‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు.
కొత్తగూడెం నేరవిభాగం: సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ‘సుధాకర్ అనే వ్యక్తి అశోక్గుప్తాతో కలిసి దుబాయ్ నుంచి ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుకు చెందిన తన బావమరిది కస్యా చినబాబు అలియాస్ హర్షకు కొద్దినెలల క్రితం ఫోన్చేశాడు. తాము ట్రేడింగ్ చేయడానికి బ్యాంకు కరెంట్ ఖాతా కావాలని చెప్పారు. ఇందుకోసం రూ.50 వేలు ఇస్తామన్నారు. ఖమ్మం గాంధీచౌక్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో లోన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న కస్యా డబ్బుకు ఆశపడి తన భార్య ప్రియాంక పేరిట కరెంట్ ఖాతా తెరిచి ఆవివరాలు వారికి పంపాడు. కొంతకాలం తర్వాత అశోక్గుప్తా మళ్లీ కస్యాను ఫోన్లో సంప్రదించాడు. మరో ఐదుగురిపై బ్యాంకు ఖాతాలు తెరిపించాలని మరింత డబ్బు ఆశచూపాడు. కస్యా ఇల్లెందుకు చెందిన తన భార్య ప్రియాంక ద్వారా ఆమె స్నేహితుడైన చైతన్యను సంప్రదించాడు. రూ.లక్ష డబ్బు ఆశ చూపడంతో అతడు డ్వాక్రా మహిళల ఆధారాలతో ఖాతాలు తెరిపించాడు. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇచ్చాడు. మిగతా రూ.25 వేలు తన జేబులో వేసుకున్నాడు. బ్యాంకు ఖాతాల ఏటీఎం, ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాలను అశోక్గుప్తాకు పంపించాడు. అక్రమ లావాదేవీల వ్యవహారం బయటకు పొక్కింది. బాధితుల ఫిర్యాదుతో ఇల్లెందు పోలీసులు రంగంలోకి దిగారు.
దుబాయ్ అడ్డాగా దందా.. దుబాయ్ కేంద్రంగా అశోక్గుప్తా, సుధాకర్ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇండియాలోని పలువురు వ్యాపారులను వాట్సాప్ ద్వారా సంప్రదిస్తున్నారు. క్రిఫ్టోకరెన్సీ, బిట్ కాయిన్లలో పెట్టుబడి పెడితే ఎన్నో రెట్లు లాభాలు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. ఆ డబ్బును దుబాయ్లోని తమ సొంత ఖాతాలకు బదిలీ చేయించుకుని విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. గతంలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడిన వీరిపై హైదరాబాద్ ఎల్బీనగర్ ఠాణాలో కేసులు నమోదైనట్లు ఇల్లెందు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుతో సంబంధం ఉన్న స్థానిక నిందితులను గురువారం రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ గళం.. ప్రచార దళం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు సవాల్గా మారాయి. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూనే ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. -
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
[ 28-04-2024]
రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. -
కనుమరుగైన హెలికాప్టర్ నియోజకవర్గం
[ 28-04-2024]
భద్రాచలం లోక్సభ స్థానానికి హెలికాప్టర్ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. -
21 మంది ధరావతు కోల్పోయారు..!
[ 28-04-2024]
2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన: మంత్రులు
[ 28-04-2024]
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కానిస్టేబుల్ను సత్కరించిన డీజీపీ
[ 28-04-2024]
దమ్మపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగముత్యాన్ని డీజీపీ రవిగుప్తా శనివారం సత్కరించారు. ఈ ఏడాది మేడారం మహాజాతరలో విధులు నిర్వహించిన సమయంలో నాగముత్యం గుండెపోటుకు గురైన ముగ్గురు వ్యక్తులకు సీపీఆర్ నిర్వహించి కాపాడారు. -
రూ.63 లక్షల నగదు సీజ్
[ 28-04-2024]
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కేసీఆర్ కష్టంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: భారాస
[ 28-04-2024]
సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వర్తించాలి
[ 28-04-2024]
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్సభ స్థానం సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే అన్నారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 28-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..