వివిధ అనుమతులకు సువిధ
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం:సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు.. సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా ఈసీ అనుమతి తప్పనిసరి. ఇందుకు గతంలో సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి అనుమతులు పొందాల్సి వచ్చేది. కార్యాలయాల చుట్టూ అభ్యర్థులు తిరిగేవారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు సువిధ యాప్ను ఈసీ ప్రవేశపెట్టింది.
అన్ని వివరాలు సమర్పించాల్సిందే..
ప్రచార అనుమతులు పొందాలనుకునే అభ్యర్థులు ఎన్నికల సంఘం కోరిన వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు సంబంధించి దరఖాస్తుతో పాటు వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, యజమాని, డ్రైవర్ పేర్లు, చిరునామా, ఫోన్ నంబరు తదితర వివరాలు జతపరచాలి. వాహనం సంచరించే ప్రదేశాల వివరాలు తెలియజేయాలి. వాహన తనిఖీ అధికారి నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి. తాత్కాలిక ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు భవన యజమాని అనుమతి, లేదా అద్దె తదితర వివరాలతో దరఖాస్తు సమర్పించాలి. ర్యాలీలు, రోడ్డుషోలు, ఇతర కార్యాక్రమాల అనుమతికి ప్రదేశం, రూట్మ్యాప్, ర్యాలీలో పాల్గొనే వారి సంఖ్య, తేదీ, సమయం, ఇతర వివరాలను రిటర్నింగ్ అధికారికి తెలియజేసి అనుమతి పొందాలి. బహిరంగ సభల నిర్వహణ సమయంలో హెలిప్యాడ్ అనుమతికి జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్) అనుమతి కోసం 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి.
48 గంటల్లోనే..
పోలింగ్ సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందుకు సంబంధించిన అనుమతుల కోసం ‘సువిధ’ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వెబ్సైట్ suvidha.eci.gov.in లో ఫోన్ నంబరు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అభ్యర్థులకు కావాల్సిన అనుమతుల కోసం పోర్టల్లో దరఖాస్తు సమర్పించాలి. సంబంధిత అధికారులు 48 గంటల్లో అనుమతులిస్తారు లేదా తిరస్కరిస్తారు. అనుమతించిన వాటికి రాతపూర్వకంగా ధ్రువపత్రం అందిస్తారు. ఇలా కాకుండా నేరుగా ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పారదర్శక ఎన్నికలకు తోడ్పాటు
ఎన్నికల ప్రక్రియలో జవాబుదారితనం పెంచటమే కాకుండా ఈసీ నిబద్ధతను చాటడానికి సువిధ యాప్ ఉపయోగపడుతుంది. ఎన్నికల వాతావరణాన్ని సులభతరం చేయటంతో పాటు రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు అవసరమైన అనుమతుల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు తోడ్పడుతుంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని అంచనా వేసేందుకు దోహదపడుతుంది. అనుమతులు లేకుండా ప్రచారం చేసే వారిని గుర్తించటం తేలికవుతుంది. తద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవటం సులభతరం అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇల్లందు మండలం పోచారం తండా, మాణిక్యారం గ్రామాల్లో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ కరుణాకర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
సినీ నటుడు వెంకటేశ్ కుమార్తె ప్రచారం
[ 02-05-2024]
సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్ కూతురు ఆశ్రిత బుధవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఓట్లు భద్రం.. తీర్పు సుస్పష్టం..!
[ 02-05-2024]
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈవీఎంలలో ఓటు భద్రమేనా అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. -
భగభగలు
[ 02-05-2024]
భానుడి భగభగలతో ఖమ్మం జిల్లా బుధవారం నిప్పులగుండంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. -
పోలింగ్ సమయంలో అప్రమత్తత అవసరం: కలెక్టర్
[ 02-05-2024]
పోలింగ్ సమయంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. -
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: పొంగులేటి
[ 02-05-2024]
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు -
ఈసారీ అధిక మెజార్టీ ఇవ్వండి: నామా
[ 02-05-2024]
గత లోక్సభ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
అభ్యర్థుల్లో వాటా 3 శాతమే
[ 02-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా చైతన్యానికి ప్రతీక. ఏ ఎన్నిక జరిగినా ఓటు జాబితాలో మహిళోత్సాహం ఎక్కువనే చెప్పాలి. వివిధ ఎన్నికల్లో పురుషుల కంటే ఎక్కువగా వీరే ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చటంలో కీలకపాత్ర వహించారు. -
మేడే వద్దన్న మోదీని వదిలించుకుందాం: తమ్మినేని
[ 02-05-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే విదేశీయులదని, దీన్ని రద్దు చేస్తామని పిలుపునిచ్చిన ప్రధాని మోదీని రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఓడించి వదిలించుకుందామని, కార్మికుల ఐక్యతను చాటుదామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. -
రాములోరికి ఘనంగా తిరుమంజనం
[ 02-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో బుధవారం తిరుమంజనం పూజను ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు వేదమంత్రాల నడుమ తిరుమంజనం కొనసాగించారు -
స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలి: ఎస్పీ
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసులు కృషిచేయాలని ఎస్పీ బి.రోహిత్రాజు సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్