logo

చంద్రబాబు, లోకేష్‌ కోలుకోవాలని పూజలు

కరోనా బారిన పడిన తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని కోరుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో గురువారం స్థానిక షిర్డీ సాయిబాబా మందిరంలో బాబాకు విశేష పూజలు నిర్వహించారు.

Published : 21 Jan 2022 03:11 IST

నాయకులతో కలిసి భోజనం వడ్డిస్తున్న తెదేపా

నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవదత్‌

తిరువూరు, న్యూస్‌టుడే: కరోనా బారిన పడిన తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌ త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని కోరుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో గురువారం స్థానిక షిర్డీ సాయిబాబా మందిరంలో బాబాకు విశేష పూజలు నిర్వహించారు. చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక ఐడియాస్‌ సేవా సంస్థ ఆశ్రమంలో చిన్నారులకు అన్నదానం చేశారు. తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి శావల దేవదత్‌, తెలుగు యువత నాయకులు పిట్టా చైతన్య, బొల్లినేని నాగేంద్రకుమార్‌, షేక్‌ హుస్సేన్‌, కోట నరేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని