలిమంత్రి శీలం సిద్ధారెడ్డి
1952లో ఏర్పడ్డ మధిర నియోజకవర్గం నుంచి శీలం సిద్ధారెడ్డి జిల్లాలోని తొలిమంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు.
మధిర, న్యూస్టుడే
1952లో ఏర్పడ్డ మధిర నియోజకవర్గం నుంచి శీలం సిద్ధారెడ్డి జిల్లాలోని తొలిమంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు. సిద్ధారెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో 1967 మార్చి 6న మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు నీటిపారుదల, గిరిజన సంక్షేమశాఖలు కేటాయించారు. ఎర్రుపాలెం మండలానికి కట్లేరుపై సాగునీటి ప్రాజెక్టును నిర్మించేందుకు కృషి చేశారు. పలు ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు ఆయన హయాంలోనే జరిగాయి. బనిగండ్లపాడులో ప్రభుత్వ వైద్యశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆడిటోరియం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముఖ్యమంత్రిగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయటంతో ఆ మంత్రివర్గంలో ఉన్న సిద్ధారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం తిరిగి బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిగా 1969 జులై 19న ప్రమాణ స్వీకారం చేయించారు. 1970లో జరిగిన శాసన మండలికి శాసనసభ్యుల ద్వారా జరిగిన ఎన్నికల్లో సిద్ధారెడ్డి మూడోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1971 సెప్టెంబర్ 30న పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో సిద్ధారెడ్డి నీటిపారుదలశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వంలో ఏర్పడ్డ విభేదాలు కారణంగా 1972 మార్చి 20న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన ఏఐసీసీ సభ్యులుగా ఉంటూ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. 1978లో జరిగిన ఎన్నికల్లో మధిర నుంచి జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1983 జనవరి 3న జరిగిన ఎన్నికల్లో మధిర నుంచి కాంగ్రెస్ తరఫున తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుస పరాజయాలు పొందారు. కోట్ల విజయభాస్కర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిద్ధారెడ్డిని షాడో ముఖ్యమంత్రి అని పిలిచేవారు. గోసవీడు క్యాంపు ఇన్ఛార్జిగా పనిచేసి రజాకార్లను గడగడలాడించిన సమరయోధుడిగా పేరుపొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ గళం.. ప్రచార దళం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు సవాల్గా మారాయి. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూనే ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. -
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
[ 28-04-2024]
రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. -
కనుమరుగైన హెలికాప్టర్ నియోజకవర్గం
[ 28-04-2024]
భద్రాచలం లోక్సభ స్థానానికి హెలికాప్టర్ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. -
21 మంది ధరావతు కోల్పోయారు..!
[ 28-04-2024]
2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన: మంత్రులు
[ 28-04-2024]
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కానిస్టేబుల్ను సత్కరించిన డీజీపీ
[ 28-04-2024]
దమ్మపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగముత్యాన్ని డీజీపీ రవిగుప్తా శనివారం సత్కరించారు. ఈ ఏడాది మేడారం మహాజాతరలో విధులు నిర్వహించిన సమయంలో నాగముత్యం గుండెపోటుకు గురైన ముగ్గురు వ్యక్తులకు సీపీఆర్ నిర్వహించి కాపాడారు. -
రూ.63 లక్షల నగదు సీజ్
[ 28-04-2024]
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కేసీఆర్ కష్టంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: భారాస
[ 28-04-2024]
సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వర్తించాలి
[ 28-04-2024]
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్సభ స్థానం సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే అన్నారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 28-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు