రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు.
టీజీ ఆయిల్ఫెడ్ ఎండీతో
అశ్వారావుపేట, న్యూస్టుడే: రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్ పరిశ్రమలు, నర్సరీ, తోటలను అధికారులతో కలిసి ఆయన ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా ‘న్యూస్టుడే’తో ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..
న్యూస్టుడే: ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఎలా పూర్తి చేయనున్నారు?
ఎండీ: గత ఏడాది 40వేల ఎకరాల్లో కొత్తగా తోటలు పెంపకం చేపట్టగా.. ఈ ఏడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20వేల ఎకరాల్లో ఆయిల్పాం తోటల పెంపకానికి చర్యలు చేపట్టాం. క్షేత్రస్థాయిలో ఇబ్బందులుంటే గుర్తించి తగు చర్యలు చేపడుతున్నాం.
న్యూ: కేంద్రం తెచ్చిన ఆయిల్పాం వయబులిటీ ప్రైస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు?
ఎండీ: ఉద్యాన మిషన్ ద్వారా తెచ్చిన వయబులిటీప్రైస్తో రైతులకు ఎంతమేర లబ్ధి చేకూరుతుందన్నదీ అధ్యయనం చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది లేని విధంగా త్వరలోనే సానుకూల నిర్ణయం జరుగుతుంది. ఇది ఎన్నికల తదనంతరం ఉండనుంది.
న్యూ: సిబ్బంది లేమితో క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలపై స్పందించలేకపోతున్నారనే విమర్శలపై ఏమంటారు?
ఎండీ: సిబ్బంది కొరత వాస్తవమే. ఎన్నికల షెడ్యూలుకు ముందే ఎంపిక జరిగింది. 19మంది ఉద్యాన అధికారులకు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంపై ఈసీని కలిసి నియామకాలపై చర్చించనున్నాం. లేదా ఎన్నికల తరువాత నియమించే వీలుంది. ముందు ఎక్కడ అవసరం ఉందో అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నాం.
న్యూ: మన్యం ప్రాంతంలో పోడు పట్టాలు ఇటీవల ఇచ్చారు. ఆ రైతులకు మొక్కలు కావాలంటే సాంకేతిక ఇబ్బంది, బోర్లు కొరత వేధిస్తుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు.
ఎండీ: ఏజెన్సీలో పోడు పట్టాలు ఉన్న రైతులకు ఇప్పటికే నీటి సౌకర్యం ఉంటే వెంటనే మొక్కలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదు. నీటివసతి లేని రైతులు బోర్లు వేసుకునేందుకు వీలుగా సంబంధిత ప్రభుత్వ కార్యదర్శితో మాట్లాడి అందుకనుగుణంగా ఏర్పాటు చేయనున్నాం.
న్యూ: పామాయిల్ పరిశ్రమల సామర్థ్యం పెంపు, నూతన పరిశ్రమల నిర్మాణం ఎప్పుడు చేయనున్నారు?
ఎండీ: ప్రస్తుతం ఉన్న తోటలు, రాబోవు మూడేళ్ల కాలంలో వచ్చే దిగుబడి అంచనాను దృష్టిలో ఉంచుకొని నూతన పరిశ్రమల ఏర్పాటు, సామర్థ్యం విస్తరణ ఉంటుంది. దీనిపై లోతుగా అధ్యయనం చేయాలి.
న్యూ: రైతుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు?
ఎండీ: ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు చైతన్యవంతులు. వీరి స్ఫూర్తి రాష్ట్రానికే ఆదర్శం. కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి మరీ వ్యవసాయంపై దృష్టి పెడుతున్న రైతులు ఈ ప్రాంతంలోనే కనిపిస్తారు. మూస పద్ధతులకు స్వస్తిచెప్పి ఆధునిక సేద్య విధానాలతో రాణిస్తున్నారు. చిన్నచిన్న సమస్యలు రైతులే పరిష్కరించుకుంటారు. వారి వల్ల సాధ్యం కాని పక్షంలో అధికార యంత్రాంగం ద్వారా పరిష్కరిస్తాం.
న్యూ: క్షేత్రస్థాయి సమస్యలను ఎలా అధిగమించనున్నారు?
ఎండీ: నేను ఎండీగా బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులే అవుతోంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలున్నాయో అధ్యయనం చేస్తున్నాను. త్వరలో ఉద్యాన, ఆయిల్ఫెడ్ క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషిచేస్తాను. ఆ తరువాత లక్ష్యాల సాధనపై దృష్టిపెడతాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామయ్య హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు
[ 02-05-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయాన్ని కోవెల ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో గురువారం లెక్కించారు. -
అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు మండలం పోచారం తండా, మాణిక్యారం గ్రామాల్లో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ కరుణాకర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
సినీ నటుడు వెంకటేశ్ కుమార్తె ప్రచారం
[ 02-05-2024]
సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ కూతురు ఆశ్రిత బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓట్లు భద్రం.. తీర్పు సుస్పష్టం..!
[ 02-05-2024]
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
భగభగలు
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఖమ్మం జిల్లా బుధవారం నిప్పులగుండంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
పోలింగ్ సమయంలో అప్రమత్తత అవసరం: కలెక్టర్
[ 02-05-2024]
పోలింగ్ సమయంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. -
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: పొంగులేటి
[ 02-05-2024]
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు -
ఈసారీ అధిక మెజార్టీ ఇవ్వండి: నామా
[ 02-05-2024]
గత లోక్సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
అభ్యర్థుల్లో వాటా 3 శాతమే
[ 02-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు. -
మేడే వద్దన్న మోదీని వదిలించుకుందాం: తమ్మినేని
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. -
రాములోరికి ఘనంగా తిరుమంజనం
[ 02-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం తిరుమంజనం పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ తిరుమంజనం కొనసాగించారు -
స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలి: ఎస్పీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసులు కృషిచేయాలని ఎస్పీ బి.రోహిత్రాజు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి