నేరగాళ్లపై నిఘా కరవు
కర్నూలులో వడ్డె రంగమురళిపై 2013 అక్టోబరు 10న హత్య కేసు నమోదైంది. పోలీసులు అతనిపై మీద రౌడీషీట్ తెరవలేదు. పోలీసుల నిఘా లేకపోవటంతో ఇటీవల ఓర్వకల్లు మండలంలో వడ్డె రంగమురళి మరో హత్యకు పాల్పడ్డాడు. కర్నూలులోని ఎస్.నాగప్పవీధికి చెందిన ఓ పాతనేరస్థులపై
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: కర్నూలులో వడ్డె రంగమురళిపై 2013 అక్టోబరు 10న హత్య కేసు నమోదైంది. పోలీసులు అతనిపై మీద రౌడీషీట్ తెరవలేదు. పోలీసుల నిఘా లేకపోవటంతో ఇటీవల ఓర్వకల్లు మండలంలో వడ్డె రంగమురళి మరో హత్యకు పాల్పడ్డాడు. కర్నూలులోని ఎస్.నాగప్పవీధికి చెందిన ఓ పాతనేరస్థులపై గొడవలు, దౌర్జన్యాలు, స్థల ఆక్రమణలు, మట్కా కార్యకలాపాలు వంటి ఆరోపణలున్నాయి. పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయినా పోలీసులు అతనిపై రౌడీషీటు తెరవలేదు. గతేడాది మేలో ఓ బ్యాంకు అధికారిని హత్య చేశాడు.
నేరగాళ్లపై రౌడీషీటు తెరిచే విషయంలో పలువురు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నిఘా తగ్గడంతో తరుచూ నేరాలకు పాల్పడుతున్నారు. వీరితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి.
నంద్యాలలో ఏం జరిగింది
కానిస్టేబుల్ సురేంద్రకుమార్(35) ఆదివారం రాత్రి హత్యకు గురయ్యారు. పలు హత్య కేసుల్లో నిందితులు.. రౌడీ షీటర్లు పట్టణంలో తిరుగుతూ దందాలు చేస్తున్న వారే హత్య కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలుస్తోంది.
రౌడీషీటు తెరవడంతో తాత్సారం
రెండు కంటే ఎక్కువ కేసులు నమోదై ఉండి, నేర ప్రవృత్తిని కొనసాగించే వారిపైన రౌడీషీటు తెరవాల్సి ఉంది. దౌర్జన్యం, భూకబ్జాలు, దాడులు, హత్య, హత్యాయత్నం, పోక్సో వంటి తీవ్రమైన నేరాల్లో నిందితులలోపాటు ఫ్యాక్షనిస్టులపై రౌడీషీటు తెరవొచ్చు. జిల్లాలో చాలామంది నేరగాళ్లపై రౌడీషీటు లేదు. అధిక కేసులు నమోదైనా, హత్య కేసుల్లో నిందితులైనప్పటికీ తెరవలేదు. దీంతో నేరగాళ్లు యథేచ్ఛగా తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు నేరస్తులు రాజకీయ నాయకుల చేత సిఫార్సు చేయించుకుని షీట్లలో ఎక్కకుండా తప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో కొందరు పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
మంత్రణం మరిచారు
జిల్లా వ్యాప్తంగా దాదాపు 1300 మంది రౌడీషీటర్లు ఉన్నారు. అయితే వారిపై నిఘా ఉండటం లేదు. గస్తీ పోలీసులు వీరి ప్రవర్తనపై ఆరా తీయటం లేదు. ప్రతి ఆదివారం అన్ని పోలీసుస్టేషన్లలో నిర్వహించే రౌడీషీటర్ల మంత్రణానికి చాలామంది డుమ్మా కొడుతున్నారు. రౌడీషీటర్లు అధికారంలో ఉండే పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పోలీసు చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. పలువురు పోలీసు అధికారులూ అధికారపార్టీకి అనుకూలంగా ఉండే రౌడీషీటర్లకు మినహాయింపు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
గాడి తప్పిన గస్తీ
రౌడీషీట్లరపై గస్తీ పోలీసులు నిరంతరం నిఘా ఉంచాలి. వారి ప్రవర్తన తీరుపై తెలుసుకోవాలి. నేరాలకు పాల్పడకుండా తరచూ మంత్రణం చేయాలి. ఇవేవీ సక్రమంగా చేపట్టడం లేదు. పోలీసు ఔట్పోస్టు తొలగించటంతో జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్