ఆ గంట.. సొత్తు భద్రమట!
రోడ్డు ప్రమాద క్షతగాత్రులను గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతుంటారు.
సైబర్ నేరాల్లో తక్షణ ఫిర్యాదుతోనే రికవరీ సాధ్యం
- కొత్తగూడెంలోని న్యూ గొల్లగూడేనికి చెందిన యువతికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఆమె తండ్రి ఉద్యోగ విరమణ సెటిల్మెంట్కు సంబంధించిన డబ్బులు జమ చేస్తామని నమ్మబలికారు. వారు పంపిన లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలోంచి రూ.9 వేలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. కంగుతున్న బాధితురాలు నిమిషాల వ్యవధిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు సైబర్ క్రైం విభాగం సాయంతో ఖాతాలోంచి నగదు విత్డ్రా కాకుండా స్తంభింపజేశారు.
- బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఓ గృహిణి ఆన్లైన్ ప్రకటనను నమ్మి పార్ట్ టైం ఉద్యోగం కోసం ఆరు దఫాలుగా రూ.1.83 లక్షలు చెల్లించింది. ఆ తర్వాత మోస పోయానని గ్రహించింది. ఫిర్యాదు ఆలస్యం కావడంతో.. సొమ్ము రికవరీ జాప్యమవుతుందని సైబర్ క్రైం పోలీసు చెబుతున్నారు.
కొత్తగూడెం నేరవిభాగం, ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే
రోడ్డు ప్రమాద క్షతగాత్రులను గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతుంటారు. దీన్నే ‘గోల్డెన్ అవర్’గా పేర్కొంటున్నాం. నేడు రోడ్డు ప్రమాదాలకు మించిన సంఖ్యలో నమోదవుతున్నవే సైబర్ నేరాలు. వీటిల్లో ఆర్థికపరమైన కేసులే ఎక్కువ. ఈ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న నగదును తిరిగి దక్కించుకునేందుకు కూడా ‘గోల్డెన్ అవర్’ కీలకమని రాష్ట్రపోలీసు శాఖకు చెందిన సైబర్ నిపుణులు ఇటీవల అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎవరో ఒకరు సైబర్ నేరాల వలలో చిక్కుకుంటున్నారు. వారంతా ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నారు.
నేరం జరిగిందని గ్రహించిన వెంటనే బాధితులు ‘1930’ నంబరుకు ఫోన్చేయాలి. లేదా ఎన్సీఆర్పీ(నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్)లో ఫిర్యాదు నమోదు చేయాలి. అదీ.. గంట వ్యవధిలో అయితే ఫలితం ఉంటుంది. బాధితుల ఖాతాలోంచి నగదు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా స్తంభింపజేయడం (హోల్డ్) సత్వర ఫిర్యాదుతోనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉభయ జిల్లాల్లోని అన్ని స్టేషన్ల పరిధిలో ‘సైబర్ వారియర్స్’ అందుబాటులోకి వచ్చారు. ఫిర్యాదు, కేసు అనుశీలనలో వారు సహాయపడతారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలో గత మూణ్నెల్లలో వందలాది మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. వీరిలో చాలామంది గంటలోపు ఫిర్యాదు చేయలేకపోయారు. ‘బాధితులు మోసం జరిగిన గంటలోగా ఆశ్రయిస్తే రికవరీకి 90-100 శాతం అవకాశం ఉంటుంది. ఆరు గంటల వరకైతే 60%, ఆ తర్వాత కేవలం 20 శాతం వరకే రికవరీ అవకాశాలుంటాయి’ అని కొత్తగూడెం సైబర్ క్రైం సీఐ జితేందర్ వెల్లడించారు.
దేన్నీ నమ్మొద్దు.. వేటికీ స్పందించొద్దు..
లోన్లు, తాత్కాలిక ఉద్యోగాల పేరుతో యువతకు ఎర వేస్తున్నారు. ప్రకటనలు చూస్తే చాలు, డబ్బులిస్తామని ముగ్గులోకి దింపుతున్నారు. పెట్టుబడి పెడితే రెట్టింపు నగదు ఇస్తామని దోచేస్తున్నారు. సామాజిక మాధ్యమాలు, యాప్ల ఇన్స్టాల్కు వ్యక్తిగత, బ్యాంకుల సమాచారం ఇవ్వొద్దు. నకిలీ ‘మ్యాట్రిమోనీ సైట్ల’ వ్యామోహంలో చిక్కుకుంటే ఆర్థికంగా చితికినట్లే. లాటరీ గెలిచారని, ముందు కొంత డబ్బు పంపాలని గాలం వేస్తుంటారు. అలాంటి కాల్స్, మెసేజ్లను నమ్మొద్దు. ఆన్లైన్ గేమ్స్ నిండా ముంచేస్తాయి. నోయువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) అంటూ వచ్చే ఫోన్కాల్స్కు స్పందించొద్దు. అనుమానాస్పద లింక్లు ఓపెన్ చేసినా.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ఖాతాల్లోంచి నగదు మాయమవుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దు.
‘సైబర్ నేరాల కట్టడికి పోలీసు శాఖ ప్రత్యేకం యంత్రాంగం పటిష్ఠంగా పనిచేస్తోంది. ప్రజలు అవగాహనతో నేరాల తీరును గమనించాలి. స్మార్ట్ఫోన్లు ఉన్న యువత, చదువుకున్న వారే బాధితులుగా నమోదవుతున్నారు. వీరిలో మార్పు రావాలి’
బి.రోహిత్రాజు, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస హయాంలోనే సమగ్రాభివృద్ధి
[ 30-04-2024]
కాంగ్రెస్, భాజపాకు ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనని.. గులాబీ జెండా ఒక్కటే ప్రజలకు అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
గిరిజనులకు అండ.. కాషాయ జెండా
[ 30-04-2024]
కాషాయ జెండా గిరిజనులకు అండగా నిలుస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం మైదానంలో సోమవారం నిర్వహించిన భాజపా జన సభలో ఆయన ప్రసంగించారు. -
స్వయం ప్రేరణతో పోలింగ్ మెరుగు
[ 30-04-2024]
తాజా లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో రెండు దశల పోలింగ్ ముగిసింది. చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో మునుపటి (2019) ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. -
త్రిముఖ వ్యూహం.. గెలుపే లక్ష్యం
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో పాగా వేయటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, నియోజకవర్గాల వారీగా నాయకుల ప్రచారం కలిసొస్తుందని అంచనా వేస్తోంది. -
కాంగ్రెస్లో చేరిన ఇద్దరు కార్పొరేటర్లు
[ 30-04-2024]
ఖమ్మం నగరంలోని 38, 56వ డివిజన్ల భారాస కార్పొరేటర్లు ఆలియా, పైడిపల్లి రోహిణి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్లో సోమవారం చేరారు. -
అత్యధిక మెజార్టీ నామాదే!
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. -
కేంద్ర మంత్రి.. రెండుచోట్ల ఓటమి!
[ 30-04-2024]
టెలికమ్యూనికేషన్ల శాఖ కేంద్ర మంత్రిగా పని చేసిన పీవీ రంగయ్య నాయుడు 1996 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
లోక్సభ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామపత్రాల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే పోటీలో మిగిలిన 35 మంది అభ్యర్థులకు బ్యాలెట్ పత్రంలో వరుస క్రమం, ఎన్నికల గుర్తులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌతమ్ కేటాయించారు. -
32 కిలోల గంజాయి స్వాధీనం
[ 30-04-2024]
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి మృతి
[ 30-04-2024]
అశ్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి సలిగంజి వెంకటేశ్వరరావు(54) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. -
ఖమ్మం బరిలో 35.. మహబూబాబాద్లో 23 మంది
[ 30-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది, మహబూబాబాద్ స్థానంలో 23 మంది బరిలో నిలిచారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా చోట్ల వరుసగా ఆరుగురు, ఇద్దరు అభ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. -
ముత్తంగి రూపంలో రాములోరి దర్శనం
[ 30-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి సోమవారం ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతుడైన రామయ్యతండ్రి చూడముచ్చటగా కనిపించి మురిపించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి