అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు.
వైఎస్ఆర్ నగర్ సమీపంలో స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలను కూల్చివేస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది
ఖమ్మం కార్పొరేషన్, న్యూస్టుడే: ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. 1997, 2005 సంవత్సరాల్లో ఖానాపురం, వైఎస్ఆర్ కాలనీ స్వాతంత్య్ర సమరయోధులకు 144 చదరపు గజాల స్థలాన్ని 439కి అసైన్డ్ చేశారు. ఆ తరువాత ఆయా స్థలాలను పొందిన వారు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. కొందరు నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఇతరులకు అమ్ముకున్నారు. ఇదే సమయంలో ఒక్కో స్థలం ముగ్గురు, నలుగురు చేతులు మారింది. కొంతమంది వాటికి నకిలీ పత్రాలు సృష్టించి నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయంలో కలెక్టర్కు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సుమారు 22 కట్టడాలు, 20 పునాదులను అధికారులు కూల్చేశారు.
కొనుగోలుదారుల ఆందోళన: ఇళ్లు, పునాదులను కూల్చివేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కొనుగోలుదారులు భారీఎత్తున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కట్టడాలను కూల్చివేయడంతో వారంతా మిన్నకుండిపోయారు. అక్కడున్న అధికారులను అడిగినా తమకేమీ తెలియదని, ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే తాము అమలుచేస్తున్నామని చెప్పడంతో ఆందోళన చెందారు.
ఒకరిపై ఒకరు దాడులు: ఈ స్థలాల అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన కొంతమంది మధ్యవర్తులు అదే సమయంలో అక్కడకు చేరుకోవడంతో వివాదం చోటుచేసుకుంది. రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోగానే కొనుగోలు చేసిన కొంతమంది ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తిని నిలదీయడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అది కాస్తా ఉద్రిక్తంగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. స్థానికులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది.
నిరుపయోగ అసైన్డ్ స్థలాల స్వాధీనం: వైఎస్ఆర్ నగర్లోని సర్వే నంబర్ 37లో స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన స్థలాలు నిరుపయోగంగా ఉండటంతో వాటిని స్వాధీనపరచుకున్నట్లు అధికారులు తెలిపారు. 439 మందికి అసైన్డ్ చేయగా, కొంతమంది నిర్మాణాలు చేపట్టలేదని, మరికొందరు ఇతరులకు అమ్ముకున్నారని చెప్పారు. కూల్చివేత కార్యక్రమంలో ప్రణాళిక విభాగం ఏసీపీ వసుంధర, టీపీఎస్ సంతోష్, ఆర్ఐలు రమేష్, రవి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ గళం.. ప్రచార దళం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీల ముఖ్యనేతలకు సవాల్గా మారాయి. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై అస్త్రశస్త్రాలు సంధిస్తూనే ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. -
అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
[ 28-04-2024]
రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. -
కనుమరుగైన హెలికాప్టర్ నియోజకవర్గం
[ 28-04-2024]
భద్రాచలం లోక్సభ స్థానానికి హెలికాప్టర్ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. -
21 మంది ధరావతు కోల్పోయారు..!
[ 28-04-2024]
2019 లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం స్థానంలో 21మంది అభ్యర్థులు ధరావతు కోల్పోయారు. వీరిలో జాతీయ పార్టీలైన సీపీఎం, భాజపా అభ్యర్థులుండటం విశేషం. జనసేన అభ్యర్థి కూడా ధరావతు కోల్పోయారు. -
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన: మంత్రులు
[ 28-04-2024]
ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజా పాలన అందుతుందని.. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కానిస్టేబుల్ను సత్కరించిన డీజీపీ
[ 28-04-2024]
దమ్మపేట పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగముత్యాన్ని డీజీపీ రవిగుప్తా శనివారం సత్కరించారు. ఈ ఏడాది మేడారం మహాజాతరలో విధులు నిర్వహించిన సమయంలో నాగముత్యం గుండెపోటుకు గురైన ముగ్గురు వ్యక్తులకు సీపీఆర్ నిర్వహించి కాపాడారు. -
రూ.63 లక్షల నగదు సీజ్
[ 28-04-2024]
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కేసీఆర్ కష్టంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు: భారాస
[ 28-04-2024]
సుదీర్ఘ కాలంపాటు పోరాటం చేసి తన కష్టంతోనే ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. -
ఎన్నికల విధులు సమర్థంగా నిర్వర్తించాలి
[ 28-04-2024]
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ లోక్సభ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఖమ్మం లోక్సభ స్థానం సాధారణ పరిశీలకుడు సంజయ్ జి.కోల్టే అన్నారు. -
రామయ్యకు బంగారు తులసీ దళార్చన
[ 28-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు విశేష సంఖ్యలో దర్శనాలు చేసుకున్నారు. రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
-
ఒక్క ఫోటో .. నాలుగేళ్ల కష్టం
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..